YSRCP Leaders: పవన్ కళ్యాణ్ను చంద్రబాబు బలిపశువు చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Leaders: అమరావతిలోని తాడేపల్లిలో వైసీపీ కాపు, రెడ్డి, కమ్మ కార్పొరేషన్ల ఛైర్మన్లు శుక్రవారం మధ్యాహ్నం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కులాల ఛైర్మన్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇంటిపై రెక్కీ తన ఆధ్వర్యంలోనే జరిగిందని ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నానని రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్ సత్యనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. తన కారు పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కారు కాదని స్పష్టం చేశారు. అది గుజరాత్ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న కారు అన్నారు. రెడ్డి, కాపు సామాజిక వర్గాలను విడగొట్టాలని చూస్తున్నారని.. రెక్కీ నిర్వహించిన వారు చంద్రబాబు, లోకేష్తో ఫోటోలు దిగారని తెలిపారు. విశాఖలో జనసేన కార్యకర్తలు మంత్రులపై దాడులు చేశారని గుర్తుచేశారు.
Read Also: Kantara Star Rishabh Shetty: ‘కాంతార’ స్టార్ను కలిసిన మిస్టర్ 360
Also Read
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
- Heart Attack: డోన్లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
అటు ఏపీలో కాపు సామాజిక వర్గంపై కుట్ర జరుగుతోందని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర రెక్కీ చేసిన వారు కమ్మ సామాజికవర్గం వారే అని అన్నారు. పవన్ కళ్యాణ్పై ఎవరు కుట్ర చేస్తున్నారో జన సైనికులు తెలుసుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్పై రెక్కీ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని.. గత ఎన్నికల సమయంలో టీడీపీ వాళ్ళు కుట్ర చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించినట్లు గుర్తుచేశారు. కేఏ పాల్ కూడా తనపై కుట్ర చేస్తున్నారని అన్నారని చెప్పారు. రెడ్లు, కాపుల మధ్య విభేదాలు సృష్టిస్తే ఎవరికి లాభమో తెలుసుకోవాలన్నారు. కాపు సంఘాలు, పెద్దలు ఈ శక్తులను బయటకు తీయాలన్నారు. ఈ విషయంపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కులాల మధ్య కుంపట్లు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని.. పవన్ కళ్యాణ్ను చంద్రబాబు బలిపశువు చేస్తున్నారని కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ ఆరోపించారు. చంద్రబాబు తన వయసుకు తగ్గట్లు వ్యవహరిస్తే హుందాగా ఉంటుందని హితవు పలికారు.
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!