-
Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో అకాల వర్షాలు, భీకరమైన గాలివాన, పిడుగులు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ ప్రకృతి ప్రకోపానికి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 111 మంది ప్రాణాలు కోల్పోగా, 72 మంది గాయపడ్డారు. కేవలం మనుషులే కాకుండా 170 పశువులు మృతి చెందడం, 227 ఇళ్లు ధ్వంసం కావడం ఈ విపత్తు తీవ్రతకు అద్దం పడుతోంది. ముఖ్యంగా మే 13న రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వాతావరణం అస్తవ్యస్తమైందని ఊహించని స్థాయిలో ప్రాణనష్టం సంభవించిందని సహాయక కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. -
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
Jasprit Bumrah: ధర్మశాలలోని హెచ్పీసీఏ (HPCA) స్టేడియంలో మే 14న జరిగిన ఐపీఎల్ 2026 ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. కెప్టెన్గా తన మొదటి మ్యాచ్లోనే జస్ప్రీత్ బుమ్రా జట్టును గెలిపించి ‘విన్నింగ్ స్టార్ట్’ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా తన తొలి మ్యాచ్లో విజయం సాధించిన అనంతరం జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తొలి మ్యాచ్లోనే విజయం అందుకోవడం ఆనందంగా ఉందని బుమ్రా చెప్పాడు. రెండు జట్లు కూడా అద్భుతంగా ఆడాయని, ముఖ్యంగా ప్రత్యర్థి… -
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
IPL 2026: ఐపీఎల్ ప్రస్తుత సీజన్ క్లైమాక్స్కు చేరుకుంటున్న వేళ, ముగ్గురు కీలక కెప్టెన్ల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వరుసగా రెండు సీజన్ల పాటు జట్టును ప్లేఆఫ్స్కు చేర్చడంలో విఫలమైన అక్షర్ పటేల్, అజింక్యా రహానే, రిషబ్ పంత్లు తమ సారథ్య బాధ్యతలను కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించగా, కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా దాదాపు అదే బాటలో ఉన్నాయి. -
Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. కాల్పులు జరిపి నగలు ఎత్తుకెళ్లిన దొంగలను పట్టుకున్నారు. ముగ్గురు దోపిడీ దొంగలను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కొంత బంగారం రికవరీ చేశారు. ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దొరికిన దొంగలను అరెస్టు చేసి నేడు మీడియా సమావేశంలో సీపీ గౌస్ ఆలం వివరాలు వెల్లడించారు. దీ గోల్డెన్ థీఫ్ పేరుతో ఆపరేషన్ సాగినట్లు తెలిపారు. సుబోధ్ సింగ్ ఆధ్వర్యంలో ఆరు రాష్ట్రాల్లో ముఠా నడుస్తోందన్నారు. బంగారు నగల దుకాణాలు, బ్యాంకులను… -
Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
Grok AI: ప్రస్తుతం ఏఐ మన జీవన విధానంలో ఓ భాగమై పోయింది. ఏఐ కల్చర్ సిటీ నుంచి పల్లెలకు సైతం పాకింది. పుట్టుక నుంచి చావు వరకు అనేక విషయాలను, కొత్త కొత్త అంశాలను ఏఐ ద్వారా తెలుసుకుంటున్నారు. అయితే.. తాజాగా ఓ నెటిజన్ ఎలోన్ మాస్క్ సంస్థ 'గ్రోక్' (Grok) చాట్బాట్కు ఓ ప్రశ్న అడిగాడు. గ్రోక్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. "మీరు భారత పౌరులైతే ఎవరికి ఓటు వేస్తారు?" అని ఓ వ్యక్తి… -
CM Revanth Reddy: తెలంగాణకు ‘మెగా గ్రోత్ కారిడార్’.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
CM Revanth Reddy: ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో మెగా గ్రోత్ కారిడార్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పలు కీలక సూచనలు చేశారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో ఉంచుకుని రహదారుల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఖర్చు తగ్గించే దిశగా ఈవీ వాహనాల వినియోగాన్ని పెంచాలని, ప్రభుత్వ అవసరాల కోసం లీజ్కు తీసుకునే వాహనాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలే… -
Indian Rupee: రూపాయికి ‘చీకటి’ రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
Indian Rupee Hits Record Low: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముడిచమురు ధరలు ఆకాశాన్నంటుతుండటం, విదేశీ పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడంతో (outflows), గురువారం భారత రూపాయి విలువ మునుపెన్నడూ లేనంతగా జీవితకాల కనిష్టానికి పడిపోయింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 0.1% తగ్గి 95.8525 వద్దకు చేరుకుంది. అంతకుముందు సెషన్లో నమోదైన 95.7950 కనిష్ట స్థాయి రికార్డును ఇది అధిగమించింది. -
Virat Kohli: సెంచరీ కొట్టినా సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకోలేదు?.. కోహ్లీ ఇచ్చిన ఆన్సర్ వింటే ఫిదా అవ్వాల్సిందే!
Virat Kohli: రాయ్పూర్ మైదానంలో వర్షం కారణంగా మ్యాచ్ 75 నిమిషాల పాటు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, అక్కడి ప్రేక్షకుల నిరీక్షణకు తగిన ప్రతిఫలం దక్కింది. 'ఛేజ్ మాస్టర్' విరాట్ కోహ్లీ తన బ్యాట్తో మరో అద్భుతాన్ని ఆవిష్కరించి అందరినీ అలరించాడు. ఈ మ్యాచ్కు ముందు వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌట్ అయిన కోహ్లీ, ఈ మ్యాచ్లో తాను ఎదుర్కొన్న మొదటి బంతికే పరుగు తీసి గట్టిగా గాలిలో పిడికిలి బిగించి తన ఆనందాన్ని చాటుకున్నాడు. అంతేకాదు 60 బంతుల్లో 11 ఫోర్లు, మూడు సిక్సర్లతో… -
Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
Chhatrapati Sambhaji Maharaj Jayanti 2026: భారతీయ చరిత్రలో ధైర్యసాహసాలకు, అజేయమైన సంకల్పానికి మారుపేరు ఛత్రపతి శంభాజీ మహారాజ్. నేడు ఆ మహనీయుడి జయంతి. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జ్యేష్ఠ పుత్రుడైన శంభాజీ, మే 14, 1657న పురందర్ కోటలో శివాజీ, సాయిబాయి దంపతులకు జన్మించారు. దురదృష్టవశాత్తూ ఆయనకు రెండు ఏళ్ల వయసున్నప్పుడే తల్లి మరణించడంతో, తండ్రి శివాజీకి మార్గదర్శిగా నిలిచిన రాజమాత జిజాబాయి పర్యవేక్షణలోనే శంభాజీ పెరిగారు. పిలాజీ షిర్కే కుమార్తె జీవూబాయిని వివాహం చేసుకున్నారు. -
Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
Crude Oil Prices: పశ్చిమ ఆసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపే దిశగా సాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు సరఫరాకు ఆటంకాలు కలగవచ్చనే ఆందోళనల మధ్య, భారత్ తన విదేశీ మార్పిడి నిల్వలను కాపాడుకోవడానికి ఇప్పటికే బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచింది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం రవాణాకు అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' ప్రాంతంలో అనిశ్చితి నెలకొనడం వల్ల క్రూడాయిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంధన అవసరాల కోసం 85 శాతం…
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!