Tata Motors: హ్యుందాయ్, మహీంద్రాను వెనక్కి నెట్టిన టాటా.. నెక్సాన్, సియెర్రా వల్లే ఈ ఘనత!
Tata Motors: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ 2026 ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా & మహీంద్రాలను దాటి దేశంలో రెండో అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీదారుగా నిలిచింది. నెక్సాన్ కాంపాక్ట్ SUVకు ఉన్న బలమైన డిమాండ్, తాజాగా మార్కెట్లోకి వచ్చిన సియెర్రా మోడల్ నుంచి వచ్చిన ప్రారంభ అమ్మకాలే దీనికి ప్రధాన కారణమని ప్రభుత్వ వాహన నమోదు గణాంకాలు చెబుతున్నాయి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన వాహన్ పోర్టల్ డేటా ప్రకారం.. FY26 మూడో త్రైమాసికంలో టాటా మోటార్స్ 1.89 లక్షల ప్యాసింజర్ వాహనాలను రిజిస్ట్రేషన్ చేసింది. అదే సమయంలో మహీంద్రా 1.80 లక్షలు, హ్యుందాయ్ 1.70 లక్షల యూనిట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేశాయి. దీంతో టాటా ఈ రెండు కంపెనీలను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరింది. డిసెంబర్ 2025లో కూడా టాటా రెండో స్థానంలో నిలిచి, సంవత్సరం రెండో భాగంలో కనిపించిన వృద్ధిని కొనసాగించింది. అయితే మొత్తం 2025 ఏడాదిలో టాటా మోటార్స్ మూడో అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీదారుగానే నిలిచింది.
READ MORE: Russia-Ukraine: న్యూఇయర్ వేళ రష్యాపై భారీ డ్రోన్ దాడి.. 24 మంది మృతి
Also Read
- Oben Rorr EVO: రూ.1 లక్షకే కొత్త ఓబెన్ రోర్ Evo.. 180KM రేంజ్తో అదిరిపోయే బైక్
- Top Selling CNG Cars: భారత్లో అత్యధికంగా సేల్ అయిన CNG కార్లు ఇవే..
- Audi Q4 e-Tron Facelift: కొత్త 2026 ఆడి Q4 e-tron ఫేస్లిఫ్ట్ లాంచ్.. ట్రిపుల్ స్క్రీన్స్, 592KM రేంజ్
- Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్
ఈ ఏడాదిలో టాటా 5.92 లక్షల వాహనాలను విక్రయించగా, మహీంద్రా 6.07 లక్షల యూనిట్లు అమ్మింది. మారుతి సుజుకి మాత్రం ఎప్పటిలాగే మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. కాగా.. 2025 రెండో భాగంలో టాటా పనితీరు గణనీయంగా మెరుగుపడింది. దీనికి ప్రధాన కారణం నెక్సాన్. అక్టోబర్, నవంబర్ నెలల్లో నెక్సాన్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్ వాహనంగా నిలిచింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉండటం వల్ల నెక్సాన్కు స్థిరమైన డిమాండ్ కొనసాగింది. అలాగే, 2025 చివర్లో మళ్లీ మార్కెట్లోకి తీసుకువచ్చిన సియెరా SUV ప్రారంభ అమ్మకాలు కూడా టాటాకు లాభం చేకూర్చాయి. వాహన్ డేటా ప్రకారం, డిసెంబర్ 2025లో టాటా మోటార్స్ 51,963 యూనిట్లు విక్రయించింది. అదే నెలలో హ్యుందాయ్ 48,312 యూనిట్లు, మహీంద్రా 47,493 యూనిట్లు మాత్రమే అమ్మాయి. సరఫరా పరిస్థితులు మెరుగుపడటం, SUV మోడళ్ల శ్రేణి పెరగటం, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల్లో స్థిరమైన పనితీరు టాటాకు ఈ త్రైమాసికంలో బలంగా నిలిచేలా చేశాయి.
తాజావార్తలు
-
AK47: ‘ఆదర్శకుటుంబం’ షూటింగ్ అప్ డేట్..
-
SRH vs KKR: సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా హెడ్ టు హెడ్ రికార్డ్స్.. ఇప్పటివరకు కేకేఆర్దే పైచేయి
-
Vijay TVK Plan B: రేపు ఫలితాలు.. విజయ్ ‘ప్లాన్-బి’ రెడీ.. అభ్యర్థులకు దళపతి సీరియస్ వార్నింగ్!
-
NBK112 : CM రేసులో నందమూరి బాలకృష్ణ
-
Census 2026 Scam Alert: జాగ్రత్త! జనాభా లెక్కల పేరుతో మోసం.. ఈ వివరాలను పంచుకోవద్దు.. ఏం చేయాలో తెలుసుకోండి
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!