Kondagattu: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు గుట్ట కింద( స్టేజీ వద్ద) ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదలైన చిన్న స్పార్క్ క్షణాల్లోనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడేలా చేసింది. కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారి వరకు దాదాపు 32 బొమ్మల దుకాణాలకు నిప్పంటుకొని సామగ్రి కాలి బూడిదైంది. అగ్ని తీవ్రత ఎక్కువగా ఉండటంతో 20కి పైగా దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు అదుపు చేయడానికి స్థానికులు ప్రయత్నించినా, ప్లాస్టిక్, చెక్క సామగ్రి ఎక్కువగా ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. ఫైరింజన్లు…
Suryapet: తెలంగాణ పంచాయతీ ఎన్నికల వేళ గ్రామీణ రాజకీయాలు ఊహించని మలుపులు తీసుకుంటున్నాయి. సాధారణంగా గ్రామస్థాయి పదవుల కోసం స్థానికులు, వ్యాపారులు, రైతులు పోటీకి దిగడం చూస్తుంటాము. అయితే ఈసారి సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో చోటుచేసుకున్న పరిణామం అందరి దృష్టినీ ఆకర్షించింది. సర్వీస్ మిగిలి ఉండగానే సబ్ఇన్స్పెక్టర్ పులి వెంకటేశ్వర్లు ఉద్యోగాన్ని వదిలి సర్పంచ్ పదవికే నేరుగా పోటీ చేసేందుకు సిద్ధమవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Pocharam Infocity: పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ పక్కన అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పద కదలికలు కనిపించాయి. టార్చ్లైట్లు, పూజా సామాగ్రి, గడ్డపారలతో కొందరు వ్యక్తులు ఏదో చేస్తున్నట్లు అనుమానం వచ్చింది. చూస్తే ఏదో రహస్య కార్యక్రమం జరుగుతున్నట్టే అనిపించింది. ఇదే విషయం స్థానికుల దృష్టికి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నప్పుడు.. తవ్విన ఓ పెద్ద గుంతతో పాటు.. పగలగొట్టిన కొబ్బరికాయలు, నిమ్మకాయలు కనిపించాయి. ఇది ఏదో పూజ తంతులా అనిపించింది. స్పాట్లో 8 మంది వ్యక్తులకు పోలీసులకు చిక్కారు. ప్రశ్నిస్తే మొదట్లో ఎవరూ…
Seethakka: బీఆర్ఎస్ దీక్షా దివాస్ కి మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు.బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజే దీక్షా దివస్ చేసేవాళ్లన్నారు.. అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమీ లేదు.. అందుకే ఒక్క రోజుకి అప్పుడు దీక్షా దివస్ను పరిమితం చేశారని వ్యాంగ్యంగా స్పందించారు. మంత్రి సీతక్క తాజాగా నాంపల్లిలో మీడియాతో మాట్లాడారు. అధికారం పోయిన తర్వాత పది రోజులపాటు దీక్షా దివస్ పేరుతో నాటకాలు ఆడాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించారు.
Bhatti Vikramarka: 2047 వరకు మూడు ట్రిలియన్ల ఎకానమీకి చేరుకోవాలనేది లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అందుకు కావలసిన పెట్టుబడులకు అవసరమైనది విద్యుత్ అన్నారు. అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి ప్లానింగ్ చేస్తున్నాం.. పవర్ డిమాండ్ రాష్ట్రంలో పదేళ్లుగా పెరుగుతుందని తెలిపారు. తాజాగా ప్రజా భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.. 2014 నుంచి విద్యుత్తు 14.2 డిమాండ్ గ్రోత్ ఉందన్నారు.. 2020- 2021 నుంచి 5.44 గ్రోత్, 2024- 25లో 9.8 శాతం గ్రోత్ కనిపించిందని…
Hyderabad: ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ నంటూ పలువురు యువతులకు ఎరేసిన కేటుగాడిని పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో యువతులను టార్గెట్ గా చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న యువకుడిని పట్టుకున్నారు. ఆ యువకుడి పేరు మహమ్మద్ షాజాద్ గా గుర్తించారు. బీహార్, పాట్నా జిల్లా, పలిగంజ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ షాజాద్ ఆలం.. రెండేళ్ళ క్రితం హైదరాబాద్ కు వచ్చాడు. సోషల్ మీడియాలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్నంటూ పలు ఫోటోలు, వీడియోలు పంచుకున్నాడు.
Heart Attack Early Signs: ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె వ్యాధుల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో చిన్న చిన్న లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు ప్రారంభ సంకేతాలు చాలా సార్లు కేవలం ఛాతీ నొప్పితోనే కాకుండా చేతుల్లో లాగుడు, దవడవైపు వ్యాపించే నొప్పి, ఆకస్మికంగా వచ్చే చెమటలు, శ్వాసలో ఇబ్బంది రూపంలో కనిపిస్తాయి. ఇలాంటి సంకేతాలు వస్తే భయంతో గందరగోళానికి గురికావొద్దు. తక్షణ ఉపశమనం అందించే నైట్రేట్ ఆధారిత మందులు నాలుక క్రింద ఉంచితే రక్తనాళాలు సడలిపోతాయని…
Hyderabad Cyber Fraud: అర్ధ రాత్రి వేళ ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకోవడం, అడ్డొస్తే హతమార్చి సొత్తు కాజేయడం ఒకప్పుడు నేరగాళ్ల పంథా. నగరంలో ఈ తరహా దోపిడీలు, దొంగతనాల స్థానంలో సైబర్ నేరాలు భారీగా పెరిగిపోవడం కలవరపెడుతోంది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో గత కొంతకాలంగా చోరీలు, ఇళ్లల్లో దొంగతనాల కేసుల్లో పెద్దగా పెరుగుదల కనిపించడం లేదు. ఇదే సమయంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా నమోదవుతోంది. తాజాగా హబ్సిగూడ చెందిన డెంటల్ డాక్టర్ను సైబర్ నేరగాళ్లు నిలువునా దోచేశారు. డాక్టర్ నుంచి…
Harish Rao: తెలంగాణ అజరామర చరిత్రకు వీరోచిత సంతకం కేసీఆర్ అని మాజీ మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. నేడు దీక్షా దివస్ పురస్కరించుకొని ఎక్స్ లో పోస్ట్ చేశారు. "'తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్ 29న ప్రారంభించిన ఆమరణ దీక్ష, ఉద్యమ గతిని మలుపు తిప్పింది. సరికొత్త చరిత్రకు నాంది పలికింది. తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసింది. 'రానే రాదు, కానే కాదు' అన్న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సబ్బండ వర్గాలను ఏకం చేసి సుసాధ్యం చేసి చూపిన ఘన…
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లె సర్పంచ్ ఏకగ్రీవమైంది.. ఎస్సీకి రిజర్వ్ అయిన కొండారెడ్డిపల్లె సర్పంచ్ పదవికి 15 మంది పోటీ పడ్డారు. చివరికి సర్పంచ్ ఎన్నికను గ్రామ పెద్దలు ఏకగ్రీవం చేశారు.. 15 మందిలో ఒకరి పేరును సీల్డ్ కవర్లో ప్రకటించనున్నారు. ఎవరి పేరు వచ్చినా గ్రామం మొత్తం సమిష్టిగా ఆ నిర్ణయాన్ని గౌరవించాలనేది గ్రామ నాయకత్వం అభిప్రాయంగా చెబుతున్నారు.