కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని కోరినట్టు వెల్లడించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి… ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కనీస మద్దతు ధరను 24 పంటలకు మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కల్పిస్తున్నారని గుర్తుచేశారు.. అదే పద్ధతిలో దేశవ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఇక, ఆహార భద్రతా చట్టం అమలులో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని.. దానిని సరిదిద్దాలని సూచించారు. అణగారిన బీసీలను గుర్తించేందుకు సామాజిక ఆర్థిక కుల గణన చేయాలని సూచించారు.
ఇక, మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు ఎంపీ సాయిరెడ్డి.. రాష్ట్రానికి సంబంధించిన “దిశ” బిల్లును ఆమోదించాలని విజ్ఞప్తి చేశామన్న ఆయన.. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.. మరోవైపు, చంద్రబాబును ఎవరు తిట్టలేదు, అసెంబ్లీ రికార్డులు చూస్తే తెలుస్తుందన్న సాయిరెడ్డి… టీడీపీ అధినేత చంద్రబాబు ఏడుపు ఒక డ్రామా.. ఆయన నాటకాలు ఎవరూ నమ్మబోరన్నారు. ఇక, చంద్రబాబు యాక్షన్ కు రియాక్షన్ తప్పదని హెచ్చరించారు. జనాభా లెక్కలు తీసే బాధ్యత కేంద్రానిదేనన్న సాయిరెడ్డి.. కులాల వారిగా లెక్కలు తీస్తే న్యాయం జరుగుతుందన్నారు.