Kusuma Krishnamurthy: తెలుగు రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబీకులు ధ్రువీకరించారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు తీవ్ర సంతాపం తెలిపారు. కృష్ణమూర్తి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Harish Rao: 90 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైతే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నిన్న ఫుడ్ పాయిజన్ కావడంతో వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ జిల్లా కింగ్ కోఠి ఆసుపత్రికి తీసుకవచ్చారు. కింగ్ కోఠి ఆసుపత్రికి చేసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు వారిని పరామర్శించారు. ఫుడ్ పాయిజన్కి గల కారణాలు అధికారులని అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
Jayashankar Bhupalpally: భార్యను చంపి తాను ఉరివేసుకొని చనిపోయిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బాలాజీ రామాచారి(50) తన భార్య సంధ్య(42)ను తాడుతో ఉరిబెట్టి చంపేశాడు. అనంతరం తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, కూతురు వేధింపులు తాళలేక ధర్మపత్నిని చంపిన అనంతరం వీడియో తీసి స్టేటస్ పెట్టుకున్నాడు బాలరాజు రామాచారి..
Khauf: వీకెండ్ మొదలైంది. ఈ వీకెండ్కు ఇంట్లోనే ఉండి ఓటీటీలో మంచి థ్రిల్లర్ సిరీస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వార్త మీకోసమే. ఇటీవల 'అమెజాన్ ప్రైమ్' వీడియోలో విడుదలైన ఒక సిరీస్ ఇప్పటికీ సంచలనం సృష్టిస్తోంది. ఇది ప్రేక్షకులకు వెన్నులో వణుకుపుట్టేలా చేస్తోంది. ఈ సిరీస్ విడుదలైనప్పటి నుంచి అనేక ప్రశంసలను అందుకుంది. ఈ సిరీస్ పేరు "ఖౌఫ్". ఈ హర్రర్ సిరీస్ను స్మితా సింగ్ రూపొందించారు. మోనికా పవార్, రజత్ కపూర్, చుమ్ దరాంగ్ వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ…
Fake Currency: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని పొదుపు మహిళా సంఘాల్లో నకిలీ నోటు కలకలం సృష్టించింది. బ్యాంకు నుంచి వడ్డీ లేని రుణాలు పొందిన మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది. అయితే నగదు చెల్లించే క్రమంలో సభ్యుల నుంచి వస్తున్న 500 రూపాయల నోట్ల వ్యవహారం ప్రస్తుతం మహిళా సంఘాల ప్రతినిధులకు భయాందోళన గురిచేస్తోంది. వేములవాడ పట్టణంలోని ఓ మహిళా పొదుపు సంఘానికి చెందిన సభ్యులు సంబంధిత టీం లీడర్ కు నగదు…
Messi vs Revanth Reddy: ఫుట్బాల్ దిగ్గజం, ఆల్టైమ్ గ్రేట్ లియోనెల్ మెస్సీ vs సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్ నేడు (శనివారం) ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్కు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి 7గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్లో మెస్సీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ మ్యాచ్ కోసం దాదాపు 3,000 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే.. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్…
Jagtial District: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తమ్ముడు ఎన్నికల్లో ఓడిపోయాడని అక్క గుండెపోటుతో మృతి చెందిన ఘటన గ్రామస్థులను కలచివేసింది. గ్రామానికి చెందిన పోతు శేఖర్ సర్పంచ్గా పోటీ చేశాడు. తమ్ముడు ఎలాగైనా గెలవాలని అక్క కొప్పుల మమత(38) తాపత్రయ పడింది. ఎన్నికల ప్రచారం కోసం ఐదు రోజుల క్రితం కోరుట్ల నుంచి గ్రామానికి చేరుకుంది. నిన్న కౌటింగ్ జారుతుండగా తమ్ముడు వెనకంజలో ఉన్నాడని తెలుసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది మమత.. చికిత్స నిమిత్తం…
Akhanda 2: కోర్టు ఉత్తర్వులు అంటే లెక్క లేదా? అని అఖండ 2 టికెట్ల అమ్మకాలపై హై కోర్టు ప్రశ్నించింది. ఆదేశాలు ఇచ్చినా కూడా ఎందుకు టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తున్నారని బుక్ మై షోను కోర్టు నిలదీసింది. అఖండ–2 సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి గురువారం రాత్రి ప్రీమియర్ షో వేశారని, అధిక ధరకు టికెట్లను విక్రయించారని విజయ్ గోపాల్…
Kavitha: నాకు కూడా టైం వస్తుంది.. నేను కూడా ఏదో ఒక రోజు సీఎం అవుతనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను సీఎం అయితే 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపై విచారణ చేయిస్తానని తెలిపారు.. తనపై ఆరోపణలు చేసిన వారికి లీగల్ నోటీసులు పంపుతనని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతల అవినీతిపై ఇంకా చిట్టా విప్పదు.. ఇది కేవలం టాస్ మాత్రమే అన్నారు. దీనికే ఉలిక్కి పడితే ఎలా? త్వరలోనే మీ…
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో SIB మాజీ చీఫ్ ప్రభాకర్రావు సిట్ ఎదుట లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఎదుట హాజరయ్యారు. వారం రోజుల పాటు కస్టోడియల్ విచారణకు సుప్రీంకోర్టు అనుమతించింది. విచారణకు ప్రభాకర్రావు సహకరించడం లేదని సిట్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రభాకర్రావు సెల్ఫోన్ పాస్ వర్డ్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి ఉన్న డేటాను ధ్వంసం చేయించారని ఫిర్యాదు చేశారు. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారన్న విషయాన్ని ప్రభాకర్ దాచి పెట్టారని సిట్ కోర్టుకు…