ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లోని 57 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. జూన్ 10వ తేదీన పోలింగ్ జరగనుండగా.. అదే రోజు ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.. ఈనెల 24వ తేదీన రాజ్యసభ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.. ఇక, జూన్ 1న నామినేషన్లు పరిశీలన, జూన్ 3న నామినేషన్ల విత్ డ్రాకు చివరి తేదీ కాగా.. […]
ఆంధ్రప్రదేశ్ను వణికించిన ‘అసని’ తుఫాన్ క్రమంగా బలహీనపడుతోంది.. మచిలీపట్నం తీరానికి దగ్గరగా తీవ్ర వాయుగుండం నుంచి వాయుగుండంగా బలహీన పడిన ‘అసని’.. గత 6 గంటల్లో స్థిరంగా ఉండి అక్కడే బలహీనపడిందని.. కొన్ని గంటలు ఇదే ప్రాంతం చుట్టూ తిరుగుతూ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ […]
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ తీరాన్ని దాటింది.. ‘అసని తుపాను’ తీవ్రవాయుగుండంగా బలహీనపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరం వైపుగా కదిలి మచిలీపట్నం – నరసాపురం మధ్య ఆంధ్రప్రదేశ్లో తీరాన్ని దాటిందని ప్రకటించింది రాష్ట్ర విపత్తుల సంస్థ.. ఇక, రేపు ఉదయానికి అసని తుఫాన్ మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తన ప్రకటనలో పేర్కొన్నారు ఏపీ విపత్తలు సంస్థ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్. అసని తుఫాన్ బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి మచిలీపట్నం […]
ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యానాథ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనపై తనదైన ముద్ర వేశారు.. ఇక, ఈ మధ్యే జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయంతో మరోసారి సీఎం అయ్యారు.. అయితే, యూపీ డీజీపీ ముకుల్ గోయల్పై వేటు వేశారు సీఎం యోగి.. ముకుల్ గోయల్ను విధుల నుంచి అర్ధాంతరంగా తప్పిస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు.. తమ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించిన నేపథ్యంలోనే యోగీ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.. Read […]
దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది సీబీఐ.. ఒకేసారి 40 చోట్ల దాడులు నిర్వహించాయి సీబీఐ అధికారుల బృందాలు… ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు 16 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు.. ముఖ్యంగా విదేశీ నిధులతో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థల్లో సోదాలు జరిగాయి.. 14 మంది ఎన్జీవోల సంబంధించిన వారిని అరెస్టు చేసినట్టుగా తెలుస్తుండగా.. ఆరుగురు ప్రభుత్వం ఉద్యోగులను కూడా సీబీఐ అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. స్వచ్ఛంద సంస్థల ముసుగులో పెద్దఎత్తున డబ్బులను రాబడుతోన్న వ్యవహారాలను కేంద్రం సీరియస్గా […]
పాకిస్థాన్ అంతర్గత అంశాలు ఎలా ఉన్నారు.. ఇప్పుడు ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది.. భారత్తో పాకిస్థాన్ వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించాలని నిర్ణయానికి వచ్చింది.. దీనికోసం ప్రత్యేకంగా ఓ మంత్రిని కూడా నియమించింది పాకిస్థాన్. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్కు ఇదో ఊరట అని విశ్లేషిస్తున్నారు.. ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఫెడరల్ క్యాబినెట్ సమావేశంలో, భారత్తో వాణిజ్యాన్ని పునఃప్రారంభించే దిశగా కృషి చేయాలని నిర్ణయించారు. ఇక, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందిన కమర్ […]
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. మంగళవారం 9 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత .. పూజా సింఘాల్ బుధవారం మళ్లీ విచారణకు హాజరయ్యారు.. ఇక, ఆమెకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలను సేకరించిన ఈడీ.. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసింది.. కాగా పూజా సింఘాల్.. ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్ర గనులశాఖ కార్యదర్శిగా ఉన్నారు.. కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడటంతోపాటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ […]
తాజ్ మహల్ కట్టింది మా స్థలంలోనే అంటున్నారు బీజేపీ ఎంపీ దియా కుమారి.. దానికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని చెబుతున్నారు.. దీంతో, ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒక్కటైనా తాజ్ మహల్.. మరోసారి వార్తల్లో నిలిచినట్టు అయ్యింది.. బీజేపీ ఎంపీ మరియు జైపూర్ మాజీ యువరాణి అయిన దియా కుమారి.. తాజ్ మహల్ నిర్మించిన భూమి వాస్తవానికి మా కుటుంబానికి చెందినదని పేర్కొన్నారు. జైపూర్ రాజకుటుంబం భూమిపై దావా వేసినట్లు తన వద్ద పత్రాలు […]
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.. మూడేళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంజాయ్ చేశారు.. మిగిలిన రెండేళ్లు కార్యకర్తల్ని అక్కున చేర్చుకుని మంచి చేస్తే మరోసారి ఎమ్మెల్యేలు అవుతారన్న ఆయన.. లేక పోతే పుట్టగతులు కూడా ఉండవు అంటూ హెచ్చరించారు.. ఇక, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ఎమ్మెల్యేలను సహించబోనంటూ వార్నింగ్ ఇచ్చిన బాలినేని.. ఈ విషయంలో నాపై సీఎం వైఎస్ జగన్ కి ఫిర్యాదులు చేసుకున్నా భయపడేదిలేదన్నారు. Read Also: Telangana: […]
సీడబ్ల్యూసీకి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది.. కేంద్ర జలసంఘంలోని ప్రాజెక్టు అప్రైజల్ డైరెక్టరేట్ కు లేఖ రాశారు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్.. కర్ణాటక చేపట్టిన అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు అనుమతులపై అభ్యంతరం వ్యక్తం చేశారు.. ఆ రెండు ప్రాజెక్టులకు అనుమతులు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.. అంతర్ రాష్ట్ర అంశాలు, ట్రైబ్యునల్ తీర్పులను పరిగణనలోకి తీసుకోకుండా అనుమతులు ఇవ్వరాదని సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళ్లింది తెలంగాణ.. రెండు ప్రాజెక్టులకు అనుమతులతో కృష్ణాకు తుంగభద్ర నుంచి ప్రవాహాలు […]