Shamar Joseph: టీ20 వరల్డ్ కప్ జోరుగా సాగుతోంది. రికార్డులు, విజయోత్సవాల మధ్య ఈ వరల్డ్ కప్ మ్యాచ్లు కొనసాగుతున్నాయి. అయితే.. తాజాగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో వెస్టిండీస్ జట్టు ఇటలీపై 42 పరుగుల తేడాతో గెలిచింది. ఇది ఆ జట్టుకు వరుసగా నాలుగో గెలుపు. ఇటలీ మొదటిసారి ఈ ప్రపంచకప్ ఆడుతోంది. ఈ మ్యాచ్లో తగ్గేదేలే అన్న రీతిలోనే మొదట దూసుకుపోయింది.
YS Jagan: 2014 కల్లా అప్పులు రూ.లక్షా 47 వేల 717 కోట్లని.. బాబు దిగిపోయే నాటికి రూ.3లక్షల 90 వేల 247 కోట్ల అప్పులు చేశారని మాజీ సీఎం జగన్ అన్నారు. తాము దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు రూ.7లక్షల 21 వేల 918 కోట్లని.. కానీ.. రూ.9లక్షల 74 వేల కోట్లు అని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ ఇలా తప్పుడు ప్రచారాలు చేయవచ్చా? అని ప్రశ్నించారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ…
OpenAI vs Anthropic: ఓపెన్ ఏఐ vs ఆంథ్రోపిక్ ఏఐ మధ్య వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా భారత్లో జరిగిన ఏఐ ప్రభావ సదస్సులు ఈ ఇద్దరి సీఈవోల మధ్య రగడ కనిపించింది. గ్రూప్ ఫోటో తీసుకునే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)తో పాటు వేదికపై ఉన్న టెక్నాలజీ రంగ ప్రముఖులు అందరూ ఒకరికొకరు చేతులు కలిపి పైకి ఎత్తారు. ఐక్యతకు గుర్తుగా తీసుకున్న ఈ ఫొటోలో మాత్రం ఇద్దరు ప్రముఖులు భిన్నంగా కనిపించారు. […]
YS Jagan: మన రాష్ట్ర పురోగతి అట్టడుగున ఉందని..కానీ వృద్ధిరేటులో దూసుకుపోతున్నట్లు చంద్రబాబు చెప్తున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు.. చంద్రబాబు ఎవరికి చెవిలో పూలు పెడుతున్నారు.. తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన రాష్ట్ర పరిస్థితులపై మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు పక్కదోవ పట్టాయన్నారు.. దోచుకో.. పంచుకో.. తినుకో అన్నట్లుగా టీడీపీ నేతల వ్యవహారం ఉందని విమర్శించారు.. వనరులు మొత్తం దోచేస్తున్నారన్నారు.. ఆయనకు ఒక విమానం.. దాంతో ఒక హెలికాఫ్టర్ ఉందని.. లోకేష్, పవన్కు కూడా సేమ్ అలాగే ఉన్నాయన్నారు.…
MyCURE: జీహెచ్ఎంసీ ‘మైక్యూర్’ యాప్ ప్రారంభమైంది. పౌర సేవలు ఇక ఒకే డిజిటల్ వేదికపై అందుబాటులోకి తెచ్చింది జీహెచ్ఎంసి.. పాత ‘MyGHMC’ యాప్కు బదులుగా నూతన ‘మైక్యూర్’ యాప్ను ప్రవేశ పెట్టింది. శానిటేషన్ నుంచి టౌన్ప్లానింగ్ వరకు అన్ని సేవలు ఒకే యాప్లో అందుబాటులోకి తెచ్చింది. వీధి దీపాలు, రహదారులు, కాల్వలు, చెత్త సమస్యలపై నేరుగా ఫిర్యాదు నమోదు సౌకర్యం కల్పించనుంది.. ఫిర్యాదులపై రియల్టైమ్ ట్రాకింగ్ సదుపాయం అందుబాటులో ఉంది.. పరిష్కార స్థితిగతులపై తక్షణ సమాచారం అందించనుంది..
Balka Suman: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.. ఫస్ట్క్లాస్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో బాల్క సుమన్కు ఆదిలాబాద్ జైలుకు తరలించారు. ఈ రిమాండ్ కేసు డైరీలో సంచలన విషయాలు బయటపడ్డాయి.. ఏ1గా బాల్క సుమన్ ఉండగా.. ఏ2 మూల రాజిరెడ్డి, ఏ4 దోమ కొండ అనీల్, ఏ8 మామిడి లక్ష్మి కాంత్లను సైతం అరెస్టు చేశారు..
iBomma Ravi: చంచల్ గూడా జైలు నుంచి ఐ బొమ్మ రవి విడదలయ్యాడు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఐబొమ్మ రవి బయటకు వచ్చాడు. పోలీసులు ఐ బొమ్మ రవిపై ఐదు సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.. సుమారు 90 రోజులపాటు జైలులో ఉన్న రవి తాజాగా విడదలయ్యాడు.. విడుదల అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెనుతిరిడాడు ఐ బొమ్మ రవి.
Pakistan vs Namibia: నమీబియాతో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలిస్తేనే నెక్ట్స్ మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్కు అవకాశం ఉండేది. ఈ ఒత్తడిలోనూ పాక్ ప్లేయర్లు అద్భుత ప్రదర్శనతో పాకిస్థాన్ బతికి పోయింది. పాక్ జట్టు ఏకంగా 102 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయానికి ప్రధాన కారణం ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan). సాహిబ్జాదా ఫర్హాన్ కేవలం 58 బంతుల్లోనే 100 పరుగులు చేసి టీమ్ను అజేయంగా నిలిపాడు. తన ఇన్నింగ్స్లో 11…
Mohsin Naqvi: ఇటీవల జరిగిన భారత-పాకిస్థాన్ మ్యాచ్ ఏ మేరకు హాట్ టాపిక్గా మారిందో తెలిసిన విషయమే. పాకిస్థాన్ భారత్తో మ్యాచ్ ఆడేందుకు ముందు ఒప్పుకోలేదు. అనేక మీటింగ్స్ తరువాత ఎట్టకేలకు దిగి వచ్చి మ్యాచ్ ఆడింది. అంతే కాదు.. ఎంతో బిల్డప్ కొట్టిన పాకిస్థాన్ చివరకు భారత్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. అయితే.. ఈ అంశంపై తాజాగా పీబీసీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ యూటర్న్ వెనుక అసలు కారణం అనుర కుమార దిసానాయకే (Anura…
Harish Rao: క్యాతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకు మాజీ శాసనసభ్యులు, దళిత నాయకుడు బాల్క సుమన్ను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. క్యాతన్ పల్లిలో బీఆర్ఎస్కి పూర్తి మెజారిటీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన తీరు చూసి యావత్ తెలంగాణ అసహ్యించుకుంటున్నదన్నారు. అధికార బలం, పోలీసు బలం, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక…