PM Modi: గ్రీస్లో ప్రధాని మోడీకి అత్యున్నత గౌరవం.. పురస్కారంతో సత్కరించిన గ్రీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: గ్రీస్లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి అత్యున్నత గౌరవం దక్కింది. ప్రధాని మోడీకి గ్రీస్లోని ఏథెన్స్లో శుక్రవారం ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ అవార్డు’ లభించింది. గ్రీస్ అధ్యక్షురాలు కాటెరినా ఎన్ సకెల్లారోపౌలౌ గ్రీస్లో ప్రధాని మోడీ అధికారిక పర్యటన సందర్భంగా ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్’ను ప్రదానం చేశారు. ఇది గ్రీస్ దేశంలో రెండో అత్యున్నత పురస్కారం. దీనిపై ప్రధాని మోడీ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. గ్రీస్ అధ్యక్షురాలు కాటెరినా సకెల్లారోపౌలౌ, అక్కడి ప్రభుత్వానికి, గ్రీస్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది భారతదేశం పట్ల గ్రీస్ ప్రజలకు ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుందని ప్రధాని ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ ఒకరోజు పర్యటన నిమిత్తం గ్రీస్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రయాన్-3 విజయం భారత్కే కాదు.. యావత్ మానవాళికి దక్కిన విజయం అని గ్రీస్ అధ్యక్షురాలు కటారినా ఎన్ సకెల్లారోపౌలౌతో ప్రధాని మోడీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్తో ప్రతినిధి స్థాయి చర్చలు కూడా జరిపారు. ఆర్డర్ ఆఫ్ హానర్ పురస్కారం 1975లో స్థాపించబడింది. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ను గ్రీస్ ప్రెసిడెంట్ ప్రధానమంత్రులు, ప్రముఖ వ్యక్తులకు ప్రదానం చేస్తారు.
Also Read
- Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి 'గ్లో' రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
- DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
- Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
Read Also: Supreme Court: సత్యేందర్ జైన్ మధ్యంతర బెయిల్ సెప్టెంబర్ 1 వరకు పొడిగింపు
గ్రీస్ పర్యటనలో ఉన్న ప్రధాని ఆ దేశ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్తో సమావేశమై ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చించారు. భేటీ అనంతరం మాట్లాడిని మోడీ..వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, విద్య, డిజిటల్ చెల్లింపులు, ఫార్మా, పర్యాటకం, వ్యవసాయం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. భారత్- గ్రీస్ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామిగా ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలిపారు. భారత ప్రధాని మోడీ దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సమావేశాలు ముగిసిన అనంతరం నేడు గ్రీస్కు వెళ్లారు. గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ ఆహ్వానంపై మోదీ గ్రీస్ పర్యటనకు వెళ్లారు. గత 40 ఏళ్లలో భారత ప్రధాని గ్రీస్లో పర్యటించడం ఇదే తొలిసారి.
తాజావార్తలు
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
-
IND vs SL Test: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్లో…
ట్రెండింగ్
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!