Cibil Report: సిబిల్ నివేదిక.. మహిళలపై సంచలన విషయాలు వెలుగులోకి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cibil Report: బ్యంకులు రుణాలు ఇస్తూ ఉంటాయి.. తిరిగి చెల్లించేవాళ్లు.. బ్యాంకులకు పంగనామాలు పెట్టేవారు కూడా లేకపోలేదు.. అయితే, క్రెడిట్ రీసెర్చ్ సంస్థ ట్రాన్స్యూనియన్ సిబిల్ నివేదిక మహిళల గురించి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది.. గత ఐదేళ్లలో తమ సొంత వ్యాపారాలను నిర్మించుకునేందుకు రుణాలు కోరుతున్న మహిళల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని క్రెడిట్ రీసెర్చ్ సంస్థ ట్రాన్స్యూనియన్ సిబిల్ సోమవారం ఒక నివేదికలో తెలిపింది. ఈ కాలంలో మహిళా రుణగ్రహీతల సంఖ్య 15 శాతం వార్షిక వృద్ధి రేటు (CAGR) సాధించిందని ఆ అధ్యయనం తెలిపింది. ఈ సమయంలో పురుష రుణగ్రహీతల సంఖ్య 11 శాతం మాత్రమే పెరిగింది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
“మా ఇటీవలి విశ్లేషణ భారతదేశంలోని గ్రామీణ మరియు సెమీ-అర్బన్ లో స్త్రీల ద్వారా రుణాలు తీసుకోవడంలో వేగవంతమైన వృద్ధిని చూపుతోంది. మహిళా రుణగ్రహీతల వాటా 2017లో 25 శాతం నుంచి 2022 నాటికి 28 శాతానికి పెరిగింది’’ అని ట్రాన్స్యూనియన్ సిబిల్ నివేదికలో పేర్కొంది. అయితే, నివేదిక విషయాలను దృష్టిలో ఉంచుకుని, దాదాపు 454 మిలియన్ల మహిళల్లో, 63 మిలియన్ల మంది మాత్రమే క్రియాశీల రుణగ్రహీతలు అని పేర్కొన్నారు. మొత్తం వయోజన జనాభాకు రుణగ్రహీతల శాతాన్ని సూచించే మహిళలకు రుణ సదుపాయం 2017లో ఏడు శాతం నుంచి 2022 నాటికి 14 శాతానికి పెరిగిందని పేర్కొంది.
“ఈ డేటా భారతదేశం అంతటా మహిళలకు రుణ సదుపాయాన్ని అందించడానికి రుణదాతల యొక్క భారీ సామర్థ్యాన్ని చెబుతుంది, ఆర్థిక చేయూతలో వారికి సాధికారత కల్పిస్తుంది అని నివేదిక పేర్కొంది. పురుషుల కంటే మహిళలు మెరుగైన రిస్క్ ప్రొఫైల్ను కలిగి ఉన్నారని, 51 శాతం పురుష రుణగ్రహీతలతో పోలిస్తే 57 శాతం మంది మహిళా రుణగ్రహీతలు ప్రైమ్ లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ను కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది. మహిళలు పొందే క్రెడిట్ ఉత్పత్తులపై అంతర్దృష్టులు వ్యక్తిగత రుణాలు మరియు వినియోగదారు డ్యూరబుల్ లోన్లు వంటి వినియోగ-ఆధారిత క్రెడిట్ ఉత్పత్తులు మహిళా రుణగ్రహీతలలో ప్రజాదరణ పొందుతున్నాయని వెల్లడిస్తున్నాయి అని వెల్లడించింది. వ్యాపార రుణాలను కోరుతున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరగడం భారతదేశంలో మహిళల నేతృత్వంలోని స్టార్టప్ల వృద్ధికి ప్రతిబింబంగా ఉందని నివేదిక పేర్కొంది. ఈ కాలంలో (2017 నుండి 2022 వరకు) ఓవర్-ఆల్ బిజినెస్ లోన్ పోర్ట్ఫోలియోలో మహిళల వాటా 20 శాతం నుండి 32 శాతానికి పెరిగింది. అయితే, ప్రతి ఏటా మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన నివేదికను ప్రకటిస్తుంది సిబిల్..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!