ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. శ్రీకాకుళంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలకు ఇచ్చే ఇళ్లకు జగనన్న ఇల్లు అనే పేరు పెట్టుకోవటానికి వీలు లేదన్నారు.. ప్రధానిమంత్రి ఆవాస్ యోజన అని పేరు పెట్టకపోతే జగనన్న కాలనీలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తా.. కేంద్రం నిధులు నిలిపేస్తామని హెచ్చరించారు.. ఇక, రాష్ట్రంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న స్పీకర్, మంత్రులు అర్ధరహితమైన భాష మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. […]
ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు, ప్రజల తరుపున ఎవరు నిలబడ్డారో ప్రజలకు తెలుసు అని వ్యాఖ్యానించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. మూడు రాజధానులపై హాట్ హాట్గా చర్చ సాగుతోన్న సమయంలో.. ఓవైపు మూడు రాజధానులు.. మరోవైపు అమరావతి రాజధాని డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న సమయంలో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.. శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ అద్దె బస్సులను ప్రారంభించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్టీసి ప్రయాణం సుఖం , సురక్షితం అన్నారు.. ఆర్టీసీ బస్సులను వాడుకొనపొవడమే ప్రమాదాలకు […]
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రాజధానిగా అమరావతి వైఎస్ జగన్ సమర్ధించలేదన్నారు.. మూడు రాజధానులపై సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన నిర్వహించారు.. ర్యాలీ ప్రారంభానికి ముందు భూమనపై పూల వర్షం కురిపించారు.. మూడు రాజధానులు, రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ గుండె చప్పుడు వినిపిస్తూ మహా ప్రదర్శన జరిగింది.. స్థానిక కృష్ణాపురం ఠాణా […]
విద్యార్థినులపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఉన్న ప్రాంతంలో చుట్టుపక్కలవారితో ఆడపిల్లలకు రక్షణ అనుమానంగా మారిపోయింది.. ఎక్కడికైనా వెళ్లాలన్నా.. ఎక్క ఏ కామాంధుడు ఉన్నాడో తెలియని పరిస్థితి.. తీరా చదువుకునే ప్రాంతంలోనూ వేధింపులు తప్పడంలేదు.. తాజాగా, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నిట్లో కీచకపర్వం వెలుగుచూసింది. బయోటెక్నాలజీ లెక్చరర్ తమిళమణి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని… విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కాలేజీ అడ్మినిస్ట్రేషన్ భవనం దగ్గర ధర్నా చేశారు. లెక్చరర్ను విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో క్యాంపస్లో కాసేపు […]
ఎట్టకేలకు ట్విట్టర్ని కొన్నాడు ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్.. ట్విట్టర్ తన చేతికి రాగానే ముగ్గురు కీలక ఉద్యోగుల్ని తొలగించాడు. అయితే, వాళ్లకు పరిహారంగా 200 మిలియన్ అమెరికా డాలర్లు చెల్లిస్తున్నాడు. మన కరెన్సీలో అక్షరాల 16 వందల 46 కోట్ల రూపాయలు. గోల్డెన్ పారాచూట్ షరతులో భాగంగా ఈ మొత్తాన్ని చెల్లిస్తున్నారు. ఎలాన్ మస్క్ తొలగిస్తున్న ముగ్గురిలో ఇద్దరు భారత సంతతికి చెందిన వాళ్లు. ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్, లీగల్ పాలసీ హెడ్ విజయ […]
కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమోటా ధర దారుణంగా పడిపోయింది.. దీంతో. లబోదిబోమంటున్నారు రైతులు. అధిక వర్షాల వల్ల టమోటా బాగా దెబ్బతినడంతో రైతులు బాగా నష్టపోతున్నారు.. ఉన్న కాస్త పంట కూడా చేతికి వచ్చి మార్కెట్ కి తీసుకెళ్తే.. కిలో 4 రూపాయలు కూడా ధర లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మద్దికేర ఆస్పరి దేవనకొండ మండలాల నుండి టమోటాను మార్కెట్ కు తరలిస్తుంటారు రైతులు.. రెండు రోజుల నుండి […]
కాంగ్రెస్ పార్టీ అధ్యాయం ముగిసింది.. 2024లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు... 2024లో తిరిగి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.
తన సంతోషాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు.. ఏవైనా కొత్త వస్తువులు కొనుగోలు చేసినప్పుడు.. ఇల్లు, కారు, బైక్.. ఇలా ఏది కొత్తగా తమ ఫ్యామిలీలో చేరినా.. కొందరు సైలెంట్గా సెలబ్రేట్ చేసుకుంటే.. మరికొందరు మాత్రం.. హంగామా చేస్తారు.. సుక్క, ముక్క దావత్లు ఇస్తారు.. పూజలు చేస్తారు.. కానీ, ఓ యువకుడు మరో అడుగు ముందుకు వేశాడు.. తాను కొన్న కొత్త బైక్కు ఓ రేంజ్లో పబ్లిసిటీ ఇచ్చేశాడు.. ఊరుఊరంతా తెలిసేలా ఊరేగింపు నిర్వహించాడు.. బ్యాంగ్ […]
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి…? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=FDkvqoKaCE8
టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న నిరాహార దీక్షను భగ్నం చేశారు పోలీసులు.. ఉత్తరాంధ్ర ప్రజా సమస్యలపై పోరాటం కోసమంటూ బుద్దా వెంకన్న బయలుదేరగా.. పోలీసులను ఆయన్ని అడ్డుకున్న విషయం తెలిసిందే.. దానికి నిరసనగా నిరాహార దీక్ష చేపట్టారు వెంకన్న.. ఉత్తరాంధ్రలో టీడీపీ నాయకులు పోరాడితే వైసీపీ నేతల దోపిడి బయటపడుతుంది అనే భయంతో.. ఇలా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.. అయితే, తన నివాసంలోనే నిరాహార దీక్షకు దిగిన బుద్దా వెంకన్నను అర్ధరాత్రి ఆస్పత్రికి తరలించారు పోలీసులు.. […]