టీడీపీలో చేరేందుకు చాలా మంది వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. వైసీపీ అధినేత జగన్ దుర్మార్గపు చర్యలు నచ్చక పోవడం కారణంగానే పలువురు నాయకులు పార్టీ వీడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. జగన్ స్వయంకృత ఫలితం కారణంగానే వైసీపీకి ఈ దుస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.
నా రూటే సెపరేటు అన్నట్టుగా ఉంటుంది ఆయన వ్యవహార శైలి.... కొంతకాలంగా మనిషొక దగ్గర మనసొక దగ్గర అన్నట్టుగా ఉంటున్నారట ఆ లీడర్.... పంటికింద రాయిలా మారిన ఆయన్ని ఎలా అటాక్ చేయాలా అని చూస్తున్న వారికి ఆయనే స్వయంగా ఆయుధం ఇచ్చేశారట. చుట్టూ సొంత మనుషులే చక్ర బంధం వేస్తున్న ఆ లీడర్ ఎవరు? ఏంటా పొలిటికల్ స్టోరీ?
హైడ్రా కూల్చివేతలు పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నాయా? ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం జరుగుతోందా? పాతబస్తీలో చెరువుల ఆక్రమణలు, ఎంఐఎం అక్రమ నిర్మాణాల సంగతేంటని ప్రశ్నించడం ద్వారా ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసే ప్రయత్నం జరుగుతోందా? అసలు కూల్చివేతలపై కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి?
ఒకప్పుడు మేమే కింగ్లమని అన్నారు. మా మాటకు ఎదురే లేదంటూ రీ సౌండ్ ఇచ్చారు. తీరా.. ఇప్పుడు బయటికి వస్తే డబ్బులు ఖర్చు అనుకుంటూ.. కామ్ సినిమా చూస్తున్నారు. అసలే కష్టాల్లో ఉన్నాం... డీజిల్ రేట్లు కూడా బాగా పెరిగిపోయాయ్... ఇప్పుడెందుకు రా బుజ్జా అన్ని బళ్ళు... అంతా కలిసి ఒక బండిలో సర్దుకోండన్న పాపులర్ మూవీ డైలాగ్ని గుర్తు చేసుకుంటూ... జాగ్రత్త పడుతున్నారట. ఎవరా లీడర్స్? ఏంటి వాళ్ళకు వచ్చిన కష్టం.
మరో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 13న మరో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నామని మంత్రి నారాయణ తెలిపారు. మిగిలిన అన్న క్యాంటీన్లను అక్టోబర్లో ఏర్పాటు చేస్తామన్నారు.
దేవాదాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో దేవదాయ శాఖపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిలీజియస్ టూరిజం ప్రమోషన్ కోసం ఎండో, ఫారెస్ట్, టూరిజం మంత్రులతో కమిటీ వేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఏపీ బీజేపీలో నామినేటెడ్ పదవులపై చర్చ జరిగింది. సీఎం చంద్రబాబుతో కలయికలో నామినేటెడ్ పదవులపై చర్చ జరిగినట్టు సమాచారం. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలకు చోటు కల్పించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ప్రతిపాదించినట్టు తెలిసింది.
YS Jagan: ఏపీలో టీడీపీ ప్రభుత్వం ప్రజారోగ్య రంగానికి ప్రభుత్వం ఉరితాడు బిగిస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే స్పెషలిస్టు వైద్యుల సహా సిబ్బంది నియామకాల్ని ఆపడంతో జీరో వేకెన్సీ పాలసీకి గండి కొడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు సర్వే ప్రారంభించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో 7ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు ఏర్పాటు పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. శ్రీకాకుళం, అన్నవరం, తాడేపల్లి గూడెం, నాగార్జున సాగర్, కుప్పం, ఒంగోలు-నెల్లూరు, అనంతపురంలలో వీటి ఏర్పాటును పరిశీలిస్తున్నామన్నారు.