Jajula Srinivas Goud : కుల గణనకు మద్దతు ఇవ్వాలి… కిషన్ రెడ్డిని కోరిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు
- బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశం
- కుల గణనకు మద్దతు ఇవ్వాలని వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు చేరుకొని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కుల గణనకు మద్దతు ఇవ్వాలని కిషన్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీల సమగ్ర కుల గణన, రిజర్వేషన్ల పెంపుకు సహకరించి, మద్దతు తెలపాలని కిషన్ రెడ్డిని కలవడం జరిగిందని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో సమగ్ర కుల గణన చేపడతామని హామి ఇచ్చారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారని, బీసీల సమగ్ర విచారణ జరపాలని అనేక పోరాటాలు చేశాం, హై కోర్టు కు సైతం వెళ్ళడం జరిగిందని ఆయన తెలిపారు.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
అంతేకాకుండా..’కోర్టు కూడా మూడు నెలల్లో సమగ్ర బీసీ కుల గణన జరపాలని చెప్పింది. రిజర్వేషన్లు తేల్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని హై కోర్టు చెప్పడం జరిగింది. హై కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర కుల గణన కోసం బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కుల గణన కోసం ప్రభుత్వం జీవో 18 ని విడుదల చేయడం జరిగింది. బీసీ సమగ్ర కుల గణన, రిజర్వేషన్లపై సవివరంగా కిషన్ రెడ్డికి చెప్పడం జరిగింది. కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు, సంపూర్ణ మద్దతు అందిస్తామని చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో కుల గణన జరగాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సిందే. 27 న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ కుల గణనపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నాం.’ అని జాజూల శ్రీనివాస్ అన్నారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..