ఇప్పటికే దక్షిణాఫ్రికా పర్యటనలో వరుస పరాజయాలతో డీలా పడ్డ టీమిండియాకు ఐసీసీ భారీ షాకిచ్చింది. కేప్టౌన్ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్లో టీమిండియా నిదానంగా బౌలింగ్ చేసిందని ఆరోపిస్తూ ఐసీసీ భారీగా ఫైన్ విధించింది. రాహుల్ సేన నిర్ణీత సమయం కంటే 2 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసింది. దీంతో టీమిండియాకు ఐసీసీ 40 శాతం జరిమానా విధించింది. దీంతో భారత ఆటగాళ్లకు తమ మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత పడనుంది. ఐసీసీ నియామవాళిలోని […]
గత నాలుగేళ్లుగా టీమిండియా మెరుగ్గా రాణిస్తున్నప్పటికీ పరిమిత ఓవర్ల జట్టులో తక్షణమే మార్పులు చేయాలని భారత తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అభిప్రాయపడ్డాడు. 2023 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని తాము ఆడుతున్నామని… దానికి అనుగుణంగా మెరుగైన జట్టును సిద్ధం చేసుకోవాలన్నాడు. భారత జట్టుకు కెప్టెన్సీ వహించాలన్నది తన కల అని.. అది సాకారమైందని కేఎల్ రాహుల్ అన్నాడు. దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఓటమికి ఏదో సాకు చెప్పాలని తాను అనుకోవడం లేదని.. అయితే ఆ ఓటముల […]
తెలంగాణలో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో పార్టీని ప్రక్షాళన చేయాలని వైఎస్ షర్మిల నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటి వరకు పార్టీలో ఉన్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. కమిటీల స్థానంలో జిల్లాలకు కో ఆర్డినేటర్లను నియమిస్తున్నట్టు వైఎస్ షర్మిల వెల్లడించారు. గత ఏడాది రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిధులను, సోషల్ మీడియా ఇంఛార్జులను నియమించగా.. ఇప్పుడు ఆ కమిటీలన్నీ రద్దు చేయడం హాట్ టాపిక్గా మారింది. Read […]
మహారాష్ట్రలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. డియోలీ నుంచి వార్ధాకు వెళ్తున్న సమయంలో ఓ కారు అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడిక్కడే మరణించారు. కారులో ఉన్న వారంతా వైద్య విద్యార్థులుగా పోలీసులు నిర్ధారించారు. మృతులంతా 25-35 ఏళ్లు లోపు వారే. మృతుల్లో తిరోడా ఎమ్మెల్యే విజయ్ రహంగ్డేల్ కుమారుడు కూడా ఉన్నాడు. Read Also: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు: ఉదయం రాజ్యసభ.. సాయంత్రం లోక్సభ […]
ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ సందర్భంగా యువతను ఉద్దేశిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఎన్నికల ప్రక్రియ కీలకమైందని, అందుకే యువత అందరూ ఓటు వేయడం మన కర్తవ్యంగా పరిగణించాలని వైసీపీ నేత విజయసాయిరెడ్డి సూచించారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువత ముందుకు రావాలని కోరారు. ఎందుకంటే మన దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైందేనని ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. కాగా ప్రతి ఏడాది జనవరి 25న […]
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా పార్లమెంట్ ఉభయ సభలను వేర్వేరు సమయాల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉ. 10 గంటల నుంచి సా. 3 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్సభ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు లోక్సభ సచివాలయం బులిటెన్ విడుదల చేసింది. ఫిబ్రవరి […]
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈనెల 26న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం నిర్వహించనుంది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ ఈ వేడుకలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు. ★ బెంజిసర్కిల్ వైపు నుంచి ఎంజీ రోడ్డు […]
టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరోసారి సత్తా చాటింది. 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శనతో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా స్మృతి మంధాన నిలిచింది. ఈ విషయాన్ని ఐసీసీ స్వయంగా వెల్లడించింది. ఈ అవార్డు రేసులో ఇంగ్లండ్ ప్లేయర్ టామీ బీమాంట్, దక్షిణాఫ్రికా ప్లేయర్ లిజెల్లె లీ, ఐర్లాండ్ క్రికెటర్ గాబీ లూయీస్ నిలిచినా.. స్మృతి మంధాన వారిని వెనక్కి నెట్టి తాను విజేతగా ఎంపికైంది. Read Also: […]
డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి కొడాలి నానిపై విమర్శలు చేశారనే ఆరోపణలపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను సోమవారం సాయంత్రం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అమరావతి వన్టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సోమవారం అర్ధరాత్రి బుద్ధా వెంకన్న బెయిల్పై విడుదలయ్యారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆయన్ను పోలీసులు విడుదల చేశారు. రెచ్చగొట్టేలా ప్రసంగం చేసినందుకు సెక్షన్ 153ఎ, భయోత్సాతం సృష్టించినందుకు సెక్షన్ 506, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని 505 (2), […]