ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో నిన్న ఉదయం 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 91,231 సాంపిల్స్ పరీక్షించగా.. 3,620 మంది పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 41 మంది కోవిడ్తో మృతిచెందారు.. చిత్తూరు జిల్లాలో ఏడుగురు, కృష్ణా జిల్లాలో ఆరుగురు, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాలో ఐదుగురు చొప్పున, గూంటురు, […]
కరోనాకు చెక్పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. భారత్లో వ్యాక్సినేషన్ను మరింత విస్తృతం చేసేందుకు విదేశీ వ్యాక్సిన్లకు సైతం అనుమతులు ఇస్తూ వస్తోంది భారత్.. ఇప్పటికే స్వదేశంలో తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్ అందుబాటులో ఉండగా.. రష్యా తయారు చేసిన స్పూత్నిక్ వీకు కూడా గ్రీన్ సిగ్నల్ రాగా.. తాజాగా.. అమెరికా కంపెనీ మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్ దిగుమతితో పాటు అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది.. మోడెర్నా వ్యాక్సిన్ను […]
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమైన వైఎస్ షర్మిల… తెలంగాణలో రాజన్నరాజ్యమే లక్ష్యంగా ముందుకు సాగుదామని ప్రకటించారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆదిలోనే ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది.. ఎందుకంటే.. అప్పటి వరకు తెలంగాణ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న గట్టు శ్రీకాంత్ రెడ్డి… ఏప్రిల్ 3వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు.. తెలంగాణ వైసీపీ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేసిన ఆయన.. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, ఏపీ […]
తెలంగాణ జెన్కో, ట్రాన్స్కోలకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. విద్యుత్ ఉద్యోగుల విభజన వ్యవహారంలో ఈ చర్యలకు పూనుకుంది.. విధుల్లో చేరేందుకు తమకు అనుమతి ఇవ్వడం లేదంటూ 84 మంది విద్యుత్ ఉద్యోగులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. కాగా, గతంలో 1,150 మంది విద్యుత్ ఉద్యోగులను ఏపీ, తెలంగాణలకు 50 శాతం చొప్పున కేటాయించారు. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 […]
రైతు బంధు పథకం డబ్బుల విషయంలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ను సూటిగా ప్రశ్నించారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి… ఈటల రాజీనామా తర్వాత ఆయన రైతు బంధు పథకం కింద ఇప్పటి వరకు ఎంత అందుకున్నది అనే లెక్కలు వైరల్గా మారిపోయాయి.. అయితే, తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన పల్లా… రైతు బంధు వద్దు అనిపించినప్పుడు సీఎం కేసీఆర్కు ఎందుకు చెప్పలేక పోయారంటూ ఈటలను నిలదీశారు.. ఇక, హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 25 […]
భారత భూభాగంలోకి డ్రోన్లు చొచ్చుకు రావడం… దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. జమ్మూలోని ఎయిర్ఫోర్స్ స్టేషన్లోకి డ్రోన్లను పంపి… ఐఈడీలను జారవిడిచారు. అర్ధరాత్రి తర్వాత రెండు డ్రోన్లు రావడంతో… జవాన్లు వీటిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వాయుసేన సిబ్బందికి గాయాలయ్యాయి.. వాయుసేన స్థావరంపై దాడి జరిగిన 24 గంటల్లోనే మరో సైనిక స్థావరం వద్ద డ్రోన్ల సంచరించడం ఆందోళనకు గురి చేస్తోంది. డ్రోన్ల దాడి తర్వాత… జమ్ములో హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు, జవాన్లు… ప్రతి […]
ప్రేమించిన యువతి కోసం ఓ యువకుడు దేశ సరిహద్దులు దాటాడు.. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. మళ్లీ సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించి బీఎస్ఎఫ్కు చిక్కాడు… దేశ సరిహద్దులు దాటిని ఆ లవ్ స్టోరీకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లా బల్లావ్పూర్కు చెందిన జైకాంతో చంద్రరాయ్ అనే యువకుడికి బంగ్లాదేశ్కు చెందిన పరిణితి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది.. అది కాస్త ప్రేమగా మారింది. దీంతో.. పెళ్లి చేసుకొని ఒక్కటవ్వాలనుకున్నారు.. ఆ లోచన […]
కరోనా థర్డ్వేవ్కు అవకాశం ఉందంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించొద్దని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ విజ్ఞప్తి చేశారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం, భయపడకుండా ఉండటమే దీనికి మంత్రంగా పనిచేస్తుందని తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటించడమే థర్డ్వేవ్ ముప్పు నుంచి రక్షణ పొంగలగమన్నారు. వైద్యులకు నాదో చిన్న విన్నపం. థర్డ్వేవ్పై భయాందోళనలు సృష్టించవద్దు. ఎందుకంటే దీనికి ప్రాథమిక సూత్రం ముందు జాగ్రత్తే గాని భయాందోళనకు గురికావడం కాదు” అని సూచించారు. థర్డ్వేవ్ గురించి మాట్లాడేందుకు బదులుగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సెకండ్ వేవ్పై […]
పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ను తొలగించాలంటూ కేంద్రానికి మూడు లేఖలు రాశామన్నారు సీఎం మమతా బెనర్జీ. గవర్నర్ ధన్కర్ అవినీతిపరుడని, 1996కు చెందిన హవాలా జైన్ కేసులో ఆయనపై చార్జ్షీట్లు కూడా ఉన్నాయని మమత ఆరోపించారు. బెంగాల్ గవర్నర్ను తొలగించాలని మమతా బెనర్జీ డిమాండ్ చేయడం ఇది కొత్త కాదు. గతంలో కూడా బహిరంగంగానే ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. బెంగాల్ అల్లర్లకు సంబంధించి కేంద్రానికి గవర్నర్ తప్పుడు సమాచారం ఇస్తున్నారని, గవర్నర్ను వెంటనే వెనక్కి […]