Gorantla Butchaiah Chowdary: టీడీపీలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gorantla Butchaiah Chowdary: టీడీపీలో చేరేందుకు చాలా మంది వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. వైసీపీ అధినేత జగన్ దుర్మార్గపు చర్యలు నచ్చక పోవడం కారణంగానే పలువురు నాయకులు పార్టీ వీడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. జగన్ స్వయంకృత ఫలితం కారణంగానే వైసీపీకి ఈ దుస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే కొందరు టీడీపీలో చేరుతున్నారని మరికొంతమంది చేరే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వైసీపీ నేతలపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా టీడీపీలో చేర్పించుకుంటున్నారని వస్తున్న ఆరోపణలను బుచ్చయ్య చౌదరి ఖండించారు. వైసీపీ నేతలను తీసుకోవలసిన కర్మ మాకు ఏంటి …? మాకు ఉన్న బలం మాకు ఉందన్నారు.
Read Also: MP Purandeswari: బీజేపీలోకి కొల్లం గంగిరెడ్డి..! క్లారిటీ ఇచ్చిన పురంధేశ్వరి..
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
రాజమండ్రిలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం చిన్నాభిన్నం అయ్యిందని ఆరోపించారు.. గత ప్రభుత్వంలో ఉన్నతాధికారులు అరాచక శక్తులకు అండగా నిలిచారని విమర్శించారు. చంద్రబాబు చేస్తున్న కృషికి కేంద్రం నుంచి ఫలితం కనబడుతుందన్నారు. ఇసుక పాలసీలో నూతన విధానాలు రూపొందిస్తున్నామని రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వెల్లడించారు. ఇందువల్ల ఇసుక సరఫరాలో జాప్యం జరుగుతుందని అన్నారు. కొంతమంది అధికారులకు ఇంకా పాత వాసన పోలేదని.. వారిని దారిలోకి తీసుకువస్తామని అన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా న్యాయం చేస్తామన్నారు.
Read Also: Amaravati Farmers: రాజధాని రైతులకు సర్కార్ గుడ్న్యూస్.. 15వ తేదీలోగా ఖాతాల్లోకి సొమ్ము..
వైసీపీ నేతలు తప్పుడు ప్రచారంతో బతకాలని అనుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఎందుకు తీసుకురాలేదని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోందని అన్నారు బుద్ధిలేని మాజీ ముఖ్యమంత్రి అధికారులచే తప్పుడు పనులు చేయించారని ఆరోపించారు. ఆధారాలు బయటపడుతుంటే మార్ఫింగ్ అంటున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో అరాచకాలు అక్రమాలు చేసిన అధికారులపై విచారణ కొనసాగుతుందని అన్నారు. రాజమండ్రిలో బ్రాహ్మణుల, కాపుల భూములను వైసీపీ నేతలు తప్పుడు డాక్యుమెంట్లతో ఆక్రమించుకున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?