Rachamallu SivaPrasad Reddy: మందుబాబుల వల్లే ఓటమిపాలయ్యా..! మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- మందు తాగే తమ్ముళ్ల వల్లే గత ఎన్నికల్లో ఓటమి..
- వైసీపీతో పాటు తాను వారివల్లే ఓటమి పాలయ్యాను..
- మందు బాబులను, మద్యం వ్యాపారులను చంద్రబాబు మోసం చేశారు..
- ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rachamallu SivaPrasad Reddy: గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని ముఠగట్టుకుంది.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయాన్ని అందుకుంది.. అయితే, ఇప్పటి వరకు ఆ ఓటమిపై రకరకాల విశ్లేషలు వచ్చాయి.. తాజాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. మందు తాగే తమ్ముళ్ల వల్లే గత ఎన్నికల్లో వైసీపీతో పాటు తాను ఓటమి పాలయ్యాని అని వ్యాఖ్యానించారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి. మా ప్రభుత్వంలో నాసిరకం మద్యం అమ్ముతున్నారని కూటమి నేతలు ఎన్నికల్లో చేసిన మాటలు నమ్మి మందు బాబులు కూటమికి ఓట్లు వేశారని పేర్కొన్నారు. అయితే, ఎన్నికల తర్వాత మందు బాబులను, మద్యం వ్యాపారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారంటూ.. కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. నాడు ప్రభుత్వం అమ్మిన మద్యమే నేడు ప్రైవేటు వ్యాపారులు అమ్ముతున్నారని విమర్శించారు.. నాడు విషం అని చెప్పిన మద్యం, నేడు అమృతంగా మారిందా? అని ప్రశ్నించారు.
Read Also: AlluArjun : ‘పుష్ప-2’ ట్రైలర్పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కామెంట్స్ వైరల్!
Also Read
ఇక, తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పి, నేడు అదే తమ ప్రభుత్వ హయాంలోని మద్యాన్ని అమ్ముతున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి. నేడు మంచినీళ్లు లేకపోయినా మద్యం మాత్రం ఏరులై పారుతోందని అంటూ ఆరోపించారు.. మద్యం ధరలు తగ్గించకుండా ప్రజలను మోసం చేశారు.. అదే విధంగా మద్యం వ్యాపారులను కూడా మోసం చేశారు.. 20 శాతం మార్జిన్ ఇస్తామని హామీ ఇవ్వడంతో అధిక సంఖ్యలో వ్యాపారులు టెండర్లు దాఖలు చేశారు… మద్యం షాపుల లాటరీ ముగిసిన తర్వాత 9:30 శాతాన్ని మాత్రమే ఇస్తామని వ్యాపారులను మోసం చేశారని.. విచ్చలవిడిగా బెల్ట్ షాపులను ఓపెన్ చేయడం వల్ల మద్యం ఏరులై పారుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!