టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్కు ఐసీసీ (ICC) షాక్ ఇచ్చింది. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్, భారత ఫాస్ట్ బౌలర్ సిరాజ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో సిరాజ్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినట్లు గుర్తించింది. దీంతో.. మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఉత్తరప్రదేశ్లోని బందాలో దారుణం చోటు చేసుకుంది. మహిళ ఓ వ్యక్తి ప్రైవేట్ భాగాలను కట్ చేసిన ఘటన సంచలనం రేపింది. ఆ మహిళ పదునైన వస్తువుతో అతని ప్రైవేట్ భాగాలను కత్తిరించింది. ఆ వ్యక్తి తన ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి తనపై దాడికి యత్నించడంతో తాను ఈ దారుణానికి ఒడిగట్టానని మహిళ పేర్కొంది.
బెంగళూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న 26 ఏళ్ల మహిళపై తన స్నేహితుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా.. తనకు మత్తు మందు ఇచ్చి.. అత్యాచారం చేసిన ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తుున్నాడని బాధితురాలు సోమవారం పోలీసులకు తెలిపింది.
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాజౌరీ గార్డెన్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న జంగిల్ జంబూర్ రెస్టారెంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో.. భారీగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి బయటకు పరుగులు తీశారు.
సోమవారం జరిగిన వేర్వేరు సంఘటనలలో రెండు స్పైస్జెట్ విమానాలను దారి మళ్లించారు. ఒకటి షిల్లాంగ్కు, మరొక విమానాన్ని కొచ్చికి సాంకేతిక సమస్యల కారణంగా డైవర్ట్ చేశారు విమానాయాన అధికారులు. కాగా.. అందులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదమేమీ లేదు.
అడిలైడ్లో భారత్తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండో టెస్టు మ్యాచ్లో ఆతిథ్య జట్టు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.. టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే.. తొలిరోజు స్వింగ్ అవుతున్న పింక్ బాల్ ముందు మార్నస్ లబుషేన్, నాథన్ మెక్స్వీనీల అద్భుతంగా ఆడటంతోనే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్ అభిప్రాయపడ్డాడు. వీరిద్దరే ఆసీస్ విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించారని తెలిపాడు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందేభారత్ ట్రైన్లు చైర్ కార్స్తో నడుస్తున్నాయి. కాగా.. స్లీపర్ వెర్షన్ త్వరలో అందుబాటులోకి రానుంది. స్లీపర్ వందే భారత్ సహాయంతో ప్రయాణీకులు హాయిగా పడుకుని నిద్రపోతూ చాలా దూరం ప్రయాణించవచ్చు. ఈ క్రమంలో.. రైల్వే ప్రయాణికులకు ఇది శుభవార్త లాంటిది. వందే భారత్ స్లీపర్ రైలు ట్రాక్పై ట్రయల్కు సిద్ధంగా ఉంది. ఈ రైలు ట్రయల్ రన్ త్వరలో ప్రారంభం కానుంది.
భారతదేశంలో అనేక రకాల నూనెలను వంటలకు ఉపయోగిస్తారు. వేరుశెనగ నూనె, పొద్దుతిరుగుడు నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, నువ్వుల నూనె, ఆలివ్ నూనె, ఆవాల నూనె మొదలైన అనేక రకాల నూనెలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారంగా ఆహారంలో నూనెను వాడతారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని రకాల నూనెలను వంటలో ఉపయోగించకూడదని అంటున్నారు. ఇందులో పామాయిల్ కూడా ఉంది. దీనిని ఉపయోగిస్తే గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు.
చలికాలం వచ్చిదంటే ముఖ్యంగా వేధించే సమస్య పెదవులు పగలడం, కాళ్లు చేతులు పగులుతాయి. చలి కాలంలో అనేక రకాల సమస్యలు తరచుగా ప్రజలను ఇబ్బందికి గురి చేస్తాయి. జలుబు, ఇతర ఆరోగ్య సమస్యలే కాకుండా.. చర్మం, జుట్టు సంబంధిత సమస్యలు కూడా ఈ సీజన్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తాయి. శీతాకాలంలో చర్మానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం.. చలికాలంలో గాలిలో తేమ ఉండదు.
ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. అయితే.. వంటింట్లో ఉండే లవంగాలతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనం ఉంది. లవంగాలను వివిధ రకాల వంటకాలలో ఉపయోగిస్తారు. లవంగాలు ఆహారానికి రుచితో పాటు అనేక వ్యాధులను నయం చేస్తాయి. రోజూ కేవలం 2 లవంగాలు నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.