Andhra Pradesh: ఒకే ఫ్రేములో వైసీపీ, టీడీపీ ఎంపీలు.. వైరల్ అవుతున్న ఫోటోలు
Andhra Pradesh: విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టులో అంతర్జాతీయ విమాన సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా విజయవాడ-షార్జా మధ్య రాకపోకలు కూడా ప్రారంభం కావడంతో షార్జా నుంచి విమానం గన్నవరం చేరుకుంది. షార్జా వెళ్లే విమాన సర్వీసును గన్నవరం విమానాశ్రయం నుంచి వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి… టీడీపీ ఎంపీ కేశినేని నానితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు ఎంపీలు షార్జా విమానం ఎక్కిన ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు అందజేశారు. సాయంత్రం 6:30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఎయిరిండియా విమానం షార్జాకు బయలుదేరింది. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రతి సోమవారం, శనివారం షార్జాకు నేరుగా విమాన సేవలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. కాగా ఒకే ఫ్రేములో వైసీపీ, టీడీపీ ఎంపీలు ఉండటంతో పలువురు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.
గన్నవరం నుంచి షార్జాకు విమాన సేవలు ప్రారంభం కావడం సంతోషంగా ఉందని వైసీపీ ఎంపీ బాలశౌరి వెల్లడించారు. స్థానిక పార్లమెంటు సభ్యునిగా, ఎయిర్పోర్టు డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్గా అనేక సార్లు అంతర్జాతీయ విమాన సేవల కోసం ప్రయత్నాలు చేశానని తెలిపారు. చివరకు తమ ప్రయత్నం ఫలించిందని.. భవిష్యత్లో గన్నవరం నుంచి సింగపూర్, థాయ్లాండ్, బ్యాంకాక్కు విమానాలు నడిచేలా ప్రయత్నిస్తామని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. షార్జా విమానానికి రద్దీ పెరిగితే ప్రతిరోజూ ఈ సర్వీసు నడిచేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
అటు టీడీపీ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. 2014కు ముందు గన్నవరం ఎయిర్పోర్టు బస్టాండ్ కంటే హీనంగా ఉండేదని.. అలాంటి ఎయిర్పోర్టులో ఇప్పుడు షార్జాకు విమాన సేవలు ప్రారంభం కావడం శుభపరిణామం అని తెలిపారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఎయిర్పోర్టు ఎంతో అభివృద్ధి చెందిందని వెల్లడించారు. గన్నవరం ఎయిర్పోర్టు అభివృద్ధి చేసిన క్రెడిట్ చంద్రబాబు, అప్పటి కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజులదేనని పేర్కొన్నారు. తనకు టాటా సంస్థలతో ఉన్న రిలేషన్స్తో మరిన్ని అంతర్జాతీయ విమానాలు విజయవాడ నుంచి తిరిగేలా కృషి చేస్తానని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు.
At the ceremonial launch of Air India Express flight from Vijayawada to Sharjah at Gannavaram Airport. pic.twitter.com/tYoN02kWSp
— Journey with Jogu (@JogulambaV) October 31, 2022
తాజావార్తలు
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
-
TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
-
Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?