Free Rice:కొత్త సంవత్సరం వచ్చేసింది.. జనవరి నెల ప్రారంభమై 10 రోజులు గడిచినా.. సంక్రాంతి పండుగ సమీపిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రేషన్ పంపిణీ చేయడం లేదు ఏంటి? అంటూ రేషన్కార్డు దారులు అంతా ఎదురుచూస్తున్నారు.. సాధారణంగా 5వ తేదీ నుంచి డీలర్లు బియ్యం పంపిణీ ప్రారంభిస్తారు.. కానీ, ఈ నెల మాత్రం 10వ తేదీ దాటినా బియ్యం పంపిణీ ప్రారంభం కాకపోవడంపై విమర్శలు వెళ్లువెత్తాయి.. ఈ సమయంలో శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. నేటి నుంచి […]
Baby Powder: జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి భారీ ఊరట లభించింది. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ను తయారు చేయడానికి, విక్రయించడానికి మరియు పంపిణీ చేయడానికి బాంబే హైకోర్టు ఇవాళ అనుమతి ఇచ్చింది.. మహారాష్ట్ర ప్రభుత్వం కంపెనీ లైసెన్స్ను రద్దు చేస్తూ, ఉత్పత్తి తయారీ మరియు అమ్మకాలను నిలిపివేయాలని కోరింది.. అది కఠినమైన, అసమంజసమైన మరియు అన్యాయమైనదిగా పేర్కొంటూ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది.. అయితే, ఆ మూడు ఉత్తర్వులను రద్దు చేసింది బాంబే హైకోర్టు.. […]
Penalty on Google: గూగుల్కు నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లోనూ షాక్ తగిలింది.. ప్లేస్టోర్ విషయంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఇచ్చిన ఉత్తర్వులపై మధ్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది ఎన్సీఎల్ఏటీ.. ఇప్పటికే విధించిన జరిమానా మొత్తం రూ.936.44 కోట్లలో 10 శాతం సొమ్మును నాలుగు వారాల్లో తమ రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాల్సిందేనని స్పష్టం చేస ఇంది.. దీంతో, ఎన్సీఎల్ఏటీలో వారం రోజుల వ్యవధిలోనే గూగుల్కు వరుసగా రెండు ఎదురుదెబ్బలు తగిలినట్టు […]
YCP vs YCP: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. వైసీపీ, టీడీపీ మహిళా కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో హై టెన్షన్ నెలకొంది. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జి దేవినేని అవినాష్.. నిన్న తారకరామ నగర్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లారు. ఓ మహిళ ఇంటిపై టీడీపీ జెండా కనిపించడంతో.. ఎవరు పెట్టారని ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన ఆమె మమ్మల్ని స్థానిక […]
Off The Record: మైలవరం నియోజకవర్గం ఇప్పుడు ఉమ్మడి కృష్ణాజిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో ఈ సెగ్మెంటులో వసంత వర్సెస్ దేవినేని అన్నట్టు ఉండేది. గత కొంతకాలంగా మైలవరంలో వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా మారిపోయింది. దీంతో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైఖరి ఆసక్తిగా మారింది. గతంలో ఒకట్రొండు సందర్బాల్లో మంత్రి జోగి రమేష్ వంటి నేతలను ఉద్దేశించి వసంత కొన్ని కామెంట్లు చేసినా.. ఆ తరవాత అధిష్ఠానం జోక్యంతో గొడవ సద్దుమణిగిందనే […]
Off The Record: టీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత మొదటిసారి బహిరంగ సభకు రెడీ అవుతోంది. మొదట్లో దేశ రాజధాని డిల్లీలో బహిరంగ సభ నిర్వహించాలని అనుకున్నారు. అయితే తొలిసభ తెలంగాణలోనే అట్టహాసంగా నిర్వహించి ప్రయాణం మొదలుపెట్టాలని డిసైడైంది. ఈ నెల 18న ఖమ్మంలో 5 లక్షల మందితో సభ పెట్టి దేశం దృష్టిని ఆకర్షించాలని అనుకుంటున్నారు గులాబీ నేతలు. తెలంగాణలోపాటు ఏపీ సరిహద్దు నియెజకవర్గాల్లోని ప్రజలను సభకు సమీకరించాలనేది పార్టీ నిర్ణయం. […]
Gaddar: ప్రజా సమస్యలపై మరోసారి పోరాటానికి సిద్ధం అవుతున్నారు ప్రజా యుద్ధనౌక గద్దర్.. ఇవాళ శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరుబాట పడతానని ప్రకటించారు.. చిక్కోలు (శ్రీకాకుళం)లో నిర్మించిన ఉద్యమ మార్గం లక్ష్యాన్ని చేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, దివంగత ప్రజాగాయకుడు వంగపండుతో కలిసి ఒకే పాటను 32 భాషల్లో పాడి లక్షలాది మందిని ఉద్యమం వైపు కదిలించామని గుర్తుచేసుకున్నారు.. మరోవైపు.. భారత రాజ్యాంగం ఒక పుస్తకం […]
పవన్ కల్యాణ్ అంటే నాకు అభిమానం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. పవన్ కల్యాణ్ మా వాడు.. అభిమానం ఉందన్న ఆయన.. మా సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ మీద మాకు అభిమానం ఉండదా..? అని ఎదురు ప్రశ్నించారు.. అయితే, పవన్ చేష్టల వల్ల కాపుల పరువు తీస్తున్నాడనే బాధ మాకుందన్నారు.. ఇక, సీఎం.. సీఎం.. అంటూ పవన్ కల్యాణ్ను చూసి నినాదాలు చేస్తున్నవారికి ఆయన అన్యాయం చేస్తున్నారని […]
Seediri Appalaraju:మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ను టార్గెట్ చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పవన్ ఓ వెర్రిబాగులోడు అంటూ పవన్ కల్యాణ్పై ఫైర్ అయ్యారు.. నారాలోకేష్ యువగళం.. పవన్ యువశక్తి అని పేర్లు పెట్టారంటే.. కథ, స్క్రీన్ ప్లే అంతా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే సిద్ధం అవుతుంది.. పవన్ కల్యాణ్ కేవలం రేటు తీసుకున్న యాక్టర్ మాత్రమే నంటూ సంచలన ఆరోపణలు చేశారు.. పవన్ కల్యాణ్, చద్రబాబు కలవడం వెనుక […]
Minister Vidadala Rajini: యువశక్తి పేరుతో కార్యక్రమానికి నిర్వహించేందుకు సిద్ధమైంది జనసేన పార్టీ.. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భేటీపై సెటైర్లు వేశారు మంత్రి విడదల రజిని.. ఇక, పవన్ కల్యాణ్ తన కార్యక్రమానికి యువశక్తి అని కాకుండా నారా శక్తి అని పేరుపెట్టుకుoటే బాగుండేదని ఎద్దేవా చేశారు.. చంద్రబాబుని ఏవిధంగా కుర్చీలో కూర్చోబెట్టాలి అన్న అజెండా తప్ప పవన్ కల్యాణ్కు ఇంకో అజెండా లేదని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఏ […]