PM Modi-Pawan Kalyan: మోడీ సభకు పవన్ రాకపోవటానికి కారణం ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భీమవరంలో నిన్న ప్రధాని మోడీ చేతుల మీదుగా జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాకపోవటంపై ఏపీలో రకరకాలుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇవాళ స్పందించారు. పవన్ కళ్యాణ్ మొన్న ఇచ్చిన వీడియో సందేశమే ఆయనపై వస్తున్న విమర్శలకు సమాధానమని చెప్పారు. జనసేన శ్రేణులు ప్రధానమంత్రి సభను జయప్రదం చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునివ్వటాన్ని సోము వీర్రాజు గుర్తు చేశారు.
Read Also: Megastar Chiranjeeevi: పేరు మార్చుకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే..?
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
అసలు ఈ కార్యక్రమానికి, రాజకీయాలకి సంబంధంలేదని చెప్పారు. జనసేన పార్టీ బీజేపీకి మిత్రపక్షంగా కొనసాగుతోందని, అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసే పోటీ చేస్తాయని మరోసారి చెప్పారు. ఏపీలో ప్రధాని పర్యటన బాగా జరిగిందని సోము వీర్రాజు ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక పార్టీలకు కుటుంబ పాలనపైనే మక్కువని, బీజేపీకి మాత్రం రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని అన్నారు. ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తమ పార్టీ ఎదుగుతుందని ఆశాభావం వెలిబుచ్చారు.
యువ మోర్చా ఆధ్వర్యంలో ఆగస్టు 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా యువ సంఘర్షణ యాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఆయన బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రసంగించారు. అది ఆయన మాటల్లోనే.. “యువతకు ఉద్యోగాలిస్తామని జగన్ హామీ ఇచ్చారు. టీచర్లు, పోలీసు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తాంనన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని కూడా చెప్పారు. అన్ని వర్గాల వారికీ నేనున్నానని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇప్పుడు ఆ మాటలను మర్చిపోయారు.
సీఎం జగన్ తీరు వల్ల అందరూ నష్టపోయారు. ఏపీలో రెండో విడత రేషన్ బియ్యం పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. దీనిపై బీజేపీ ఉద్యమిస్తుంది. పేదల పక్షాన పోరాడుతుంది. ప్రధాని పర్యటనలో నల్ల బెలూన్లు ఎగరేయడం సరికాదు. మోడీ ఆదివాసీల గురించి మాత్రమే మాట్లాడారు. ప్రతిదీ రాజకీయ కోణంలో చూడటం సరికాదు. కొందరు సడన్గా పుట్టుకొచ్చి మేధావుల్లా మాట్లాడుతున్నారు. వాళ్లను పట్టించుకోం. ఎందుకంటే సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనేది మోడీ మంత్రం.
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భవిష్యత్ కార్యాచరణపై చర్చించాం. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం సాధించే దిశగా అడుగులు వేస్తాం. మా ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తాం. ఏపీలోని జాతీయ రహదారులు బాగున్నా రాష్ట్ర రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ఈ రోడ్లను బాగుచేసే బాధ్యతని యువకులకు ఇస్తాం. మొక్కలు పెంచి, సంరక్షించే పనినీ నిరుద్యోగులకే అప్పజెబుతాం” అని సోము వీర్రాజు అన్నారు. అనంతరం ఆయన యువ సంఘర్షణ యాత్ర పోస్టర్ను, లోగోను ఆవిష్కరించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!