Vijaya Sai Reddy: చంద్రబాబు ఒట్టు తీసి కరకట్ట గట్టున పెట్టేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YCP MP Vijaya Sai Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. ఈరోజు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అసెంబ్లీలో చంద్రబాబు ఓటు హక్కు వినియోగించుకోవడంపై విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం అయ్యేదాకా అసలు అసెంబ్లీ గడప తొక్కనని గతంలో చంద్రబాబు మంగమ్మ శపథం చేశాడని, ఇప్పుడు ఆ ఒట్టు తీసి గట్టున పెట్టేసి అసెంబ్లీకి వెళ్లి ఓటు వేశాడని విజయసాయిరెడ్డి చురకలు అంటించారు. ఇకపై ఎప్పటికీ సీఎం కాలేనని చంద్రబాబుకు స్పష్టత వచ్చిందని అభిప్రాయపడ్డారు. పచ్చ కుల మీడియా మాత్రం పిచ్చిగా చెలరేగుతోందని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు చంద్రబాబు ఓటు వేసిన వీడియోను, గతంలో చంద్రబాబు ప్రెస్ మీట్లో కంటనీరు పెట్టిన దృశ్యాలను కలిపి ట్విట్టర్లో విజయసాయిరెడ్డి షేర్ చేయగా అది వైరల్గా మారింది.
సీఎం అయ్యేదాకా అసలు అసెంబ్లీ గడపతొక్కనని మంగమ్మ శపథం చేశాడు…ఆ ఒట్టు తీసి కరకట్ట గట్టున పెట్టేసి అసెంబ్లీకి వెళ్లి ఓట్ వేశాడు బాబు. ఇక సీఎం కాలేనన్న క్లారిటీ ఆయనకుంది. పచ్చ కుల మీడియా మాత్రం పిచ్చిగా చెలరేగుతోంది. pic.twitter.com/nDCg9MUxkz
Also Read
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి రైతులకు భారీ ఊరట..
- Police Transfers: పోలీస్ శాఖలో భారీగా బదిలీలు.. రెండేళ్లు పూర్తిచేసిన వారికి అవకాశం..
- Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి.. కొట్టుకుపోయిన పైపులు..
- CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 18, 2022
అటు ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొని ద్రౌపది ముర్ముకు ఓటు వేసినట్లు విజయసాయిరెడ్డి ట్విట్టర్లో వెల్లడించారు. ఈ ఎన్నిక ద్వారా తొలిసారిగా ఒక ఆదివాసీ గిరిజన మహిళ భారత రాష్ట్రపతి కాబోతున్నారని ఆయన చెప్పారు.
ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో ఈరోజు జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొని శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి ఓటు వేయడం జరిగింది. ఈ ఎన్నిక ద్వారా తొలిసారిగా ఒక ఆదివాసీ గిరిజన మహిళ భారత రాష్ట్రపతి కాబోతున్నారు. pic.twitter.com/jHxcBweawS
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 18, 2022
తాజావార్తలు
-
TMC Crisis: మమతా బెనర్జీకి షాక్.. బీజేపీలోకి మాజీ టీఎంసీ ఎంపీలు..
-
CJP: పార్లమెంట్ మార్చ్.. కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియలు పూర్తి.. ట్రంప్నకు వ్యతిరేకంగా నినాదాలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి రైతులకు భారీ ఊరట..
-
Bihar Politics: ఆర్జేడీలో ఇంటిపోరు.. నాపై చర్య తీసుకోవాలని లాలూ కుమార్తె సవాల్..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!