పక్క రాష్ట్రాల్లో ఎక్కడా ఇంత పీఆర్సీ ఇవ్వడం లేదు: చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి స్పందించారు. కరోనాతో ఆర్థిక పరిస్థితులు దిగజారినా.. ఉద్యోగులు అడగ్గపోయినా సీఎం 27 శాతం ఐఆర్ ఇచ్చారని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఐఆర్ ఇచ్చి ఉండకపోతే ప్రభుత్వం రూ.18వేల కోట్ల భారం పడి ఉండేది కాదన్నారు. ఐఆర్ ఇవ్వకుండా ఉంటే పెండింగ్లో ఉన్న చిన్న కాంట్రాక్టు బిల్లులన్నీ ప్రభుత్వం చెల్లించి ఉండేదన్నారు. ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా చూస్తున్నామని… ఉద్యోగులను నష్టపరిచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు.
Read Also: వైసీపీ ప్రభుత్వం మతతత్వ ప్రభుత్వం: సోము వీర్రాజు
Also Read
- TDP Leadership Training Conclave: టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.. నేటి నుంచే వర్క్షాప్
- NTR Bharosa Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు.. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇలా..
- Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
- Fire Accident: ఆటోనగర్లోని హ్యుందాయ్ కార్ల షోరూమ్లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..
ప్రభుత్వ ఉద్యోగులను బానిసలుగా చూసి, కించపరిచిన వారిని గత ప్రభుత్వంలో చూశామని శ్రీకాంత్రెడ్డి అన్నారు. బహిరంగ వేదికలపై ప్రభుత్వ ఉద్యోగులను అవమానించిన పరిస్థితి గతంలో ఉండేదన్నారు. ద్వేషించే వారి ట్రాప్లో ఉద్యోగులు పడవద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. హెచ్ఆర్ఏపై ప్రభుత్వం పునరాలోచన చేస్తుందన్నారు. దీనిపై ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని.. ఇప్పటికే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు పెంచినట్లు గుర్తుచేశారు. ఉద్యోగులు పునరాలోచన చేయాలని.. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ మొండిగా వ్యవహరించదన్నారు. ప్రభుత్వంపై పదివేల కోట్ల భారం పడుతున్నా 23శాతం ఫిట్మెంట్ ఇచ్చామన్నారు. ఉద్యోగులు పీఆర్సీపై తెలంగాణతో పోల్చి చూసుకోవాలని సూచించారు. పక్క రాష్ట్రాల్లో ఎక్కడా ఇంత పీఆర్సీ లేదన్నారు. ఉద్యోగులు తమ వైపు నుంచే కాకుండా ప్రభుత్వం వైపు నుంచి కూడా చూడాలన్నారు. ఉద్యోగులు ఏకపక్షంగా రాజకీయ పార్టీల్లాగా ఆలోచించవద్దని హితవు పలికారు. ఉద్యోగులను చర్చలకు పిలిచి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
-
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’లో 20 రోజుల అండర్వాటర్ ఫైట్.. అవుట్ పుట్ పై సాలిడ్ రిపోర్ట్స్!
-
Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
TDP Leadership Training Conclave: టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.. నేటి నుంచే వర్క్షాప్
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!