YV Subba Reddy: నాయకత్వ మార్పుపై వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. అందుకే మార్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లలో మార్పులు, చేర్పులతో పాటు.. జిల్లా అధ్యక్షుల్లోనూ ఇదే జరిగింది.. అయితే, పార్టీలో నాయకత్వ మార్పుపై విశాఖ ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. విశాఖ వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ అమలు దినోత్సవం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి మంత్రి అమర్నాథ్, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే లు, ఎంపీలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నత విలువలతో రూప కల్పన జరిగిందన్నారు.. ఇప్పుడు రాజ్యాంగ స్పూర్తికి తగ్గట్టుగా రాష్ట్రంలో పాలన జరుగుతోందని స్పష్టం చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు పాలనలో రాజ్యాంగానికి తూట్లు పొడిచారని విమర్శించారు.. ఏపీలో పేదల సంక్షేమ పథకాలు అమలు రాజ్యాంగ స్పూర్తిగా ఆనువుగా జరుగుతున్నాయని వెల్లడించారు వైవీ సుబ్బారెడ్డి.
Read Also: Man loses tongue: జ్యోతిష్యుడి సలహా విని పాము కాటుతో నాలుకను కోల్పోయాడు.. ఎలాగంటే?
Also Read
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
ఇక, పార్టీలో నాయకత్వ మార్పుపై ఆయన స్పందిస్తూ.. పదవులు మార్చినంత మాత్రాన ఆ లీడర్లను తక్కువ చేసినట్టు కాదన్నారు వైవీ సుబ్బారెడ్డి.. నాయకులను అవసరం బట్టి మరోచోట వినియోగించుకోవాలని పార్టీ ఆలోచనగా తెలిపిన ఆయన.. పార్టీలో చేరికలు నిరంతర ప్రక్రియగా అభివర్ణించారు.. ఇక, పార్టీలో చేరికలపై స్పందించిన ఆయన.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా చేరవచ్చు అన్నారు.. ఆ చేరిక పార్టీకి ఏ మేరకు ప్రయోజనం అన్నది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. పాదయాత్రలు ఎవరైనా చేయవచ్చు.. ప్రజలకు ఇచ్చిన హామీలను 95 శాతం నెరవేర్చినది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి.. మరోవైపు, దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చిన మహనీయులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగానే ఏపీలో పాలన జరుగుతుందని తెలిపారు.
తాజావార్తలు
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!