YSRCP: వైసీపీ ఎంపీ మార్గాని భరత్ సెల్ఫోన్ చోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ సెల్ఫోన్ చోరీకి గురైంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పర్యటనలో ఎంపీ మార్గాని భరత్ పాల్గొనగా.. ఆయన ఫోన్ను దుండగులు కొట్టేసినట్లు తెలుస్తోంది. తన ఫోన్ చోరీకి గురైందన్న విషయంపై ఎంపీ భరత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరగా రాజమండ్రి ఎయిర్పోర్టులోని హెర్బల్ షాపులో పని చేసే యువతితో ఆయన తన ఫోన్తో సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం ఫోన్ కనిపించలేదని ఎంపీ భరత్ వివరించారు. ఎంపీ వ్యక్తిగత సమాచారం అంతా సెల్ఫోన్లో ఉండటంతో కోరుకొండ పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు.
Read Also: PM Modi-Pawan Kalyan: మోడీ సభకు పవన్ రాకపోవటానికి కారణం ఇదే..!
Also Read
కాగా సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఎంపీ మార్గాని భరత్ ఫోన్ ఓ యువతి ఇంటిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సదరు యువతి ఇంటికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎంపీ సెల్ఫోన్ చోరీ అంటూ పోలీసులు తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఫిర్యాదు చేసేందుకు సదరు యువతి ఎస్పీ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో యువతి వెనుతిరిగింది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..