Wedding: పెళ్లి పీటలపై ఆగిన పెళ్లిళ్లు సినిమాల్లో చూస్తుంటాం.. పెళ్లి జరుగుతుండగా.. ఎవరో ఒకరు వచ్చి.. ఆ పండీ అనే డైలాగ్ వేయడం పాత సినిమాల్లో చూశాం.. అయితే, నిజం జీవితంలోనూ తరచూ పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. అయితే, ఓ పెళ్లికూతురు కాసేపట్లో పెళ్లనగా కాబోయేవాడి మెడలో వరమాల వేస్తూ.. వరుడు నల్లగా ఉన్నాడు నేను చేసుకోనని మొండికేసింది.. అసలే ఈ జనరేషన్లో పెళ్లి చూపుల తర్వాతే ఆగడంలేదని విమర్శలు ఉన్నాయి.. ఫోన్లు, చాటింగ్లు, […]
MP Margani Bharat: రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్పై కేసు నమోదు చేశారు దెందులూరు పోలీసులు.. దెందులూరు జాతీయ రహదారిపై ఈనెల 12వ తేదీన టూ వీలర్ వాహనాన్ని ఎంపీ భరత్ బంధువుల కారు ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో సింగవృక్షం నరసయ్య అనే వ్యక్తి మృతి చెందాడు.. అయితే, ప్రమాదానికి కారణమైన కారులో ఎంపీ మార్గాని భరత్ ఉన్నారని అనుమానిస్తున్నారు మృతుని బంధువులు.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు మృతుని కుమారుడు కిరణ్ బాబు.. దీంతో.. […]
NTV Daily Astrology As on May 18th 2023: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి…? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=Tw-EPYzFE2w
AP Crime: ప్రకాశం జిల్లాలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని దారుణ హత్యకు గురైంది.. వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు క్రాస్ రోడ్ వద్ద సాఫ్ట్వేర్ ఇంజినీర్ రాధను దారుణంగా హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న రాధ.. ఇటీవలే తన సొంత గ్రామానికి వెళ్లింది.. అయితే, నిన్న సాయంత్రం నుండి కనిపించకుండా పోయింది.. దీంతో.. తెలిసినవారి ఇల్లు, బంధువుల ఇళ్లలో వెతికిన కుటుంబసభ్యులు.. ఎంతకీ ఆచూకీ దొరకకపోవడంతో.. చివరకు పోలీసులను ఆశ్రయించారు.. తమ కూతురు […]
Heat Wave Alert: ఎండలు మండిపోతున్నాయి.. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఇదే సమయంలో.. వడగాల్పులు విరుచుకుపడుతున్నాయి.. దీంతో, అత్యవసరం అయితేనే బయటకు రావాలని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు.. నేడు ఆంధ్రప్రదేశ్లోని మన్యం జిల్లా కొమరాడ, వైఎస్ఆర్ జిల్లా చాపాడు, వీరపనాయునిపల్లె, కమలాపురం, వల్లూరు, ముద్దనూరు, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మండల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం అధికంగా ఉంటుందని.. ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు […]
* బెంగళూరు: ఈ రోజు రాత్రి 7 గంటలకు కర్ణాటక సీఎల్పీ భేటీ.. సమావేశానికి ప్రతి ఒక్కరు తప్పని సరిగా హాజరు కావాలంటూ KPCC అధ్యక్షుడి హోదాలో DK శివకుమార్ లేఖ.. కాంగ్రెస్ ఎంపీలు కూడా హాజరవ్వాలని పిలుపు * ఈ రోజు ఢిల్లీ నుంచి బెంగళూరుకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. * హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ.. కొత్త సచివాలయంలో మొదటి కేబినెట్ సమావేశం .. జూన్ 2 […]
Snake: ఎండలు మండిపోతున్నాయి.. ఇంటి నుంచి బయటకు అడుగు బయటపెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. మనుషులే కాదు.. మూగజీవాలు, జంతువులు, పక్షులు, పాములు కూడా అల్లాడి పోతున్నాయి.. ఎండ వేడి తట్టుకోలేక.. ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి వెళ్లిపోతున్నాయి.. వాతావరణ శాఖ అధికారులు కూడా అత్యవసరం అయితేనే బయటకు రండి.. వడగాలులు, వేడి గాలులు, అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.. ఓ నాగు పాము ఎండకు అల్లాడిపోయింది.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ నాగుపాము ఎండవేడికి తట్టుకోలేక.. నీటి […]
Five AP villages appealed to Governor: భద్రాచలం సరిహద్దులో ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని ఆ ఐదు గ్రామాల ప్రజలు గవర్నర్ తమిళిసైకి విజ్ఞప్తి చేశారు. భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన సందర్బంగా గిరిజనులతో ఆరోగ్య రక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా పురుషోత్తమపట్నం, ఎటపాక, పిచుకుల పాడు, కన్నాయిగూడెం, గుండాలకు చెందిన గిరిజనులు గవర్నర్ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఏపీలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నాం, ఏపీ […]
Bandi Sanjay Kumar: మరో 5 నెలలు ఆగండి.. తెలంగాణ ప్రజలే కేసీఆర్ సర్కార్ను నిషేధించబోతున్నారు అని జోస్యం చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నంచే మీడియాను కూడా కేసీఆర్ ప్రభుత్వం నిషేధిస్తోంది. ఉద్యమించే నాయకులను అరెస్ట్ చేసి బెదిరిస్తోంది. మరో 5 నెలలు ఆగండి.. తెలంగాణ ప్రజలే కేసీఆర్ సర్కార్ ను నిషేధించబోతున్నారు అని పేర్కొన్నారు.. తెలంగాణ సబ్బండ వర్గాలు అల్లాడుతుంటే.. వందల కోట్ల ప్రజా ధనంతో […]
Telangana Secretariat: సచివాలయంలోకి వెళ్ళే వారికి ఇకపై డిజిటల్ పాస్లను ఇవ్వాలని సెక్యూరిటీ అధికారులు ఆలోచిస్తున్నారు. డిజిటల్ పాసులతో సచివాలయంలోకి అడుగు పెట్టిన వారు.. ఒక శాఖకు చెందిన అధికారులను మాత్రమే కలవడానికి అవకాశం ఉంటుంది. డిజిటల్ పాస్ తీసుకొని సచివాలయంలోకి వెళ్ళిన తరువాత గతంలో మాదిరిగా తనకు అవసరం ఉన్న ఇతర శాఖల అధికారులతో మాట్లాడి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని అనుకుంటే.. ఇకపై కుదరదు. సచివాలయంలోకి వెళ్ళాలి అనుకుంటే ఏ శాఖ అధికారులను కలవాలో ముందుగా […]