YV Subba Reddy: నాయకత్వ మార్పుపై వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. అందుకే మార్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లలో మార్పులు, చేర్పులతో పాటు.. జిల్లా అధ్యక్షుల్లోనూ ఇదే జరిగింది.. అయితే, పార్టీలో నాయకత్వ మార్పుపై విశాఖ ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. విశాఖ వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ అమలు దినోత్సవం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి మంత్రి అమర్నాథ్, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే లు, ఎంపీలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నత విలువలతో రూప కల్పన జరిగిందన్నారు.. ఇప్పుడు రాజ్యాంగ స్పూర్తికి తగ్గట్టుగా రాష్ట్రంలో పాలన జరుగుతోందని స్పష్టం చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు పాలనలో రాజ్యాంగానికి తూట్లు పొడిచారని విమర్శించారు.. ఏపీలో పేదల సంక్షేమ పథకాలు అమలు రాజ్యాంగ స్పూర్తిగా ఆనువుగా జరుగుతున్నాయని వెల్లడించారు వైవీ సుబ్బారెడ్డి.
Read Also: Man loses tongue: జ్యోతిష్యుడి సలహా విని పాము కాటుతో నాలుకను కోల్పోయాడు.. ఎలాగంటే?
Also Read
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Kiran Kumar Reddy: పరస్పర గౌరవమే రాజకీయాలకు బలం.. మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇక, పార్టీలో నాయకత్వ మార్పుపై ఆయన స్పందిస్తూ.. పదవులు మార్చినంత మాత్రాన ఆ లీడర్లను తక్కువ చేసినట్టు కాదన్నారు వైవీ సుబ్బారెడ్డి.. నాయకులను అవసరం బట్టి మరోచోట వినియోగించుకోవాలని పార్టీ ఆలోచనగా తెలిపిన ఆయన.. పార్టీలో చేరికలు నిరంతర ప్రక్రియగా అభివర్ణించారు.. ఇక, పార్టీలో చేరికలపై స్పందించిన ఆయన.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా చేరవచ్చు అన్నారు.. ఆ చేరిక పార్టీకి ఏ మేరకు ప్రయోజనం అన్నది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. పాదయాత్రలు ఎవరైనా చేయవచ్చు.. ప్రజలకు ఇచ్చిన హామీలను 95 శాతం నెరవేర్చినది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి.. మరోవైపు, దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చిన మహనీయులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగానే ఏపీలో పాలన జరుగుతుందని తెలిపారు.
తాజావార్తలు
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!