మోహన్ దాస్ కరంచంద్ గాంధీ… ఆయనే మహాత్మా గాంధీ.. 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్ బందర్లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించిన ఆయన.. జాతిపితగా అందరూ గౌరవించే స్థానానికి ఎదిగారంటే.. ఆయన నమ్మిన సత్యం, అహింస సిద్ధాంతాలు.. సహాయ నిరాకరణ, సత్యాగ్రహం లాంటి ఆయుధాలు.. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే నంటూ ఆయన వేసిన అడుగులే కారణం.. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో […]
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై కదలిన జనసేన పార్టీ.. ఎక్కడికక్కడ శ్రమదానంతో రోడ్లను కొంతమేరకు అయినా బాగుచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.. తూర్పు గోదావరితో పాటు అనంతపురం జిల్లాలో పవన్ పర్యటన కొనసాగనుంది.. అయితే.. పవన్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.. పవన్, రాజమండ్రి సభకోసం జనసేన ఏర్పాట్లు చేస్తోంది. సర్కార్కు పవన్కు మధ్య తాజాగా రగులుతున్న రాజకీయం నేపథ్యంలో సత్తా చాటాలని జనసేన […]
ప్రతీ ఏడాది తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం… ఇక, ఈ ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా ఇచ్చే చీరల పంపిణీ ఇవాళ ప్రారంభం కానుంది.. ఇప్పటికే జీహెచ్ఎంసీతో పాటు ఆయా జిల్లాల్లో చీరల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. రాష్ట్రంలో అర్హులైన మహిళలకు చీరల పంపిణీ శనివారం నుంచి చేస్తామని టెస్కో ఎండి శైలజా రామయ్యర్ వెల్లడించారు.. ఆహారభద్రత కార్డు కింద పేర్లు నమోదైన 18 ఏళ్లు […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి తన సొంత జిల్లాలో పర్యటనకు వెళ్లనున్నారు.. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకోనున్నారు సీఎం వైఎస్ జగన్.. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్లు పరిశీలించారు. ఇడుపులపాయలోని హెలిప్యాడ్, సీఎం బస చేసే నివాసం వద్ద పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇక, ఇవాళ రాత్రి ఇడుపులపాయలోనే […]
క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ చాలా దేశాలు అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేస్తూ వస్తున్నాయి.. అయితే, ఇటీవల ఆ నిబంధనలు సడలించిన యూకే.. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రం క్వారంటైన్ తప్పనిసరి చేసింది. యూకేలో అడుగుపెట్టాలంటే కొవిడ్-19 పరీక్షకు సంబంధించి నెగటివ్ రిపోర్టును తప్పనిసరి చేయడమే కాదు.. 10 రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని పేర్కొంది. భారత్ ఈ వ్యవహారంపై దీలుగా స్పందించింది. అలాంటి ఫార్ములానే యూకే పౌరులకు వర్తిస్తుందని పేర్కొంది.. అక్టోబర్ 4వ […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సొంత జిల్లాలో పర్యటనకు సిద్ధం అయ్యారు.. రేపు, ఎల్లుండి సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్లు పరిశీలించారు. ఇడుపులపాయలోని హెలిప్యాడ్, సీఎం బస చేసే నివాసం వద్ద పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇక, రేపు రాత్రి ఇడుపులపాయలోనే బస చేస్తారు సీఎం వైఎస్ […]
హర్యానాలో రైతులు..భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది, జజ్జర్లో ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా కార్యక్రమానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. రైతులను ఆపడానికి నీటి ఫిరంగులను ప్రయోగించారు పోలీసులు. అయితే… నల్ల జెండాలతో రైతులు ముందుకే సాగిపోయారు. ఈ సందర్భంగా పోలీసులు-రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల దగ్గర నెలల తరబడి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక..ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు తమ విధులకు […]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.. పవన్, రాజమండ్రి సభకోసం జనసేన ఏర్పాట్లు చేస్తోంది. సర్కార్కు పవన్కు మధ్య తాజాగా రగులుతున్న రాజకీయం నేపథ్యంలో సత్తా చాటాలని జనసేన నేతలు భావిస్తున్నారు. భారీ ఎత్తున జనసమీకరణతో బలాన్ని నిరూపించే ప్రయత్నాల్లో ఉన్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీపైన పవన్ బహిరంగ సభ జరగాల్సి ఉంది. కానీ, పోలీసుల అనుమతి నిరాకరణతో రాజమండ్రి రూరల్ బాలాజీపేట సెంటర్కు […]
కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోట్ విడుదల చేసింది. దీనితో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఈ నెల 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 11వ తేదీ వరకు పరిశీలన ప్రక్రియ పూర్తవుతుంది. ఈ నెల 30న ఎన్నిక, నవంబర్ రెండున కౌంటింగ్ ఉంటుంది. ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కావటంతో ఈసీ… రాజకీయ పార్టీలతో సమావేశాన్ని నిర్వహించింది. కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రకారం […]
హుజురాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొదటి రోజే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తన నామినేషన్ పత్రాలను ఆర్డీవో కార్యాలయంలో సమర్పించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్లో ఆయన తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. చరాస్తుల విలువ 2 లక్షల 82 వేలు కాగా, స్థిరాస్తుల విలువ 20 లక్షలుగా పేర్కొన్నారు. ఆయన ఏడాది సంపాదన 4 లక్షల 98 వేలు. హుజూరాబాద్ ప్రజలు తనని ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు […]