గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తే.. వైసీపీ సర్కార్.. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెబుతోంది.. ఆ దిశగా అడుగులు వేస్తోంది.. అయితే, ఏపీ లెజిస్లేటివ్ క్యాపిటల్గా మారనున్న అమరావతిని.. మున్సిపాలిటీ చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. 22 గ్రామపంచాయతీలతో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు చేయసేందుకు సిద్ధమైంది.. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 22 గ్రామాలతో మున్సిపాలిటీ ఏర్పాటు కానున్నట్టు సమాచారం.. ఈ మేరకు, గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ […]
హైదరాబాద్ మహా నగరంలో గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక స్థానం ఉంది.. తొమ్మిదిరోజుల పాటు గణపయ్యను భక్తి శ్రద్ధలతో.. భజన కీర్తనలు, ఆటాపాటలతో కొలిచిన భక్తులు.. ఆయన్ని గంగమ్మ ఒడికి చేర్చేందుకు సమయం దగ్గర పడింది.. సాధారణంగా.. గణేష్ చవితి మలి రోజు నుంచే.. చిన్ని చిన్న వినాయకులు మొదలు… కొన్ని పెద్ద విగ్రహాలను కూడా నిమజ్జనం చేస్తూ వస్తుంటారు.. కానీ, హైదరాబాద్ లోని మహా నిమజ్జన కార్యక్రమం మాత్రం రెండు రోజుల పాటు సాగుతోంది.. బాలాపూర్ గణపతి […]
కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన వర్షాలు మళ్లీ దంచికొడుతున్నాయి.. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో గత రెండు రోజులుగా.. కాస్త గ్యాప్ ఇచ్చి.. ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి.. వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.. వాహనదారులు.. ఓ వైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్ జామ్లతో నరకం చూస్తున్నారు.. అయితే, తెలంగాణలో వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు.. […]
టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్పై మరోసారి ధ్వజమెత్తారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని.. లోకేష్ కి ట్విట్టర్ ఒకటి తేరగా దొరికింది.. ఏదంటే అది ట్వీట్ చేస్తున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.. లోకేష్ మంత్రి ఎలా అయ్యాడు…? అని ప్రశ్నించారు. ఆ రోజు మంత్రి పదవి పీకేస్తే పీతల సుజాత బోరు బోరున విలపించారన్న ఆయన.. మరి అప్పుడు ఇదే మాట తండ్రికి ఎందుకు చెప్పలేదు? మీ హయాంలో బొజ్జల, […]
భారత భాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.. తూర్పుగోదావరి జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఉప రాష్ట్రపతి అయిన సమయంలో ఆయన అనుభవించిన బాధను పంచుకున్నారు.. ఉపరాష్ట్రపతి అయిన సందర్భంలో తాను పార్టీ (భారతీయ జనతా పార్టీ)ని వీడినందుకు చాలా బాధపడ్డానని గుర్తుచేసుకున్నారు… చిన్నప్పుడు తల్లి ప్రేమకు నోచుకోలేదు.. చిన్నప్పుడే తల్లి మరణించడంతో అమ్మమ్మ పెంచింది.. నన్ను పార్టీయే ఇంత వాడిని చేసింది అంటూ భావోద్వేగానికి గురయ్యారు.. Read Also: Katrina Kaif: అసలు […]
టెస్లా మరియు స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్.. మరోసారి ట్విట్టర్ను టార్గెట్ చేశారు.. ట్విట్టర్ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించి.. ఆ తర్వాత డీల్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే, ఆ డీల్ను ప్రతిపాదించిన నాటి నుంచీ.. ట్విట్టర్పై అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు.. అదే డీల్ రద్దు వరకు వెళ్లింది.. అయితే, సమయం దొరికిన ప్రతీసారి అన్నట్టుగా ట్విట్టర్పై తన కోపాన్ని వెల్లగక్కుతూనే ఉన్నారు మస్క్.. తాజాగా మరోసారి సోషల్ మీడియా దిగ్గజాన్ని టార్గెట్ చేశారు.. […]
తెలంగాణ ప్రభుత్వం హిందూ పండగలపై ఆంక్షలు విధిస్తుందని.. కేసీఆర్ సర్కార్కి బతుకమ్మపై ఉన్న శ్రద్ధ వినాయక చవితి ఉత్సవాలపై ఎందుకు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్రావు.. దీక్షకు దిగిన విషయం తెలిసిందే.. హిందూ పండగలపై ఆంక్షలు విధించాలని చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించిన ఆయన.. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు. అయితే, బేగంబజార్లోని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి కార్యాలయంలో నిన్న మధ్యాహ్నం […]
తెలంగాణ జాతీయ సమైఖ్యత దినోత్సవాలు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో.. సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి సమీక్ష నిర్వహించారు.. జిల్లా కలెక్టర్లు, పోలీసు కమీషనర్లు/ పోలీసు సూపరింటెండెంట్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్, డీజీపీ… 16వ తేదీన రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 15,000 మంది పాల్గొనేలా ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. ర్యాలీ తర్వాత బహిరంగ సభను నిర్వహించాలి.. ప్రతి జిల్లాకు […]
తెలంగాణలోని కొన్ని ప్రాంతాలతో పాటు.. హైదరాబాద్లో కుండ పోత వర్షాలు కురుస్తున్నాయి… మంగళవారం.. ఇవాళ ఉదయం నుంచి మూడు నాలుగు దపాలుగా మహానగరంలో భారీ వర్షం దంచికొట్టింది… ఇక, లోతట్టు ప్రాంతాలతో పాటు.. రోడ్లపై వాహనదారులు నరకం చూడాల్సి వచ్చింది.. అయితే, మంగళవారం నుంచి కురుస్తోన్న భారీ వర్షంతో.. పలు కాలనీలు వరదనీటిలో మునిగిపోయాయి… మూసీ నదిలో మళ్లీ వరద పోటెత్తింది. మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసీ ప్రవాహం మూసారాంబాగ్ బ్రిడ్జి పై […]
అదనంగా డబ్బు సంపాదించి, తమ కుటుంబానికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని ఎంతో మంది భావిస్తారు.. ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్తారు.. అయితే, ఇదే సమయంలో.. కొందరు ఏజెంట్ల బారిన పడి.. నిండా మునగడమే కాదు.. జైలులో మగ్గాల్సిన పరిస్థితి.. సంపాదన లేదు.. కుటుంబానికి దూరమై.. జైలులో ఒంటరిగా మగ్గాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.. ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం జిల్లాకు చెందిన మహిళలు నకిలీ వీసా ఏజెంట్ల బారిన పడ్డారు. నకలీ వీసా మోసానికి గురైన పలువురు మహిళలు కేరళలో […]