-
ఎంపి నామా కంపెనీలు, నివాసాలపై 13 గంటలుగా ఈడీ సోదాలు
ఎంపి నామ నాగేశ్వరరావు కంపెనీలు, నివాసాలపై ఈడీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. దాదాపు 13 గంటల పాటు కొనసాగిన సోదాలు.. ఖమ్మం, హైదరాబాద్ తో పాటూ ఆరు చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మదుకాన్ కంపెనీలో పలు రాంచీ ప్రాజెక్టు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఈడీ.. జూబ్లీహిల్స్ లో నామా నాగేశ్వరరావు సమక్షంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. అక్రమంగా నిధులు మళ్ళీంచారని మని ల్యాండరింగ్ యాక్ట్ కేసు నమోదు చేసింది ఈడీ. కొద్దిసేపటి క్రితం […] -
కరోనా టెస్టులో అపశృతి : పుల్ల ముక్కులోనే విరిగిపోయిన వైనం
చైనాలో పుట్టిన కరోనా వైరస్ విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనాను అరికట్టేందుకు అన్నీ రాష్ట్రాలు పరీక్షల సంఖ్యను పెంచాయి. దీంతో లక్షణాలు ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ తరుణంలో కరోనా టెస్టులో అపశృతి చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెంకట్రావుపల్లిలో కరోనా పరీక్ష నిర్వహించే సమయంలో పుల్ల ముక్కులోనే విరిగిపోయింది. రామడుగు మండలంలోని ఓ గ్రామ సర్పంచి శేఖర్ కొవిడ్ పరీక్ష చేయించు కునేందుకు పరీక్షా కేంద్రానికి వెళ్లారు. అయితే అక్కడ […] -
తెలకపల్లి రవి : జగన్ ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర సమస్యలు, రాజకీయ కథలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగివచ్చారు. ఈ పర్యటనలో కేంద్రంలో కీలకనేత హోం మంత్రి అమిత్ షాతో సహా అయిదుగురిని కలుసుకున్నారు.రైల్వే మంత్రి పీయుష్గోయెల్,నీటి పారుదల మంత్రి గజేంద్ర షెకావత్,పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్,ఉక్కు గనుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లతో పాటు నీటి ఆయోగ్వైస్ఛైర్మన్ రాజీవ్కుమార్ను కూడా కలిసి రాష్ట్రానికి రావలసిన నిధులు, కేంద్రంలో జరగాల్సిన పనులపై చర్చించారని అధికారిక సమాచారం. అయితే మీడియాలోనూ రాజకీయ వర్గాలలోనూ ఈ పర్యటనకు […] -
జర్నలిస్ట్ రఘు అరెస్ట్ తీరు పై బిసి కమీషన్ సీరియస్
జర్నలిస్టులపై జరుగుతున్న అగాయిత్యలపై జాతీయ బీసీ కమీషన్ సభ్యులు టీ. ఆచారి ఫైర్ అయ్యారు. జర్నలిస్ట్ రఘును తీవ్రవాదిలా రిక్కీ నిర్వహించి కిడ్నాప్ చేసి అరెస్ట్ చేయటంపై నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇలా వ్యవహరించటం సిగ్గుచేటు అని..చట్టాన్ని రక్షించాల్సిన వారే అడ్డదారిలో వెళ్ళటం ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటు అని మండిపడ్డారు. కేసులో ముద్దాయిగా ఉంటే నోటీసు ఇచ్చి అరెస్ట్ చేయొచ్చు అని..గతంలో ఆనం చిన్ని వెంకటేశ్వర్ రావ్ ను కూడా ఖమ్మంలో కిడ్నాప్ చేసి అరెస్ట్ […] -
టీఆర్ఎస్ లోకి కౌశిక్ రెడ్డి ? నిజమెంత !
ఈటల ఎపిసోడ్ నేపథ్యంలో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యం అయింది. దీంతో.. అన్నీ పార్టీలు హుజూరాబాద్ లోనే పాగా వేశాయి. అయితే.. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అనేది అందరిలోనూ మెదిలే ప్రశ్న. హుజూరాబాద్ ఈటలను ఢీ కొట్టాలంటే టీఆర్ఎస్ కు బలమైన నాయకుడు కావాలి. దీనికోసం టీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరినట్లు..ఈ మేరకు కేటీఆర్ ను కలిసినట్లు […] -
ఆరు అడుగులు తవ్వి ప్రజలు టీడీపీని భూస్థాపితం చేశారు : సజ్జల
సిఎం జగన్ ఢిల్లీ టూర్ పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఢిల్లీ వెళ్లి 5 గురు కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిని కలిశారని.. అదనపు సహాయం, రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్లిన అన్ని అంశాలను మీడియాకు ఎప్పటికప్పుడు వెల్లడించామని.. ఢిల్లీ పర్యటనకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు. గతంలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినప్పుడు చీకటి […] -
పెట్రోల్ ధరలపై లోకేష్ ఫైర్.. ఇది జగన్ రెడ్డి పాపమే..!
పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై టిడిపి నేత నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. విధ్వంసం-విద్వేషం రెండుకళ్లుగా సాగుతున్న జగన్ రెండేళ్ల పాలనలో ధరలు రెండింతలు పెరిగాయని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ట్యాక్స్లకు అదనంగా జగన్ ట్యాక్స్ తోడవడంతో అన్ని రేట్లూ పెరిగాయని చురకలు అంటించారు. బాదుడురెడ్డి దెబ్బకి పెట్రోల్ ధర శుక్రవారం దక్షిణాది రాష్ట్రాలలో సెంచరీ దాటి (రూ.101.61) నాటవుట్గా రికార్డులు సృష్టించిందని మండిపడ్డారు లోకేష్. పెట్రోల్ ధరల పెంపులో సౌత్లో ఏపీని […] -
సిఎం కెసిఆర్ కు కోమటిరెడ్డి బహిరంగ లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఎంఎంటీఎస్ ఫేజ్-2 ఘట్కేసర్-రాయిగిరి (యాదాద్రి) విస్తరణకు రైల్వే మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని… పలుమార్లు కేంద్ర మంత్రులను, రైల్వే అధికారులను కలిసి విన్నవించినందుకు ఆమోదం రావడం సంతోషంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే యాదగిరిగుట్టకు రాష్ట్ర రాజధాని నుంచి రవాణా సౌకర్యం చాలా సులభం అవుతుందని… అలాగే భక్తుల తాకిడి […] -
ఏపీ కరోనా అప్డేట్ : 24 గంటల్లో 61 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. కానీ మొదట్లో కంటే ఇప్పుడు కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 8,239 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,93,227 కి చేరింది. ఇందులో 16,85,303 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 96,100 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 61 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన […] -
ఇంటర్, పదో తరగతి పరీక్షలను ఇప్పట్లో పెట్టే పరిస్థితి లేదు…
ఇంటర్, పదో తరగతి పరీక్షలను ఇప్పట్లో పెట్టే పరిస్థితి లేదని.. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో రకరకాల ప్రతిపాదనలు పరిశీలించామని.. స్పష్టత వచ్చాక షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు.పరీక్షల నిర్వహణ విషయమై కొన్ని పార్టీలు రాజకీయం చేయాలని అనుకుంటున్నాయని..కోవిడ్ పరిస్థితి ఉందనే పరీక్షలను వాయిదా వేశామని వెల్లడించారు. పరీక్షల నిర్వహణ విషయంలో అనేక మార్గాలుంటే.. పరీక్షల రద్దు అనే మాట ఎందుకు..? అని ప్రశ్నించారు. లోకేష్ పరీక్షల్లో నిలబడకుండా దొడ్డి దారిన పదవులు పొందారో.. […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?