YSRCP Formation Day: జగన్ 30ఏళ్ళు సీఎంగా ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రి ఆదిమూలపు సురేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు పార్టీ పెద్దలు.
అతి కొద్ది కాలంలోనే మనం అధికారంలోకి వచ్చాం. రాష్ట్ర ప్రజలంతా మన పార్టీ వైపు చూస్తున్నారు. నవరత్నాల్లాంటి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం అభివృద్ధి పధంలో నడుస్తోంది. ప్రతి కార్యకర్త కష్టమే పార్టీ ఇంత బలంగా ఉండటానికి కారణం. వారందరినీ పార్టీ మర్చిపోదు.. అందరికీ సమన్యాయం జరుగుతుంది. పార్టీ బలోపేతానికి పునరంకితం అవుదాం. రానున్న రోజుల్లో పార్టీని అధికారంలో నిలబెట్టేలా కష్టపడదాం. వైఎస్ జగన్ మూడు దశాబ్దాలు సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్,
Also Read
- Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
- Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
- Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ నడుస్తోంది. ఒక సమర్థమైన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిరూపించుకున్నారు. మనమంతా ప్రజల కోసం సమైక్యంగా ముందుకు నడవాలి. రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా తుది దశకు వచ్చాయి. మన నాయకుడు ఆలోచన అందరికీ న్యాయం చేయడమే అన్నారు.
విజయవాడలో…
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. నియోజకవర్గం లోని పలు డివిజన్లల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్. వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు దేవినేని అవినాష్.
ప్రతిపక్ష నేతగా జగన్ సుదీర్ఘ కాలం పాటు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్న జగన్ ముఖ్యమంత్రి కాగానే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి ఇప్పటికీ ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతికే ఉన్నారు.
రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలను స్మరించుకుంటూ వాడవాడలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఒక్క ఎంపీ ఒక్క ఎమ్మెల్యే తో మొదలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం 151 ఎమ్మెల్యేలకు 22 ఎంపీలకు చేరింది. జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు చేస్తుంటే మరో ముప్పై సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండటం ఖాయంగా కనిపిస్తుందన్నారు దేవినేని అవినాష్.
తాజావార్తలు
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!