బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు చేరుకొని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కుల గణనకు మద్దతు ఇవ్వాలని కిషన్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీల సమగ్ర కుల గణన, రిజర్వేషన్ల పెంపుకు సహకరించి, మద్దతు తెలపాలని కిషన్ రెడ్డిని కలవడం జరిగిందని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ […]
చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని అబూజ్ మద్ తో పాటు దండకారణ్యం ప్రాంతాల్లో మావోయిస్టు వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఒకవైపు మావోయిస్టులపై భద్రతా బలగాలు విరుచుకుని పడుతున్నప్పటికీ మరోవైపున మావోయిస్టు పార్టీ తమ కార్యక్రమాల్ని కొనసాగిస్తూనే ఉంది తాజాగా దండకారణ్యంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున సమీకరణ అయ్యారు. పలు గ్రామాల గిరిజనుల ను ఒక చోటికి చేర్చి మావోయిస్టు వారోత్సవాలని నిర్వహించారు.. అమరులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పనిచేసిన రామకృష్ణ తో పాటు డప్పు రమేష్ ,నర్మద […]
తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు కొత్త వీసీల నియామకం ఫైల్పై తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. దీంతో అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఎం. కుమార్, పాలమూరు యూనివర్సిటీ వీసీగా జీఎన్ శ్రీనివాస్, శాతవాహన యూనివర్సిటీ వీసీగా ఉమేష్ కుమార్, కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రతాప్ రెడ్డి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా అల్తాఫ్ హుస్సేన్, తెలంగాణ యూనివర్సిటీ వీసీగా యాదగిరి రావు, తెలుగు యూనివర్సిటీ వీసీగా నిత్యానందరావు, వ్యవసాయ […]
ఆ ఇద్దరు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అధికారులు…తెలంగాణలో కలిసి పని చేయబోతున్నారా? నాటి ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన వారికి…కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందా ? బీఆర్ఎస్ నేతలు చేసిన అక్రమాలు, అనైతిక కార్యక్రమాలు బయటకు తీయడమే ప్రభుత్వ లక్ష్యమా? కేంద్రం నుంచి ఆ అధికారిని రాష్ట్రానికి తీసుకురావడం వెనుక ఉన్న కారణాలు ఏంటి ? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు భారీగా బదిలీ అయ్యారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో […]
సభ్యత్వ నమోదు ఆ పార్టీ లోని కొందరు నేతలకు టెన్షన్ పుట్టిస్తుంది అట… టార్గెట్ రీచ్ అయ్యేందుకు తంటాలు పడుతున్నారు అట… ఒకరిద్దరు నేతలు అయితే సభ్యత్వం చేయించే బాధ్యతను ఏకంగా ఏజెన్సీలకే అప్పగించారు అట… మరికొందరు సభ్యత్వం చేయిస్తే డబ్బులు ఆఫర్ చేస్తున్నారు అట…. పార్టీ లో ఇదేమి కల్చర్ అనే చర్చ జరుగుతుంది. తెలంగాణ బీజేపీలో సభ్యత్వ నమోదుపై డ్రైవ్ జోరుగా నడుస్తోంది. పెట్టుకున్న టార్గెట్కు…చాలా దూరంలో ఉంది తెలంగాణ బీజేపీ. 50 లక్షల […]
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు పై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్, పేట్లబుర్జు హాస్పిటల్, వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో ఐవీఎఫ్ సెంటర్ల ఏర్పాటుకు 06/09/2018న జీవో 520 విడుదల చేశారని, కానీ, ఒక్క హాస్పిటల్లో కూడా ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకురాలేదని ఆయన మండిపడ్డారు. పేట్లబుర్జు, ఎంజీఎంలో పైసా పనిచేయలేదు. ఒక్క పరికరం కూడా కొనుగోలు చేయలేదని, 2023లో ఎన్నికలకు ముందు గాంధీకి కొన్ని ఎక్విప్మెంట్ […]
ఆ మాజీ మంత్రి పక్క జిల్లాలో సీటు పై ఫోకస్ చేశారా ? ఇప్పటి నుంచే అక్కడకి షిఫ్ట్ అయిపోతానని అధినేత ముందు రిక్వెస్ట్ పెట్టారా? ఆశించిన స్థాయిలో రెస్పాండ్ రాకపోవడంతో వేరే లెక్క వేస్తున్నారా? తాను రెండుసార్లు గెలిచిన నియోజకవర్గంలో అంత ఇంట్రెస్ట్ లేదా ? కురసాల కన్నబాబు…జర్నలిజం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యంలో చేరి… 2009లో కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ […]
అక్టోబర్ 23 నుంచి 27 వరకు హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో స్వదేశీ మేళా జరగనుంది. అయితే.. 23వ తేదీన నిరుద్యోగుల కోసం జాబ్ మేళాను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ స్వదేశీ మేళాలో 500 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ఫుడ్ స్టాల్స్ కూడా ఉండనున్నాయి. ప్రతి రోజు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. ట్రైనింగ్ అండ్ లెక్చర్ ప్రోగ్ర్సాం ప్రతి రోజూ నిర్వహించనున్నారు. అయితే.. ఈ స్వదేశీ మేళా కోసం.. […]
ఈ ఏడాది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా పత్తి కొనుగోళ్ల కోసం ఆదిలాబాద్ జిల్లా రైతులు ఎదురుచూస్తున్నారు. వానకాలం సీజన్లో మండలంలో 10.15 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. 3.96 లక్షల ఎకరాల్లో వాణిజ్య పంట సాగులో ఆదిలాబాద్ అగ్రస్థానంలో ఉండగా, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా 3.30 లక్షల ఎకరాల్లో సాగైంది. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో వరుసగా 1.47 లక్షలు, 1.42 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. ఆదిలాబాద్ […]
మహిళ మీద ప్రేమ ఉన్నట్లు హరీష్ రావు తెగ మాట్లాడుతున్నాడని, గత పదేళ్లలో మహిళలను అన్ని రకాలు అణచివేసింది కేసీఆర్ కాదా..? కనీసం మంత్రి వర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వకుండా నియంత్రుత్వ పోకడలు పోయింది మీరు కాదా..? అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వయం సహాయక గ్రూపు లను నిర్వీర్యం చేయ లేదా..? పావలా వడ్డీ రుణాలు ఎత్తి వేసి మహిళలకు అన్యాయం చేయ లేదా…? మహిళల కోసం […]