Telangana High Court: హైడ్రా కమిషనర్కు హైకోర్టు షాక్.. రంగనాథ్కు భారీ జరిమానా విధింపు..
- హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు హైకోర్టు రూ.50 వేల జరిమానా..
- కౌంటర్లు దాఖలు చేయకుండా కాలయాపన చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..
- జరిమానా మొత్తాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిలీఫ్ ఫండ్కు జమ చేయాలని ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana High Court: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది.. ఆయనకు రూ.50 వేల జరిమానా విధించింది. కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడంలో జాప్యం చేయడం, పలుమార్లు అవకాశం ఇచ్చినప్పటికీ తగిన స్పందన లేకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ జరిమానా విధించింది.. హైదరాబాద్లోని యూసుఫ్గూడ సర్వే నంబర్ 45లో ఉన్న రెండు ఎకరాల వివాదాస్పద భూమికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. సంబంధిత భూమిపై ఇప్పటికే కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు జోక్యం చేసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు.
ఈ వ్యవహారంలో హైడ్రా తరఫున కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయితే, పలుమార్లు గడువు ఇచ్చినప్పటికీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంతో పాటు కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరు కాకపోవడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. తర్వాత దాఖలైన కౌంటర్ పిటిషన్ కూడా సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైనట్లు కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో కమిషనర్ ఏవీ రంగనాథ్పై రూ.50 వేల జరిమానా విధిస్తూ, ఆ మొత్తాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిలీఫ్ ఫండ్కు జమ చేయాలని ఆదేశించింది.
Also Read
- Hyderabad: డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు దూసుకెళ్లిన యువకుడు.. కానిస్టేబుల్కు కాలు ఫ్రాక్చర్.!
- CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
- Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
- Bandi Sanjay : 'జెన్-జీకి మంత్రి పదవులు ఇవ్వండి'.. రేవంత్కు బండి సంజయ్ సవాల్
ఈ కేసును విచారించిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు సంబంధిత అంశాలపై పూర్తి వివరాలతో కోర్టుకు సమాధానం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. యూసుఫ్గూడ భూమి వివాదానికి సంబంధించిన ఈ కేసులో హైడ్రా అధికారుల వ్యవహార శైలిపై కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తదుపరి విచారణలో ఈ వ్యవహారంపై మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
AK 47: వెంకటేష్ ‘చిట్టిబాబు’ ల్యాండింగ్.. సంక్రాంతి కాదు, ఈసారి దసరాకే!
-
Dharmendra Pradhan: రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్కు ధర్మేంద్ర ప్రధాన్.. ఘన స్వాగతం పలికిన ఎన్డీఏ ఎంపీలు
-
Dhanush Politics: విజయ్ తర్వాత రాజకీయాల్లోకి ధనుష్?.. బహిరంగ సభతో రాజకీయ ఎంట్రీపై ఊహాగానాలు
-
Student Death: సీఎంతో మాట్లాడిన విద్యార్థిని ఆత్మహత్య.. రంపచోడవరంలో కలకలం!
-
Bhatti Vikramarka: ఏ విద్యార్థి ఆకలితో ఉండకూడదు.. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభం.!
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!