మతపరమైన ప్రార్థనల కోసం నివాస గృహాన్ని ఉపయోగించడంపై ఎలాంటి ఆంక్షలు లేవని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. బెంగళూరులోని హెచ్బీఆర్ లేఅవుట్ నివాసి నివాసాన్ని ప్రార్థనకు ఉపయోగిస్తున్నారంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పీఐఎల్) కొట్టివేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
చంద్రునిపై చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత పాకిస్థాన్ పౌరులే పాక్ అంతరిక్ష సంస్థను ఎగతాళి చేస్తున్నారు. ఇక్కడ ఆహార కొరత ఉందని, అంతరిక్షంలోకి వెళ్లడం గురించి ఎవరు మాట్లాడతారని ప్రజలు అంటున్నారు.
చంద్రుడిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ కావడంతో ఇస్రో ఉత్సాహంగా ఉంది. చంద్రుడిపై సక్సెస్ సాధించిన ఇస్రో ఇప్పుడు సూర్యుని గురించి అధ్యయనం చేయడానికి ఒక వారంలోపు సోలార్ మిషన్ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.ఇస్రో సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 సోలార్ మిషన్ను ప్రారంభించనుంది.
రష్యా రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ మరణం ఆశ్చర్యం కలిగించదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై తిరుగుబాటు చేసిన క్షణమే, అతడికి మూడిందన్న వ్యాఖ్యలు వినిపించాయి.
దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సమ్మిట్ జరగనున్నందున అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో జరగనున్న G20 సమ్మిట్ సందర్భంగా 80 మంది వైద్యులు, 130 అంబులెన్స్ల సముదాయం ఏదైనా వైద్య అత్యవసర పరిస్థితులను నిర్వహిస్తాయని అధికారులు శుక్రవారం తెలిపారు.
కొంతకాలంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ మధ్య కొనసాగుతున్న లేఖల యుద్ధం ఇప్పుడు ముదిరింది. ముఖ్యమంత్రికి గవర్నర్ శుక్రవారం గట్టి హెచ్చరికలు జారీ చేశారు. గతంలో తాను రాసిన లేఖలకు సమాధానం ఇవ్వకపోతే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తానని హెచ్చరించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం ద్రాస్లోని కార్గిల్ వార్ మెమోరియల్ని సందర్శించి 1999లో పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో ప్రాణాలు అర్పించిన భారత సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ ఒక ప్రదేశం మాత్రమే కాదన్న రాహుల్గాంధీ.. ఇది పరాక్రమమని అభివర్ణించారు.
చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ నుంచి బయటికొచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ కదలికలన్నింటినీ ధ్రువీకరించామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తెలిపింది. చంద్రయాన్-3 రోవర్ 'ప్రజ్ఞాన్' ఎనిమిది మీటర్ల దూరం విజయవంతంగా ప్రయాణించిందని, దాని పేలోడ్లను ఆన్ చేసినట్లు ఇస్రో శుక్రవారం వెల్లడించింది.
గ్రీస్లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి అత్యున్నత గౌరవం దక్కింది. ప్రధాని మోడీకి గ్రీస్లోని ఏథెన్స్లో శుక్రవారం 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ అవార్డు' లభించింది.