Vaibhav Sooryavanshi: సచిన్ లాంటి ప్రతిభ కానీ.. వైభవ్ సూర్యవంశీపై కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు!
- భారత క్రికెట్లో చర్చనీయాంశంగా వైభవ్ సూర్యవంశీ
- వైభవ్ ప్రతిభపై కపిల్ దేవ్ ప్రశంసలు
- వైభవ్ సూర్యవంశీ ఇంకా చాలా చిన్నవాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kapil Dev Warns Against Putting Too Much Pressure on Vaibhav: భారత క్రికెట్లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన ప్లేయర్ యువ సంచలనం ‘వైభవ్ సూర్యవంశీ’. కేవలం 15 ఏళ్ల వయసులోనే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న ఈ యువ సంచలనం.. భవిష్యత్తు భారత స్టార్గా ఇప్పటికే గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ఐపీఎల్ 2026 సీజన్లో ఆరెంజ్ క్యాప్తో పాటు ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ (ఎంవీపీ) అవార్డును కూడా సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే వైభవ్ ప్రతిభపై ప్రశంసలు కురిపించిన భారత 1983 ప్రపంచకప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్.. అతనిపై ఇప్పుడే భారీ అంచనాలు ఉంచడం సరైంది కాదన్నాడు. వైభవ్ భవిష్యత్తును అంచనా వేయడానికి ఇంకా సమయం అవసరమని పేర్కొన్నాడు.
‘వైభవ్ సూర్యవంశీ ఇంకా చాలా చిన్నవాడు. కానీ అతను ప్రత్యేకమైన ప్రతిభ కలిగిన ఆటగాడనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం అతని ప్రపంచం మొత్తం క్రికెట్ మాత్రమే. వైభవ్ వయసు ఇప్పుడు 15. 20-22 ఏళ్ల వయసుకు చేరుకున్న తర్వాత అతని కెరీర్ను అంచనా వేయవచ్చు. ప్రతిభ మాత్రం అసాధారణం’ అని కపిల్ దేవ్ చెప్పాడు. అంతేకాకుండా వైభవ్ను భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్తో పోల్చాడు. ’16 ఏళ్ల వయసులో సచిన్ ఎలా ఆడాడో, వైభవ్ కూడా అలాంటి ప్రతిభను కలిగి ఉన్నాడు. కానీ సచిన్లా చాలా కాలం పాటు నిలకడగా రాణించగలడా లేదా అనేది భవిష్యత్తే నిర్ణయిస్తుంది. అతడు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది’ అని చెప్పాడు.
Also Read
- Shresta Iyer: శ్రేయస్ అయ్యర్ సోదరికి అత్యాచార బెదిరింపులు.. శ్రేష్ఠ అయ్యర్ ఆవేదన
- Vaibhav Sooryavanshi: "ఆ బుడ్డోడిని ఎలా దెబ్బకొట్టాలో మాకు తెలుసు".. ఇంగ్లాండ్ దిగ్గజాల సంచలన కామెంట్స్!
- Shreyas Iyer: "ఆ ప్లేయర్స్ మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నారు".. ఘోర ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ ఆవేదన!
- IND vs ENG: తీరుమారని భారత్.. 12 ఏళ్ల తర్వాత టీమిండియాపై ఇంగ్లాండ్ టీ20 సిరీస్ విజయం.!
వైభవ్పై అధిక అంచనాలు పెట్టుకోవద్దని కపిల్ దేవ్ ఇదివరకు కూడా సూచించాడు. యువ ఆటగాడికి గౌరవం ఇవ్వడం తప్పు కాదని, కానీ అతను జాతీయ జట్టులోకి కొత్తగా వచ్చిన ఈ దశలో అతని నుంచి అద్భుతాలు ఆశించడం సరికాదని పేర్కొన్నాడు. ‘క్లబ్ క్రికెట్ ఆడటం వేరు, దేశం కోసం ఆడటం వేరు. అంతర్జాతీయ క్రికెట్లో ఒత్తిడి, బాధ్యతలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. కాబట్టి అతనికి సమయం ఇవ్వాలి. వెంటనే భారీ అంచనాలు పెట్టి ఒత్తిడి తీసుకురావద్దు’ అని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల శ్రీలంకలో జరిగిన ట్రై-నేషన్ ‘ఏ’ సిరీస్లో కూడా వైభవ్ చెలరేగిపోయాడు. ఫైనల్లో కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేసి భారత్ ‘ఏ’ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. 11 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. త్వరలో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో భారత సీనియర్ టీ20 జట్టుకు అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Rose Plant Care: గులాబీ మొక్కకు మొగ్గలు రావట్లేదా? ఈ సులభమైన చిట్కాలు పాటిస్తే పూలతో నిండిపోతది
-
Shresta Iyer: శ్రేయస్ అయ్యర్ సోదరికి అత్యాచార బెదిరింపులు.. శ్రేష్ఠ అయ్యర్ ఆవేదన
-
Meher Ramesh : నటుడుగా రీ – ఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ మెహర్ రమేష్
-
FSSAI Liquor Notices: బీర్, విస్కీ, రమ్, తాగుతున్నారా?.. ఇది మీకోసమే..!
-
WhatsApp Username Feature: కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..? వాట్సాప్ యూజర్నేమ్ ఫీచర్పై ఉత్కంఠ..
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!