CM Chandrababu: ‘స్వర్ణ కుప్పం విజన్ 2029’కు శ్రీకారం.. కుప్పం రూపురేఖలు మార్చే మాస్టర్ ప్లాన్పై సీఎం సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక అడుగులు వేశారు. ‘స్వర్ణ కుప్పం విజన్ 2029’ ప్రణాళికపై సింగపూర్కు చెందిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ సుర్బానా జురాంగ్ (SJ), ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులతో సీఎం తన కుప్పం క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అందుకోసం పక్కా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా స్వర్ణ కుప్పం విజన్ 2029పై తాము ప్రత్యేకంగా రూపొందించిన ప్రాథమిక మాస్టర్ ప్లాన్ను సుర్బానా జురాంగ్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యంగా కుప్పం ప్రాంతంలోని వ్యవసాయం, టూరిజం (పర్యాటక) రంగాలలో కొత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, అమలు చేయాల్సిన అంతర్జాతీయ స్థాయి ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. కుప్పం నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేక భౌగోళిక స్వరూపం, రవాణా సౌకర్యాలు, ఇక్కడి హార్టికల్చర్ ఉత్పత్తులు, పంటల సరళి, అపారమైన పశుసంపదతో పాటు స్థానిక ప్రజల జీవన విధానం, వారి ప్రధాన ఆదాయ వనరుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా సంస్థల ప్రతినిధులకు క్షుణ్ణంగా వివరించారు. ఈ వనరులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గ రూపురేఖలను మార్చేలా ఒక పటిష్టమైన విజన్ ప్లాన్ను త్వరితగతిన రూపొందించాలని సీఎం సూచించారు. కుప్పం నియోజకవర్గంలో కేవలం మౌలిక వసతుల కల్పనే కాకుండా, ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని ప్రజల జీవన ప్రమాణాలు (స్టాండర్డ్ ఆఫ్ లివింగ్) ఆర్థికంగా పెంచేందుకు అవసరమైన చర్యలను తమ మాస్టర్ ప్లాన్ లో చేర్చాలని సీఎం కోరారు. స్థానిక యువత, ప్రజలలో నైపుణ్యాభివృద్ధిని పెంచడం, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడం, ప్రాంతీయంగా అందుబాటులో ఉన్న సహజ వనరులను అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వంటి కీలక అంశాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని సుర్బానా జురాంగ్, ఐఐటీ కాన్పూర్ సంస్థల ప్రతినిధులకు స్పష్టం చేశారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దులకు దగ్గరగా ఉంటూ.. ఎంతో ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన జీవనానికి అనువైన ప్రాంతంగా ఉన్న కుప్పానికి ఉన్న భౌగోళిక అనుకూలతలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం కుప్పం ప్రాంతానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని, ఈ పారిశ్రామిక వృద్ధికి అనుగుణంగా భవిష్యత్తు అవసరాలను తట్టుకునేలా సరికొత్త ప్రాజెక్టులను డిజైన్ చేయాలని ఆయా సంస్థల ప్రతినిధులను కోరారు.
Also Read
- డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
- Sri Hari Stotram: తొలి ఏకాదశి వేళ భక్తి టీవీలో అమృతతుల్యమైన "శ్రీహరి స్తోత్రం".. తప్పక వినండి!
- Tirumala: తొలి ఏకాదశి రద్దీతో కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 20 గంటల నిరీక్షణ..!
- Jagtial: జగిత్యాలలో విషజ్వరాల కలకలం.. రెండు రోజుల్లో ఇద్దరు చిన్నారులు మృతి
తాజావార్తలు
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Tamannaah Bhatia: దక్షిణాదిలో ఆంక్షలు.. హిందీలో స్వేచ్ఛ.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Sri Hari Stotram: తొలి ఏకాదశి వేళ భక్తి టీవీలో అమృతతుల్యమైన “శ్రీహరి స్తోత్రం”.. తప్పక వినండి!
-
Monsoon Havoc: హిమాచల్లో వర్ష బీభత్సం.. ఆకస్మిక వరదలు, విరిగిపడిన కొండచరియలు.. 80 మంది మృతి
-
Tirumala: తొలి ఏకాదశి రద్దీతో కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 20 గంటల నిరీక్షణ..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!