తెలంగాణలో ఈ మధ్య వరుసగా అమ్మాయిలపై జరుగుతోన్న అఘాయిత్యాలు, దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి.. వరుస ఘటనలో వెలుగు చూస్తుండడంతో.. బెంబేలెత్తిపోతున్నారు తల్లిదండ్రులు.. ఇక, ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒంటరిగా ఉన్న యువతిపై దాడి చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న యువతిపై గుర్తు తెలియని ఆగంతకుడు దాడికి ఒడిగట్టాడు. యువతి గొంతు కోసి పరారయ్యారు.. గాయాలపాలైన యువతిని భువనగిరి ఏరియా ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతోంది. […]
తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 29,084 మంది శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 493 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 219 మంది కోవిడ్ బాధితులు పూర్తి స్థాయిలో కోలుకున్నారు..
మహారాష్ట్రలోని అన్ని పోలీస్ స్టేషన్లు, ముఖ్యంగా ముంబైలోని అన్ని పోలీస్ స్టేషన్లను అలెర్ట్ చేసింది పోలీసు డిపార్ట్మెంట్... శివసైనికులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి రావొచ్చన్న సమాచారం పోలీసులకు చేరడంతో.. శాంతిభద్రతలు దెబ్బతినకుండా చూసేందుకు అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
రామ్ గోపాల్ వర్మ పనికి మాలిన వ్యక్తి.. అయన తాగి ట్వీట్స్ చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆర్జీవీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్