Kothuru Ram Kumar
Author- NTV Telugu-
IPL In Hyderabad: హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్లు జరగకపోవడానికి అసలు కారణం ఇదే.?!
IPL In Hyderabad: ఐపీఎల్ 2025 మే 17 నుంచి మళ్లీ ప్రారంభమవుతున్నట్లు బీసీసీఐ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మే 8న ఐపీఎల్ నిలిపివేయబడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభుత్వ వర్గాలు, భద్రతా సంస్థలు, టోర్నీ నిర్వాకులతో విస్తృతంగా చర్చించిన అనంతరం మళ్లీ టోర్నీ కొనసాగించేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు తగ్గట్టుగానే కొత్త షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. Read Also: […] -
Miss World 2025: చార్మినార్ వద్ద “హెరిటేజ్ వాక్”లో పాల్గొననున్న ప్రపంచ సుందరీమణులు.!
Miss World 2025: హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్-2025 (Miss World 2025) పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోటీల కోసం హైదరాబాద్ వచ్చిన ప్రపంచ సుందరీమణులు నేడు (మే 13) నగరంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు. మొత్తం ప్రపంచంలోని 109 దేశాల నుంచి వచ్చిన ఈ సుందరీమణులు నగరంలోని చారిత్రక ప్రదేశమైన చార్మినార్ వద్ద ‘హెరిటేజ్ వాక్’లో పాల్గొననున్నారు. Read Also: WTC Final: ఐపీఎల్ 2025 సందిగ్ధత మధ్య డబ్ల్యూటీసీ […] -
WTC Final: ఐపీఎల్ 2025 సందిగ్ధత మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్కు జట్టును ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా..!
WTC Final: ఐపీఎల్ 2025 పొడిగింపుపై కొనసాగుతున్న సందిగ్ధత మధ్య క్రికెట్ ఆస్ట్రేలియా (CA) తాజాగా తమ డబ్ల్యూటీసీ (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్) ఫైనల్, ఆ తర్వాత జరిగే వెస్టిండీస్ టూర్ కోసం జట్టును మంగళవారం అధికారికంగా ప్రకటించింది. జూన్ 11 నుంచి లార్డ్స్లో జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడేందుకు 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. Read Also: Tiranga Yatra: భారత సైనికుల త్యాగాలకు గౌరవంగా దేశవ్యాప్తంగా ‘తిరంగా యాత్ర’ చేపట్టనున్న బీజేపీ.! […] -
Tiranga Yatra: భారత సైనికుల త్యాగాలకు గౌరవంగా దేశవ్యాప్తంగా ‘తిరంగా యాత్ర’ చేపట్టనున్న బీజేపీ.!
Tiranga Yatra: భారత సైనిక దళాల ధైర్యసాహసాలను స్మరించుకుంటూ బీజేపీ పార్టీ మంగళవారం (మే 13) నుంచి దేశవ్యాప్తంగా ‘తిరంగా యాత్ర’ను ప్రారంభించనుంది. ఈ యాత్ర మే 13 నుంచి మే 23 వరకు 11 రోజుల పాటు కొనసాగనుంది. తాజాగా విజయవంతంగా ముగిసిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ఈ యాత్ర మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక నేడు సాయంత్రం 4 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది. దేశభక్తి, ఐక్యత, సైనికుల సేవలకు గౌరవం తెలిపేలా […] -
Polycet 2025: నేడే పాలీసెట్ 2025 పరీక్ష.. ఒక్క నిమిషం ఆలస్యమైన ‘నో ఎంట్రీ’..!
Polycet 2025: నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ లలో 3 సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా.. వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల ప్రవేశానికై పాలిటెక్నిక్ ఎంట్రన్స్-2025 (Polycet 2025) పరీక్ష జరుగుతుంది. నేడు (మంగళవారం) రోజున ఉదయం 11.00 గం. నుండి మధ్యాహ్నం 1.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షా జరగనుంది. Read Also: LRS Scheme: మే 31 వరకు ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు […] -
LRS Scheme: మే 31 వరకు ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగించిన ప్రభుత్వం..!
LRS Scheme: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీము (LRS)కు సంబంధించిన గడువు పొడిగింపుపై ఓ కీలక నిర్ణయం తీసుకుంది. LRS ఫీజుపై ఇచ్చే 25 శాతం రాయితీని మే 31 వరకు పొడిగించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి టీ.కె. శ్రీదేవి జీవో జారీ చేశారు. ఇకపోతే, మార్చి నెల నుంచి అమల్లో ఉన్న ఎల్ఆర్ఎస్ గడువును ప్రభుత్వం గతంలో ఏప్రిల్ 30వ తేదీ వరకు ఒకసారి పొడిగించగా.. […] -
Sachin Tendulkar: విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్ పై సచిన్ టెండూల్కర్ భావోద్వేకం..!
Sachin Tendulkar: టీమిండియా మాజీ కెప్టెన్ లలో ఒకరైన విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన సందర్భంగా భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఓ భావోద్వేగంతో కూడిన కథను సోషల్ మీడియా వేదికా గుర్తు చేసుకున్నారు. తన టెస్టు రిటైర్మెంట్ సందర్భంగా కోహ్లీ ఇచ్చిన ఒక విలువైన గిఫ్ట్ ప్రతిపాదనను గుర్తు చేసుకుంటూ, కోహ్లీకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. Read Also: Bangladesh: షేక్ హసీనాకు బిగ్ షాక్.. యూనస్ ప్రభుత్వం అవామి లీగ్ […] -
DGMO Meeting: భారత్, పాక్ మధ్య కీలక చర్చలు.. సాయంత్రానికి వాయిదా..!
DGMO Meeting: భారత్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన డీజీఎంవో స్థాయి చర్చలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 12 గంటలకు హాట్ లైన్ ద్వారా ఈ చర్చలు జరగాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చర్చలు సాయంత్రం 5 గంటలకు వాయిదా వేసినట్టు జాతీయ మీడియా అధికార వర్గాలు తెలిపాయి. ఇక, ఈ చర్చలు వాయిదా పడటానికి గల కారణాలపై స్పష్టత లేదు. ఇటీవల కశ్మీర్లోని పహల్గాం (Pahalgam) ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి (terror […] -
Donald Trump: డొనాల్డ్ ట్రంప్కు ఇంద్రభవనం లాంటి లగ్జరీ విమానం గిఫ్ట్ ఇస్తోన్న ఖతార్.. ధర ఎంతో తెలుసా..?
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఖతార్ రాజ కుటుంబం విలాసవంతమైన బోయింగ్ 747-8 జెట్ను బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ విమానం విలువ సుమారు 400 మిలియన్ డాలర్లు(దాదాపు 3,300 కోట్లు)గా అంచనా వేయబడింది. ఈ విమానం తాత్కాలికంగా ఎయిర్ ఫోర్స్ వన్గా ఉపయోగించబడే అవకాశం ఉంది. 2029లో ట్రంప్ అధ్యక్ష పదవీ కాలం ముగిసిన తర్వాత, ఈ విమానం ట్రంప్ అధ్యక్ష గ్రంథాలయ ఫౌండేషన్కు బహుమతిగా ఇవ్వబడనుంది. ఇక ఈ బహుమతి విషయాన్ని […] -
US-China Tariffs: హమ్మయ్య.. అమెరికా, చైనా మధ్య కుదిరిన సుంకాల ఒప్పందం..!
US – China Tariffs: అమెరికా, చైనా దేశాలు పరస్పర వాణిజ్య ఉత్పత్తులపై విధించిన సుంకాలను తాత్కాలికంగా తగ్గించేందుకు సంయుక్తంగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం నేపథ్యంలో రాబోయే 90 రోజులపాటు ఇరు దేశాలు తమ సుంకాలను గణనీయంగా తగ్గించనున్నాయి. సమాచారం మేరకు, అమెరికా ప్రభుత్వం చైనా ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాన్ని ప్రస్తుత 145 శాతం నుండి ఏకంగా 30 శాతానికి తగ్గించనుంది. అదే విధంగా, చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై విధించిన సుంకాన్ని […]
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!