Tata Motors: హ్యుందాయ్, మహీంద్రాను వెనక్కి నెట్టిన టాటా.. నెక్సాన్, సియెర్రా వల్లే ఈ ఘనత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Motors: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ 2026 ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా & మహీంద్రాలను దాటి దేశంలో రెండో అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీదారుగా నిలిచింది. నెక్సాన్ కాంపాక్ట్ SUVకు ఉన్న బలమైన డిమాండ్, తాజాగా మార్కెట్లోకి వచ్చిన సియెర్రా మోడల్ నుంచి వచ్చిన ప్రారంభ అమ్మకాలే దీనికి ప్రధాన కారణమని ప్రభుత్వ వాహన నమోదు గణాంకాలు చెబుతున్నాయి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన వాహన్ పోర్టల్ డేటా ప్రకారం.. FY26 మూడో త్రైమాసికంలో టాటా మోటార్స్ 1.89 లక్షల ప్యాసింజర్ వాహనాలను రిజిస్ట్రేషన్ చేసింది. అదే సమయంలో మహీంద్రా 1.80 లక్షలు, హ్యుందాయ్ 1.70 లక్షల యూనిట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేశాయి. దీంతో టాటా ఈ రెండు కంపెనీలను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరింది. డిసెంబర్ 2025లో కూడా టాటా రెండో స్థానంలో నిలిచి, సంవత్సరం రెండో భాగంలో కనిపించిన వృద్ధిని కొనసాగించింది. అయితే మొత్తం 2025 ఏడాదిలో టాటా మోటార్స్ మూడో అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీదారుగానే నిలిచింది.
READ MORE: Russia-Ukraine: న్యూఇయర్ వేళ రష్యాపై భారీ డ్రోన్ దాడి.. 24 మంది మృతి
Also Read
- Hero HF Deluxe: హీరో HF డీలక్స్ క్యాన్వాస్ బ్లాక్ బైక్పై ధర భారీగా తగ్గింపు.. రూ. 59,999కే కొనుగోలు చేసే ఛాన్స్!
- Maruti Suzuki: బిగ్ అలర్ట్.. కారు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. భారీగా పెరగనున్న ధరలు..
- Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
- Lectrix NDuro: 120KM రేంజ్తో Lectrix NDuro ఎలక్ట్రిక్ స్కూటర్.. రోజూ ఆఫీస్, కాలేజీకి వెళ్లేవారికి బెస్ట్ ఛాయిస్
ఈ ఏడాదిలో టాటా 5.92 లక్షల వాహనాలను విక్రయించగా, మహీంద్రా 6.07 లక్షల యూనిట్లు అమ్మింది. మారుతి సుజుకి మాత్రం ఎప్పటిలాగే మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. కాగా.. 2025 రెండో భాగంలో టాటా పనితీరు గణనీయంగా మెరుగుపడింది. దీనికి ప్రధాన కారణం నెక్సాన్. అక్టోబర్, నవంబర్ నెలల్లో నెక్సాన్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్ వాహనంగా నిలిచింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉండటం వల్ల నెక్సాన్కు స్థిరమైన డిమాండ్ కొనసాగింది. అలాగే, 2025 చివర్లో మళ్లీ మార్కెట్లోకి తీసుకువచ్చిన సియెరా SUV ప్రారంభ అమ్మకాలు కూడా టాటాకు లాభం చేకూర్చాయి. వాహన్ డేటా ప్రకారం, డిసెంబర్ 2025లో టాటా మోటార్స్ 51,963 యూనిట్లు విక్రయించింది. అదే నెలలో హ్యుందాయ్ 48,312 యూనిట్లు, మహీంద్రా 47,493 యూనిట్లు మాత్రమే అమ్మాయి. సరఫరా పరిస్థితులు మెరుగుపడటం, SUV మోడళ్ల శ్రేణి పెరగటం, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల్లో స్థిరమైన పనితీరు టాటాకు ఈ త్రైమాసికంలో బలంగా నిలిచేలా చేశాయి.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!