Bharat Bandh: నేడే భారత్ బంద్.. రైతుల ఆందోళనలు తీవ్రతరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers Protest: నేడు భారత్ బంద్ కు సంయుక్త కిసాన్ మోర్చా సహా అనేక రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతన్నలు చేపట్టిన నిరసనల్లో భాగంగా.. ఈ భారత్ బంద్ ని అత్యంత కీలకంగా కర్షకులు తీసుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చేందుకు మోడీ సర్కార్ దిగిరావాలని ఆందోళన చెపట్టేందుకు దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని రైతన్నలు సిద్ధమయ్యారు. దేశ నలుమూలల్లోని రైతు సంఘాలు.. ఈ భారత్ బంద్ లో పాల్గొని సక్సెస్ చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా కోరింది.
Read Also: Sarfaraz Khan: నా తప్పే.. సారీ సర్ఫరాజ్: జడేజా
Also Read
ఇక, కేంద్ర ప్రభుత్వం తీరుపై రైతులు సంఘాలు ఢిల్లీలో నిరసనలు చేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా పంజాబ్, హరియాణా నుంచి ఢిల్లీ వైపు వెళ్తుండగా వారిని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. బారికేడ్లు వేసి భారీగా భద్రతా ఏర్పాట్లతో వారందరినీ ఢిల్లీలోకి రానివ్వకుండా చేస్తున్నారు. అంతే, కాకుండా.. హరియాణాలో.. రైతులపై టియర్ గ్యాస్ ను సైతం ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న భారత్ బంద్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నేటి ఉదయం 6 గంటలకు మొదలై.. సాయంత్రం 4 గంటల వరకు ఈ బంద్ కొనసాగనుంది. అలాగే, ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై రైతులు, కార్మికులు ఆందోళన చేపట్టనున్నారు.
Read Also: Stock Market : మార్చి 2న శనివారం కూడా మార్కెట్ ఓపెన్.. ప్రత్యేక ట్రేడింగ్ సెషన్కు కారణమిదే
ఇక, రైతులకు ప్రధానంగా ఆరు డిమాండ్లు ఉన్నాయి..
1. పంటకు కనీస మద్దతు ధరకు చట్టం.
2. రైతు రుణ మాఫీ.
3. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు.
4. 2020 విద్యుత్ చట్టం ఉపసంహరణ.
5. లఖింపుర్ ఖేరీ ఘటనలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం.
6. గతంలో చేపట్టిన నిరసనల నేపథ్యంలో.. రైతులపై వేసిన కేసులను రద్దు చేయడం.
మరి రైతులు పిలుపునిచ్చిన
తాజావార్తలు
-
BCCI Meeting: సూర్యకుమార్ టీ20 కెప్టెన్సీపై కీలక నిర్ణయం?.. బీసీసీఐ సమావేశంలో హాట్ టాపిక్!
-
Sreeleela: శ్రీలీల – తిలక్ వర్మ రిలేషన్షిప్పై షాకింగ్ ట్విస్ట్..!
-
Kumar Sangakkara: “వైభవ్తో క్రికెట్ ముచ్చట్లు పెట్టను”.. బుడ్డోడి సీక్రెట్ లీక్ చేసిన రాజస్థాన్ హెడ్ కోచ్..
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..