YSRCP Leaders: పవన్ కళ్యాణ్ను చంద్రబాబు బలిపశువు చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Leaders: అమరావతిలోని తాడేపల్లిలో వైసీపీ కాపు, రెడ్డి, కమ్మ కార్పొరేషన్ల ఛైర్మన్లు శుక్రవారం మధ్యాహ్నం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కులాల ఛైర్మన్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇంటిపై రెక్కీ తన ఆధ్వర్యంలోనే జరిగిందని ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నానని రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్ సత్యనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. తన కారు పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కారు కాదని స్పష్టం చేశారు. అది గుజరాత్ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న కారు అన్నారు. రెడ్డి, కాపు సామాజిక వర్గాలను విడగొట్టాలని చూస్తున్నారని.. రెక్కీ నిర్వహించిన వారు చంద్రబాబు, లోకేష్తో ఫోటోలు దిగారని తెలిపారు. విశాఖలో జనసేన కార్యకర్తలు మంత్రులపై దాడులు చేశారని గుర్తుచేశారు.
Read Also: Kantara Star Rishabh Shetty: ‘కాంతార’ స్టార్ను కలిసిన మిస్టర్ 360
Also Read
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
- MP Uday Srinivas: 'జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం'.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
అటు ఏపీలో కాపు సామాజిక వర్గంపై కుట్ర జరుగుతోందని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర రెక్కీ చేసిన వారు కమ్మ సామాజికవర్గం వారే అని అన్నారు. పవన్ కళ్యాణ్పై ఎవరు కుట్ర చేస్తున్నారో జన సైనికులు తెలుసుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్పై రెక్కీ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని.. గత ఎన్నికల సమయంలో టీడీపీ వాళ్ళు కుట్ర చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించినట్లు గుర్తుచేశారు. కేఏ పాల్ కూడా తనపై కుట్ర చేస్తున్నారని అన్నారని చెప్పారు. రెడ్లు, కాపుల మధ్య విభేదాలు సృష్టిస్తే ఎవరికి లాభమో తెలుసుకోవాలన్నారు. కాపు సంఘాలు, పెద్దలు ఈ శక్తులను బయటకు తీయాలన్నారు. ఈ విషయంపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కులాల మధ్య కుంపట్లు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని.. పవన్ కళ్యాణ్ను చంద్రబాబు బలిపశువు చేస్తున్నారని కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ ఆరోపించారు. చంద్రబాబు తన వయసుకు తగ్గట్లు వ్యవహరిస్తే హుందాగా ఉంటుందని హితవు పలికారు.
తాజావార్తలు
-
Sudan Civil War: సుడాన్లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
-
Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
-
Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్రావు ఫైర్..
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..