YS Vimala Reddy: అవినాష్ రెడ్డిని టార్గెట్ చేశారు.. సునీత వెనుక దుష్టశక్తులున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Vimala Reddy Sensational Comments On YS Viveka Case: వైఎస్ వివేకా హత్యపై వైఎస్సార్ సోదరి వైఎస్ విమలారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాను చంపిన వారు బయట తిరుగుతున్నారని, తప్పు చేయని వారిని మాత్రం జైల్లో పెట్టారని పేర్కొన్నారు. ఈ కేసులో అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసి వేధిస్తున్నారని చెప్పారు. బుధవారం వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చిన విమలారెడ్డి.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. శ్రీలక్ష్మి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని, ఆమె ఇంకా లిక్విడ్స్పైనే ఉందని, మృత్యువు దగ్గరికి వెళ్లి వచ్చిందని తెలిపారు. భర్త జైలులో ఉండడం, కొడుకు అవినాష్ జైలుకు వెళ్తారని ప్రచారం జరుగుతుండటంతో.. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందన్నారు. అవినాష్ రెడ్డిపై అసత్య ఆరోపణలు వస్తుండటం వల్లే.. శ్రీలక్ష్మి తల్లడిల్లిపోతోందని చెప్పారు. ఆమె ఉపవాసాలు ఎక్కువ చేస్తోందని, దీంతో లోబీపీ వచ్చిందని స్పష్టం చేశారు.
Child Marriage: దారుణం.. డబ్బుల కోసం ఏడేళ్ల బాలికతో 38 ఏళ్ల వ్యక్తి పెళ్లి
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని టార్గెట్ చేశారని, ఏ తప్పు చేయని అతడ్ని టార్గెట్ చేయడం ఏమాత్రం సరికాదని విమలారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేయని వాళ్లు బాధపడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. వివేకా హత్యలో అవినాష్ ప్రమేయం ఏమాత్రం లేదని, ఇప్పటికే అవినాష్ ఏడుసార్లు విచారణకు హాజరయ్యారని, అయినా మీడియా ఎందుకు ఇంత హడావుడి చేస్తుందో అర్థం కావడం లేదని చెప్పారు. వివేకాను చంపిన వ్యక్తులు బయట తిరుగుతుంటే.. తప్పు చేయని అవినాష్ కుటుంబం మాత్రం ఎంతో బాధపడుతోందని వెల్లడించారు. మొదట తన కుటుంబం ఎవరినీ హత్య చేయలేదని చెప్పిన సునీత.. ఆ తర్వాత ఆమె మాట మార్చిందన్నారు. ఇది తప్పు అని తాము చెప్పినందుకు.. సునీత తమతో మాట్లాడడం మానేసిందన్నారు. ఆమె ఎందుకలా మాట మార్చిందో తెలిదయన్నారు. సునీత వెనుక కొన్ని దుష్టశక్తులు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఆలస్యమైనా న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో అవినాష్ ఉన్నారని తెలియజేశారు.
Daggubati Purandeswari: ఏపీ ప్రభుత్వంపై పురంధేశ్వరి సంచలన ఆరోపణలు
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!