Minister RK Roja: దోచుకోవడంలో కలెక్షన్ కింగ్గా చంద్రబాబు.. సీబీఐ, ఈడీ విచారణ జరపాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister RK Roja: రాష్ట్రంలో దొంగలు, డెకాయిట్స్ లకు గురువు చంద్రబాబు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ఎలా దొచుకోవాలో నేర్పించడంలో చంద్రబాబు దిట్టా అని అభివర్ణించారు. సినిమాల్లో కలెక్షన్ కింగ్ గా మోహన్ బాబుకు పేరు ఉంటే.. దోచుకోవడంలో కలెక్షన్ కింగ్ గా చంద్రబాబు ఉన్నాడని దుయ్యబట్టారు. అయితే, చంద్రబాబుకు ఇచ్చిన ఐటీ నోటీసులపై టీడీపీ నేతలు ఎందుకు నోరువిప్పరు? అని నిలదీశారు. చంద్రబాబు, లోకెష్ అవినీతి అక్రమాలపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇంట్లో వేల కోట్ల అక్రమ ఆస్తులు భయపడ్డాయని విమర్శించారు. ఇక, త్వరలో తెలంగాణ నుండి కేసీఆర్ కూడా చంద్రబాబు తరిమెస్తాడని వార్నింగ్ ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా.
Read Also: Dog skateboarding: స్కేటింగ్ చేస్తున్న కుక్క .. మధ్యలో టాయిలెట్ వస్తే ఏం చేసిందంటే?
Also Read
ఇక, ప్రతిరోజూ కూడా గురువులను పూజించాలని సూచించారు రోజా.. భగవంతుడుతో సమానంగా మనం గౌరవించేది గురువును మాత్రమే.. ప్రతిఒక్కరు గౌరవించేది… గౌరవించాల్సింది ఉపాధ్యాయుడినే.. దేశంలో ఎక్కడ లేనివిధంగా పాఠశాలను అభివృద్ధి చేయడానికి నాడు నేడు కార్యక్రమం చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. ఒకప్పుడు నారాయణ, చైతన్య స్కూళ్లలో చదవడానికి సీటు దొరికేది కాదు.. ఇప్పుడు ఆ పరిస్థితికి ప్రభుత్వ పాఠశాలను తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్దే అన్నారు. ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు మార్కులు సాధించారని గుర్తు చేశారు మంత్రి ఆర్కే రోజా.
తాజావార్తలు
-
Milk: ఈ 8 ఆహారాలను పాలతో కలిపి తీసుకుంటే రిస్క్లో పడ్డట్లే..
-
Veerabhadrudu : అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సూర్య ‘వీరభద్రుడు’ రిలీజ్
-
Tamil Nadu: గవర్నర్ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
-
Terror Threat to Delhi BJP HQ: ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు.. రాజధానిలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా సంస్థలు!
-
Uttar Pradesh: బీజేపీ “మిషన్ యూపీ 2027” స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..