Gogikar Sai Krishna
Author- NTV Telugu-
36వ రోజు రైతుల మహాపాదయాత్ర
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నేడు 36వ రోజుకు చేరుకుంది. గత నెల 1న ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర 45 రోజుల పాటు సాగి డిసెంబర్ 15న తిరుమలలో ముగుస్తుంది. అయితే ఏపీలో ఇటీవల భారీ వర్షాలు సంభవించడంతో అమరావతి రైతుల జేఏసీ రెండు సార్లు పాదయాత్రకు విరామం ప్రకటించారు. అయితే ఊరురా రాజధాని రైతుల మహాపాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. నెల్లూరు జిల్లాలో […] -
బంజారాహిల్స్లో కారు బీభత్సం.. ఇద్దరు మృతి..
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్నెం 2 లో అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రోహిత్ అనే వ్యక్తి తాగినమత్తులో అతివేగంగా కారు నడుపుతూ రోడ్డు దాటుతున్న ఇద్దరు యువకులను ఢీ కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. కారు దూసుకెళ్లడంతో బీహార్కు చెందిన త్రిభువన్రాయ్, ఉపేందర్కుమార్ దాస్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు వెంటనే రోహిత్ను పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రోహిత్ను అదుపులోకి […] -
దిశ ఎన్ కౌంటర్కు నేటికి రెండేళ్లు..
నవంబర్ 28, 2019న రాత్రి ఒక వెటర్నటీ డాక్టర్ను కిడ్నాప్ చేసి అత్యాచారం, హత్య చేశారో నలుగురు దుండగులు. దిశ పేరుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను ఒక్కరోజులోనే పట్టుకొని విచారణ చేపట్టారు. అయితే 2019 డిసెంబర్ 6న దిశ కేసులో సీన్ రీ కన్స్ట్రాక్షన్ చేస్తుండగా పారిపోయేందుకు నిందితులు చెన్నకేశవులు, మహ్మద్ హారీఫ్, జొల్లు నవీన్, జొల్లు శివ ప్రయత్నించారు. అయితే ఈ నేపథ్యంలో దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దుండగులు రాళ్లు రువ్వారు. […] -
46 దేశాలకు పాకిన ఒమిక్రాన్..
కరోనా మహమ్మారి విజృంభన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో మరోసారి మొదలైంది. ఇప్పటికే 38 దేశాలకు వ్యాప్తి చెందిన ఈ వేరియంట్ కొత్త నివేదికల ప్రకారం ఇప్పుడు 46 దేశాలకు పాకింది. ఇప్పుడిప్పుడే డెల్టా వేరియంట్ నుంచి కోలుకుంటన్న తరుణంలో దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా 941కి ఒమిక్రాన్ బాధితుల సంఖ్య చేరింది. యూకేలో 246 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, దక్షిణాఫ్రికాలో […] -
మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు
భద్రాచలం పట్టణంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లుతో స్థానికంగా కలకలం రేపుతున్నాయి.. ఎక్కువగా మావోయిస్టులు మాత్రమే పోస్టర్లను అంటించి వారి ఉద్దేశాలను తెలుపుతుంటారు. అయితే తాజాగా వెలసిన పోస్టర్లు మావోయిస్టులకు వ్యతిరేకంగా ఉండటం గమనార్హం. మావోయిస్టుల విధానాలను ప్రజలు ప్రశ్నిస్తున్నట్లుగా పట్టణంలో అక్కడక్కడ పోస్టర్లు అంటించారు. అంతేకాకుండా మావోయిస్టుల పార్టీకీ సూటి ప్రశ్నలు వేసినట్లు ఈ పోస్టర్లలో సారాంశం ఉంది. నక్సలైట్లు అంటే నరహంతకులు కాదా? అభివృద్ధిని అడ్డుకోవడం నక్సలిజమా? ప్రజా విప్లవం అంటే విధ్వంసమా? తుపాకీ […] -
విశాఖలో తెరుచుకున్న పర్యాటక కేంద్రాలు..
అండమాన్లో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త వాయుగుండంగా బలపడి తుఫాన్గా మారింది. ఈ తుఫాన్కు జవాద్ తుఫాన్గా అధికారులు నామకరణం చేశారు. దీంతో ఈ జవాద్ తుఫాన్ ఎఫెక్ట్ ఉత్తరాంధ్ర, ఒడిషా రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం తీర ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా తుఫాన్ తీవ్రత తగ్గేవరకు విశాఖపట్నంలోని పర్యాటక కేంద్రాలను మూసివేస్తున్నట్లు, సందర్శకులు రావద్దంటూ ప్రకటించింది. అయితే ఇటీవల జవాద్ తుఫాన్ విశాఖపట్నంకు […] -
పెరుగుతున్న చలి తీవ్రత.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు..
తెలంగాణలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత నెలతో పొల్చితే డిసెంబర్ నెలల చలి తీవ్రత అధికంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ చలి తీవ్రత కొన్ని జిల్లాల్లో అధికంగా ఉండడంలో ఆయా జిల్లాల ప్రజలు ఉదయం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. తాజాగా వాతావరణ శాఖ వెల్లడించిన ఉష్ణోగ్రత ప్రకారం.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదాల మండలంలోని నల్లవల్లి గ్రామంలో 13గా కనిష్ఠ ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. అలాగే […] -
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
భారత్కు నేడు రష్యా అధ్యక్షుడు పుతిన్ రానున్నారు. 21వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో రక్షణ, ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చలు జరుగనున్నాయి. సాయంత్రం ఢిల్లీలో ప్రధాని మోడీతో పుతిన్ భేటీకానున్నారు. రాత్రి 9.30 గంటలకు పుతిన్ తిరిగి ప్రయాణం కానున్నారు. శీతాకాల పార్లమెంటు సమావేశాలు నవంబర్ 29 నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభం నుంచి విపక్షాల ఆందోళనల నడుమ నడుస్తున్న పార్లమెంట్ సమావేశాలు నేడు ఆరో రోజుకు చేరుకున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై కేంద్రం దృష్టిసారించి నేడు వ్యాక్సినేషన్ […] -
ఏపీ చెడ్డీగ్యాంగ్ కలకలం.. వరుస దోపిడీలు
జంటనగరాల ప్రజలను భయాందోళనకు గురిచేసిన చెడ్డీగ్యాంగ్ ఇప్పుడు ఏపీలో దోపిడీలకు తెగబడుతున్నారు. ఏపీలోని పులివెందుల నుంచి గుండుగొలను వరకు చెడ్డీగ్యాంగ్ వరుస దోపిడీలకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్లో దొంగతనాలు చేసిని ఈ ముఠా ఇప్పడు విజయవాడలో ప్రత్యక్షమవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చిట్టినగర్, గుంటుపల్లిలో చెడ్డీగ్యాంగ్ ముఠా దోపిడీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇటేవలే ఈ ముఠా పులివెందుల, తిరుపతి, ప్రకాశం, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో పలు దోపిడీలకు పాల్పడ్డ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే […] -
డిసెంబర్ 6, సోమవారం దినఫలాలు.. వారికి మెరుగైన ఫలితాలు
మేషం :- బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి అరకొర పనులే లభిస్తాయి. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులు మొండివైఖరి అవలంభించుట వల్ల మాటపడక తప్పదు. తోటలు కొనుగోలుకై చేయు ప్రయత్నాలు వాయిదాపడుట వల్ల ఆందోళన చెందుతారు. వృషభం :- ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు రావలసిన ధనం చేతికందుతుంది. కంప్యూటర్, ఎలక్ట్రానికల్ రంగాల వారు క్రమేణా పుంజుకుంటారు. వాహనచోదకులు జరిమానాలు చెల్లించవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో […]
తాజావార్తలు
-
Rishabh Pant: మేం తోపులం, కానీ కలిసిరాలేదు.. రిషభ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
God of War Confirmed: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్..నాగవంశీ సాలిడ్ హింట్!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
-
Sunil Narang: ‘ఏకాభిప్రాయం లేదు.. ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి’ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ గుడ్ బై!
ట్రెండింగ్
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!