ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన 38 ఏళ్ల వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని ఖమ్మం యెల్లందు పట్టణానికి చెందిన బిందె పవన్ కళ్యాణ్గా గుర్తించారు. ఫిబ్రవరి 8, 2024న హైదరాబాద్కు చెందిన 45 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు బయటపడింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, అతనికి లాభదాయకమైన ఆన్లైన్ డేటా ఎంట్రీ ఉద్యోగాన్ని అందజేస్తూ కాల్ వచ్చింది. ఆఫర్ నిజమైనదని నమ్మి, […]
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఏదో… కేసు పెట్టామంటే పెట్టామన్నట్టుగా కాకుండా… రెడ్ బుక్ రేంజ్లో ఆయన్ని బుక్ చేసే వ్యూహాలు సిద్ధమవుతున్నాయా? ఆయన ముఖ్య అనుచరుల మీద తాజా కేసులు, కొన్ని అరెస్ట్లే అందుకు సంకేతాలా? నియోజకవర్గానికి దూరంగా ఇప్పుడు వంశీ ఏం చేస్తున్నారు? గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు గట్టిగా బిగించటానికి రంగం సిద్ధమవుతోందట. ఓ పద్ధతి ప్రకారం తప్పుల్ని ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం […]
ఆ మామా అల్లుళ్ళకు కళ్ళ ముందు కనిపించిన దారులన్నీ మూసుకుపోయాయా? రెంటికీ చెడ్డ ఆ నాయకులు ఇద్దరూ … ఇప్పుడు కొత్త దారి వెదుక్కుంటున్నారా? అధికారంలో ఉన్నప్పుడు అడ్డూ అదుపూ లేకుండా వ్యవహరించడంతో పాటు ఇష్టానుసారం నోటికి పని చెప్పిన మాజీ మంత్రి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారా? ఎవరా మామా అల్లుళ్ళు? ఏంటి వాళ్ళ రాజకీయ ఇరకాటపు కథ? అధికారంలో ఉన్నప్పుడు అడ్డే లేదన్నట్టుగా చెలరేగిపోయిన మాజీ మంత్రి పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యిలా […]
టైప్రైటర్లకు సంబంధించిన అధికారిక పరీక్షలను నిలిపివేయాలని రాష్ట్ర సాంకేతిక విద్యా , శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. సాంప్రదాయ టైప్రైటర్ , కంప్యూటర్ ఆధారిత మోడ్లలో సంవత్సరానికి రెండుసార్లు పరీక్ష జరుగుతుంది, మొదటి షెడ్యూల్ జూలైలో , రెండవది డిసెంబర్లో జరుగుతుంది. ఏటా దాదాపు 4,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారు. టైప్రైటర్ను ఉపయోగించాలని ఎంచుకునే అభ్యర్థులు తప్పనిసరిగా తమ యంత్రాన్ని పరీక్షా కేంద్రాలకు తీసుకురావాలి, కంప్యూటర్ ఆధారిత పరీక్షను ఎంచుకునే వారు […]
ఆ జిల్లాలో గులాబీ పార్టీ పూర్తిగా ఖాళీ అవబోతోందా? ఈపాటికే జరిగిపోవాల్సిన పనికి జస్ట్… ఆషాఢం అడ్డొచ్చిందా? శ్రావణ శుభ ఘడియలు చూసుకుని మరీ… కారులోంచి కాలు కింద పెట్టాలనుకుంటున్న ఆ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎవరు? కాంగ్రెస్ గూటికి చేరడానికి వాళ్ళు వేసుకుంటున్న లెక్కలేంటి? జరుగుతున్న ప్రచాకం ఏంటి? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పవర్ పోయినా… ఆ పార్టీ పట్టు నిలుపుకున్న నియోజకవర్గాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా అలంపూర్ ఒకటి. కారు పార్టీ అభ్యర్ధి విజయుడుకి […]
శుక్రవారం నుంచి 3 రోజుల పాటు శాకాంబరి దేవిగా కనకదుర్గమ్మ దర్శనం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారు ఎల్లుండి(శుక్రవారం) నుంచి మూడు రోజులపాటు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వివిధ కూరగాయలు, ఆకులు, ఆకు కూరలతో అర్చకులు, అధికారులు అమ్మవారిని అలంకరించనున్నారు. కూరగాయలతో అలంకారంలో కనకదుర్గమ్మ కనిపించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయం మొత్తాన్ని కూరగాయలతో అలంకరించనున్నారు. వారాంతపు సెలవులు ఉండే సమయం కావడంతో భక్తుల రద్దీకై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు నేడు ఆషాఢ మాసం […]
రాష్ట్రంలో పార్టీకి పవరుంది… నాకు జైంట్ కిల్లర్ ఇమేజ్ ఉంది. ఇక అడ్డేముందనుకుంటూ…. నాడు అడ్డగోలుగా మాట్లాడారా మాజీ ఎమ్మెల్యే. అవతలోడు ఎవడైతే నాకేంటి అన్నట్టుగా…. అదే శాశ్వతం అన్న భ్రమలో బతికేశారు. ఓటర్లు లాగిపెట్టి కొట్టి చెంప ఛెళ్ళుమనిపించేసరికి… దెబ్బకు పవర్ నిశా దిగిపోయి ఊహల్లోంచి వాస్తవంలోకి వచ్చారు. కట్ చేస్తే… ఉన్న పార్టీలో విలువ లేదు. పక్క పార్టీల్లో శతృవులు పెరిగారు. దీంతో పొలిటికల్ వీఆర్ఎస్ ఆలోచనలు చేస్తున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? […]
ఈ రోజు హైదరాబాద్లో సనోఫీ హెల్త్కేర్ ఇండియా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జిసిసి) విస్తరణలో తెలంగాణ రాష్ట్ర ఐటి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సనోఫీ రాబోయే 6 సంవత్సరాలలో € 400 MN పెట్టుబడులకు కట్టుబడి ఉంది, వచ్చే ఏడాదికి € 100 MN కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. GCC రాబోయే 2 సంవత్సరాలలో 2600 మందికి ఉపాధి కల్పిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు […]
మహిళా శక్తి పథకం కింద త్వరలో మహిళా స్వయం సహాయక సంఘాలు మీ సేవా కేంద్రాలను నిర్వహించనున్నారు. కేంద్రాలను కేటాయించడంతో పాటు, కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, ఫర్నిచర్ , ఇతర పరికరాలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ నిధి కింద రూ.2.50 లక్షల రుణాన్ని మంజూరు చేస్తుంది . కేంద్రం కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఎస్హెచ్జిలకు నెలవారీ వాయిదాలలో రుణ మొత్తాన్ని క్లియర్ చేయడానికి అవకాశం ఇవ్వబడుతుంది. ఇంటర్మీడియట్ , డిగ్రీ చదివిన గ్రూప్ సభ్యులను […]
రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందుతున్నాయి. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ఇప్పటికే ఎనిమిదిమంది చిన్నారులతో పాటు 30 మందికి కాలేయ మార్పిడి చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా మరో చిన్నారికి కాలేయ మార్పిడి చికిత్స విజయవంతమైంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కొండవనమాల గ్రామానికి చెందిన మోదుగు గుణశేఖర్, అమల దంపతుల కుమారుడు మాస్టర్ చోహన్ ఆదిత్య (3 సంవత్సరాలు) పుట్టుకతోనే పిత్తాశయ ధమని, కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు. చోహన్ ఆదిత్యను పరిశీలించిన […]