* హైదరాబాద్ : ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ * విశాఖ: నేడు సీఎం వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటన.. ఋషికొండ హిల్ నెంబర్-4లో వైజాగ్ టెక్ పార్క్ నిర్మాణం, 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్న సీఎం. రూ.14,634 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్న అదానీ గ్రూప్.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 24వేల మందికి ఉపాధి లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం. * విశాఖ: సీఎం పర్యటన కోసం […]
Indian Railways: రైల్వేశాఖ తీసుకున్న ఓ నిర్ణయం గత ఆర్థిక సంవత్సరంలో వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టింది.. సీనియర్ సిటిజన్ల టికెట్లపై రాయితీని రద్దు చేయడం ద్వారా రైల్వే శాఖకు అదనపు ఆదాయం సమకూరింది. రాయితీ రద్దు మూలంగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,242 కోట్లు అదనంగా ఆర్జించినట్లు రైల్వే శాఖ పేర్కొంది.. ఆర్టీఐ దరఖాస్తుకు జవాబిస్తూ రైల్వే శాఖ అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.. అయితే, కరోనా మహమ్మారీ ఎంట్రీ తర్వాత.. దేశంలో పరిస్థితి […]
బూతులు మాట్లాడే వ్యక్తుల చరిత్ర పోలింగ్ బూత్ లో మార్చేయాలని పిలుపునిచ్చారు.. తుపాకీ గుండు వల్ల విప్లవం రాదు.. ప్రజల ఆలోచనతో విప్లవం రావాలన్న ఆయన.. దేవస్థానంలో ప్రమాణాలు చేసే రాజకీయాలు పెరిగిపోయాయి.. ఎప్పుడు ఏ జెండా పట్టుకుంటాడు తెలియడం లేదని ఎద్దేవా చేశారు.
సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ దృష్టి సారించిన ప్రభుత్వం సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో భాగమైన సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ (SSMPP)కి పర్యావరణ క్లియరెన్స్ (EC) ఇతర అవసరమైన అనుమతులను అధికారుల నుండి త్వరలో పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘం (CWC), కేంద్ర పర్యావరణ & అటవీ మంత్రిత్వ శాఖకు పంపిన ప్రాజెక్ట్ తాజా వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (DPR) అన్ని సంభావ్యతలలో, పర్యావరణ […]
Two Wheeler Sales: ఆంధ్రప్రదేశ్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో -8.03 శాతం మేర నెగెటివ్ గ్రోత్ రేట్ నమోదు చేశాయి ద్విచక్ర వాహనాల అమ్మకాలు.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 6.89 లక్షలుగా ఉన్నాయి.. ఇక, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 6.34 లక్షలు.. అంటే, అమ్మకాలు భారీగా పడిపోయాయి.. గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో సుమారు 55 వేలకు పైగా ద్విచక్ర […]
Balineni Srinivasa Reddy: మాజీమంత్రి, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా విషయంలో వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.. నాలుగు రోజుల క్రితం వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అధిష్టానానికి సమాచారమిచ్చారు బాలినేని.. ప్రస్తుతం నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న బాలినేని.. ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు పార్టీ పెద్దలకు సమాచారాన్ని చేరవేశారు. అయితే, రాజీనామా వ్యవహారంలో వైసీపీ పెద్దలు రంగంలోకి దిగి […]
అకాల వర్షాలతో కుదేలైన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైందన్న ఆయన.. ప్రాథమిక అంచనా మేరకు 3 లక్షల ఎకరాలలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయి. వరి, మామిడి, మొక్కజొన్న, అరటి, మిరప రైతులు ఆవేదనలో ఉన్నారు. బాధిత రైతులకు అండగా నిలిచి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు..
Papikondalu Tour Cancel: వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి.. ఎండలు దంచికొట్టాల్సిన సమయంలో వానలు కురుస్తున్నాయి.. వడగాలులు వీయాల్సిన వేళ.. ఈదురుగాలులు వణికిస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు.. చాలా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో, అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాపికొండల విహారయాత్రను నిలిపివేసింది.. ఇప్పటికే పలుమార్లు.. పాపికొండల టూర్ వాయిదా పడగా.. ఇప్పుడు మరోమారు బ్రేక్ పడింది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు వాతావరణ శాఖ తుపాను హెచ్చరికలు జారీ […]
Vizag: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన ముందు విశాఖలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.. రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం అంటూ జనజాగరణ సమితి పేరుతో సిటీలో బ్యానర్లే ఏర్పాటు చేశారు.. మధురవాడ ఐటీ హిల్స్ ప్రాంతంలో, భీమిలి వెళ్లే దారిలో ఈ బ్యానర్లు ప్రత్యక్షం అయ్యాయి. కాగా, భోగాపురం ఎయిర్ పోర్ట్, అదానీ డేటా సెంటర్ శంకుస్థాపన కోసం రేపు విశాఖ రానున్నారు సీఎం వైఎస్ జగన్.. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ రెండు […]
విజయవాడలో దారుణం వెలుగు చూసింది.. వంద రూపాయలు ఇవ్వలేదని యువకుడుపై కత్తితో దాడి చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. విజయవాడ కస్తూరిబాయ్ పేటలో ఈ ఘటన జరిగింది..