ఎలక్ట్రానిక్స్ వస్తువుల కొనుగోలుపై ప్రభుత్వం జీఎస్టీని తగ్గించింది. ఇప్పుడు వీటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు 31.3 శాతం జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. వాషింగ్ మెషీన్లు, మొబైల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, గృహోపకరణాలు, యూపీఎస్ తదితర ఎలక్ట్రానిక్స్, వస్తువులు మొదలైన వాటిపై జీఎస్టీని తగ్గించి సామాన్య ప్రజలకు చిరునవ్వు తీసుకొచ్చింది ప్రభుత్వం.
మూడేళ్ళ తరువాత ఆర్టీసీలో సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడిందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ జరగలేదని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నాయన్నారు. ఆర్టీసీ డిపోలు మూతపడుతూ.. ప్రైవేటు బస్సులు అధికంగా పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పోలీసులు మానవత్వం చాటుకున్నారు. గ్రూప్-4 పరీక్ష రాయడానికి భార్యభర్తలు ఇద్దరు వచ్చారు. కురవి మండల పెద్దతండాకి చెందిన జగ్గులాల్, సబితా దంపతులు 3 నెలల చిన్నారితో సహా పరీక్ష రాయడానికి వచ్చారు. చిన్నారి వాళ్ళ నాన్నమ్మ దగ్గర బాగా ఏడుస్తుండటంతో మహిళ కానిస్టేబుల్ శ్రీలత చిన్నారిని దగ్గర తీసుకొని లాలించారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా హాజరవుతున్న జనగర్జన సభ కోసం ఖమ్మం నగరం అందంగా ముస్తాబైంది. ఖమ్మం నగరంలో అడుగడుగునా మూడు రంగుల జండాలే దర్శనమిస్తున్నాయి. ఎటు చూసినా.. కాంగ్రెస్ ఫ్లెక్సీలతో సుందరంగా మారింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జెండాలు, హోర్డింగ్ లతో అలంకరించారు. పట్టణంలో ప్రధాన రహదారులు, చౌరస్తాలు, కూడళ్లు, విద్యుత్ స్థంభాలను కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో అత్యంత సుందరంగా అలంకరించారు.
మహబూబూబాద్ జిల్లా హాస్పిటల్ లో దారుణం జరిగింది. మద్యం మత్తులో హల్చల్ చేశారు ఆస్పత్రి సిబ్బంది. యాక్సిడెంట్ అయిన బాధితులకు వారు కట్లు కట్టుతున్నారు. అంతేకాకుండా వారు ఫేషెట్ల్ ముందే అసభ్యంగా ప్రవర్తించారు. ఫుల్ గా తాగి రూమ్ వార్డులోనే చెత్త డబ్బాలో మూత్రం పోశారు.
GST Collections: దేశంలో మరోసారి వస్తు, సేవల పన్ను వసూళ్లు భారీగా నమోదయ్యాయి. జూన్ నెలకు గానూ రూ.1,61,497 కోట్లు వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో సీజీఎస్టీ రూపంలో రూ.31,013 కోట్లు, ఎస్జీఎస్టీ కింద రూ.38,292 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.80,292 కోట్లు చొప్పున వసూలైనట్లు తెలిపింది. Read Also: Semiconductor: ఇండియాకు క్యూ కడుతున్న చిప్ కంపెనీలు.. ఒడిశాలో యూనిట్ పెట్టేందుకు యూకే సంస్థ ప్లాన్.. గతేడాది జూన్లో రూ.1.44 […]
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. అభ్యర్థులకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కు సంబంధించి పూర్తయినట్లు తెలిపింది. మరోవైపు అభ్యర్థుల వయసు సడలింపు వివాదం చివరి దశలో తెరమీదికి వచ్చింది.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. భార్య కన్పించడం లేదనే మనోవేదనతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య కన్పించడం లేదని పోలీసులకు కూడ భర్త ఫిర్యాదు చేశాడు. అదృశ్యమైన వివాహిత కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా కూడ వివాహిత లభ్యం కాలేదు. దీంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు భర్త సెల్ఫీని రికార్డు చేశాడు.
గోపాలపురానికి చెందిన అచ్చిరెడ్డి, బాధిత మహిళ మీనాను నాలుగేళ్ల క్రితం ప్రేమ పేరుతో వేధించేవాడు. అప్పట్లో అచ్చిరెడ్డి పై మీనా కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. అమ్మాయిని ఇబ్బంది పెట్టను అని పెద్దల సమక్షంలో అచ్చిరెడ్డి హామీ ఇవ్వడంతో వివాదం ముగిసింది. కొన్ని నెలల తరువాత రావులపాలెంకు చెందిన పెద్దిరెడ్డికి మీనాను ఇచ్చి కుటుంబసభ్యులు వివాహం జరిపించారు. సంతోషంగా వీరి దాంపత్య జీవితం సాగింది. ఉద్యోగ రీత్యా కొన్ని రోజుల క్రితమే పెద్దిరెడ్డి దుబాయి వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే అచ్చిరెడ్డి…