YS Jagan : ఇవన్నీ మానవ తప్పిదాలు.. చంద్రబాబు సృష్టించిన విపత్తు ఇది
- వైసీపీ హయాంలో ఆర్బీకేల వ్యవస్థ అప్రమత్తంగా ఉండేది
- ప్రతి పంటకూ ఈ-క్రాప్ చేసేవాళ్లం
- ఉచిత పంటల బీమాతో రైతులకు భరోసా ఉండేది
- కానీ కూటమి ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసింది
- ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు
- ఇవన్నీ మానవ తప్పిదాలు
- ఈ ప్రభుత్వం రైతుల నడ్డి విరిచింది
- చంద్రబాబు సృష్టించిన విపత్తు ఇది. -వైఎస్ జగన్
YS Jagan : ఆంధ్రప్రదేశ్లో మొంథా తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈ తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. “తుఫాన్ కారణంగా పంటలు బాగా నష్టపోయాయి. ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి. పైరు పొట్ట దశలో ఉన్నప్పుడు తుఫాన్ తాకి దిగుబడులు తగ్గిపోయాయి. నేలకొరిగిన పంట తిరిగి నిలబడే అవకాశం లేదు. దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపగా, 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి,” అని తెలిపారు.
11 లక్షల ఎకరాల్లో వరి, 1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 లక్షల ఎకరాల్లో వేరు శనగ, 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.9 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు నష్టపోయాయని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో ఆర్బీకే వ్యవస్థ అప్రమత్తంగా ఉండేదని, ప్రతి పంటకూ ఈ-క్రాప్ చేసేవాళ్లమన్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు సమన్వయంతో రైతులకు సహాయంగా నిలిచేవని, ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు భరోసా ఇచ్చామన్నారు జగన్.
Also Read
- Andhra Pradesh: ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్.. అర్హులందరికీ పూర్తి స్థాయి పదోన్నతులు..
- Trisha Visits Tirumala: తమిళనాడు ఫలితాల ముందు తిరుమలలో హీరోయిన్ త్రిషా దర్శనం.. టీవీకే విజయానికి ప్రార్థనలు..?
- PV Sindhu : మ్యాజిక్ డ్రెయిన్స్తో పల్లెల్లో సరికొత్త విప్లవం
- Blood Shortage: సమ్మర్లో బ్లడ్ బ్యాంకులకు గడ్డు పరిస్థితి
85 లక్షల మంది రైతులు బీమా పరిధిలో ఉండేవారని, 70 లక్షల ఎకరాలు పంట బీమా కవరేజ్లో ఉండేవని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రీమియం కట్టిన రైతుల్లో 19 లక్షల మందికి మాత్రమే బీమా అందుబాటులో ఉందని జగన్ తెలిపారు. మిగతా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.
“ఈ 16 నెలల్లో అల్పపీడనలు, వాయుగుండాలు, తుపాన్లు 16 సార్లు వచ్చాయి. కానీ నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోలేకపోయింది. ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. ఇ-క్రాప్ వ్యవస్థను నీరుగార్చేశారు,” అని ఆయన విమర్శించారు. అలాగే, “మిర్చికి క్వింటాలుకు రూ.11,781 ఇస్తామని మాట ఇచ్చారు, కానీ రైతుకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. పొగాకు, మామిడి, ఉల్లి వంటి పంటలకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేదు. ఇవన్నీ మానవ తప్పిదాలు, చంద్రబాబు పాలనలో సృష్టించిన విపత్తు ఇది,” అని వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా.. వైసీపీ ప్రభుత్వం కాలంలో 54.55 లక్షల మంది రైతులకు రూ.7,800 కోట్ల బీమా ఇచ్చాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం రైతుల నడ్డి విరిచేసింది అని ఆయన వ్యాఖ్యానించారు.
రెండు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరకిన ఇన్స్పెక్టర్
తాజావార్తలు
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్డేట్స్ మీకోసం..
-
Tamilanadu : తమిళనాడులో విజయ్ విక్టరీ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా జూనియర్ ఎన్టీఆర్
-
Andhra Pradesh: ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్.. అర్హులందరికీ పూర్తి స్థాయి పదోన్నతులు..
-
BJP Journey In West Bengal: లేఫ్ట్ TO రైట్.. బెంగాల్లో కమల వికాసం?.. 1952 నుంచి 2026 వరకు బీజేపీ ప్రయాణం..
-
Vishwambhara: బర్త్ డే సర్ప్రైజ్.. విశ్వంభరలో త్రిష పాత్ర పేరు రివీల్ చేసిన చిత్ర యూనిట్!
-
Vijay Personal Life Controversy: మళ్లీ తెర పైకి విజయ్ వ్యక్తిగత జీవితం.. 27 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంటాడా..?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!