అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర మియామీ నగరంలో 12 అంతస్తుల భవనం కుప్పకూలింది. మొత్తం 136 ఫ్లాట్లలో 55 ఫ్లాట్లు కూలినట్టు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా… 159 మంది ఆచూకీ లభ్యం కాలేదు. అర్ధరాత్రి ఒకటిన్న సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ సిబ్బంది… సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. చాంప్లైన్ టవర్స్ సౌత్ బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్నేళ్ల […]
గుంటూరు గ్యాంగ్ రేప్ కేసు మరో మలుపు తిరిగింది. ప్రధాన నిందితుడు కృష్ణ తల్లి మల్లీశ్వరి పరారైంది. నిన్న సాయంత్రం ఇంటికి తాళం వేసి.. ఇద్దరు పిల్లలతోపాటు వెళ్లిపోయినట్టు సమాచారం. కృష్ణ ఆదేశాలతోనే తల్లి మల్లీశ్వరి పరారైనట్టు పోలీసులు భావిస్తున్నారు. నంబర్ ప్లేట్లు లేని రెండు బైకులపై నిన్న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లినట్టు స్థానికులు చెప్తున్నారు. మరో నిందితుడు వెంకటరెడ్డి తల్లి, చెల్లి, భార్యను… ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు అయితే ఆరు రోజులు గడుస్తున్నా… కృష్ణ, […]
రాష్ట్రంలో.. దేశంలో.. అంతెందుకు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత ఘటన చోటు చేసుకున్నా.. అది శ్రీ పోతులూరి వీర బ్రహ్మంగారు ముందే చెప్పారని చెబుతుంటారు.. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా విషయంలోనూ బ్రహ్మంగారు ముందే చెప్పారని ఆధారాలు చూపుతున్నారు.. కానీ, మరోవైపు బ్రహ్మంగారిమఠంలో మఠాధిపతి వ్యవహారం పెద్ద రచ్చగా మారడం చాలా మందిని విస్మయానికి గురిచేసింది.. పలు దపాలుగా చర్చల తర్వాత ఇవాళ కొలిక్కి వచ్చింది మఠాధిపతి వ్యవహారం… దీంతో.. బ్రహ్మంగారిమఠం మఠాధిపతి ఎంపిక పూర్తి అయినట్టే […]
పాన్ కార్డు, ఆధార్ అనుసంధానం గడువును ఇప్పటికే పలు దపాలుగా పొడిగిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరోసారి ఆ గడువును పొడిగిస్తూ ప్రకటన చేసింది.. గతంలో ప్రకటించిన ప్రకారం ఈ నెల 30వ తేదీతో గడువు మిగిసిపోనుండగా… ఆ తేదీని సెప్టెంబర్ 30వ వరకు పొడిగించారు.. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. మరోవైపు వివాద్ సే విశ్వాస్ పథకం గడువును ఆగస్టు 31వ తేదీ వరకూ పొడిగించింది కేంద్రం… […]
వచ్చేఏడాది ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి.. కానీ, ఇప్పుడు విమర్శలు, ఆరోపణలు కాకరేపుతున్నాయి.. తాజాగా.. కాంగ్రెస్ పార్టీ, సమాజ్ వాది పార్టీని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా.. ఇస్లామిక్ ఉగ్రవాదులతో స్నేహం నెరుపుతాయని కాంగ్రెస్, ఎస్పీపై ఆరోపణలు గుప్పించిన ఆయన.. పేదలకు డబ్బు ఆశ చూపి మదర్సాలు మత మార్పిళ్లకు పాల్పడుతున్నాయని ఫైర్ అయ్యారు.. ముస్లిం దేశాల నుంచి నేరుగా మతం మారిన పేదల ఖాతాల్లో నగదు జమ […]
కరోనా మహమ్మారికి చెక్పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్… దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది… మొదటల్లో ప్రజల్లో భయం ఉన్నా.. క్రమంగా వ్యాక్సిన్ సెంటర్లకు వచ్చేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.. ఇక, వ్యాక్సిన్ల కొరతతో కొంత కాలం తెలంగాణలో వ్యాక్సిన్ వేయడమే నిలిపివేసిన పరిస్థితి.. కానీ, ఇప్పుడు రాష్ట్రంలోనూ వ్యాక్సినేషన్ చురుకుగా సాగుతోంది.. రాష్ట్రంలో నేటితో కోటి డోసులు పూర్తి చేసినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది.. ఇప్పటి వరకు తెలంగాణలో 1,00,53,358 డోసుల వాక్సినేషన్ వేశామని… అందులో […]
రైతులకు పంట పెట్టుబడి సాయానికి ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చారు సీఎం కేసీఆర్.. ప్రతీ పంటకు రైతుల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తున్నారు.. ఈ నెల 15వ తేదీ నుంచి క్రమంగా రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తుండగా.. ఇవాళ్టి వరకు రాష్ట్రవ్యాప్తంగా 60.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7360.41 కోట్లు జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.. 147.21 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు విడుదల అయ్యాయని.. మిగిలిపోయిన […]
మరియమ్మ లాకప్డెత్ కేసు సంచనలం సృష్టించింది.. ఇప్పటికే ఈ కేసులో.. ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు రాచకొండ పోలీస్ కమిషనర్.. అయినా.. విమర్శలు తగ్గడంలేదు.. దానికి తోడు ఇవాళ కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ను కలిసి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు.. ఇక, మరియమ్మ లాకప్డెత్ వ్యవహారంపై సీరియస్ అయ్యారు సీఎం కేసీఆర్.. లాకప్డెత్కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని ఉద్యోగంలో […]
ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యవహారం ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది.. తాజాగా, ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు… తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్న భాష సంస్కారానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించిన ఆయన… రాయలసీమ జిల్లాలు తాగు నీటి, సాగు నీటికి ఇబ్బందులు పడుతున్న ప్రాంతమని… కానీ, హీరోయిజం కోసం, రాజకీయాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవుపలికారు.. మరోవైపు.. వ్యవసాయ ఉత్పత్తులను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తున్నామని.. చంద్రబాబు, లోకేష్ జూమ్ […]
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదంలో ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతలు హాట్ కామెంట్లు చేసుకుంటున్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ మొదట్లో ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారు.. రాయలసీమ రైతులకు నీళ్ల కోసం సహకరిస్తా అని తెలిపారు.. కానీ, ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం నాకు నచ్చలేదు అన్నారు.. అయితే, దాని గురించి మాట్లాడటం నాకు ఇష్టంలేదన్నారు పెద్దిరెడ్డి.. కానీ, మాకు ఎంత నీరు కావాలో అంతే తీసుకుంటామని స్పష్టం […]