Adluri Laxman Kumar : త్వరలోనే పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు కూడా పంపిణీ చేస్తాం….
- మా ప్రభుత్వం వచ్చి కేవలం 11 నెలలు మాత్రమే అయింది
- త్వరలోనే పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు కూడా పంపిణీ చేస్తాం : అడ్లూరి లక్ష్మణ్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adluri Laxman Kumar : జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రిమాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం పై చేసిన అసత్యపు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 2014 నుండి 2023 వరకు బి.ఆర్.ఎస్ పార్టీ ఇచ్చిన మ్యానిఫెస్టోలో ఎన్ని హామీలను అమలు చేశారో ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలన్నారు. జగిత్యాల జిల్లాకు గత ప్రభుత్వ హయంలో ఏం మేలు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ జిల్లాకు వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 2014 నుండి 2023 వరకు గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో ప్రజలకు ఏం చేశారో జవాబు చెప్పి పాదయాత్రను మొదలుపెట్టండని, మీ ప్రభుత్వ హయంలో మిల్లర్లు కటింగ్ పేరిట రైతులను దోచుకుంటుంటే కనీసం స్పందించని మీరు, రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటే వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించని మీరు ఈ రోజు రైతుల గురించి మాట్లాడుతున్నారా? అని ఆయన ప్రశ్నించారు.
Vidadala Rajini : నాపై తప్పుడు రాతలు రాస్తే పోలీసులు పట్టించుకోలేదు..
Also Read
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
- CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
మా ప్రభుత్వం వచ్చి కేవలం 11 నెలలు మాత్రమే అయిందని, ఈ కొద్ది సమయంలోనే ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం,500లకి గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, 2లక్షల రుణమాఫీ, ఉద్యోగస్తులకు నియామక ఉత్తర్వులు పంపిణీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలకు అమలు చేసి చూపించామని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు కూడా పంపిణీ చేస్తామని, ఇన్ని సంక్షేమ పథకాలకు అమలు చేస్తే బి.ఆర్.ఎస్ పార్టీ సోషల్ మీడియాలో మాత్రం మా పైన అసత్యాలను ప్రచారం చేస్తూఒక అబద్ధాన్ని నిజం అని పలు మార్లు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేవలం బి.ఆర్.ఎస్ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ఇలాంటి ఒక బూటకపు పాదయాత్రలు చేయడం జరుగుతుందని, ఎన్ని పాదయాత్రను చేసిన వారి మాటలు రైతులు గాని, ప్రజలు గాని నమ్మే పరిస్థితిలో లేరన్నారు అడ్లూరి లక్ష్మణ్.
తాజావార్తలు
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!