Extramarital Affair: ప్రియుడి మోజులో భర్తని చంపించింది.. 24 గంటల్లోనే బుక్కైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Killed Her Husband With Help Of Boyfriend: పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత.. తన భర్త అడ్డు తొలగించేందుకు మరణ శాసనం రాసింది. ప్రియుడితోనే భర్తను హత్య చేయించింది. ఆపై ఏమీ ఎరుగనట్టుగా డ్రామాలు ఆడింది. అయితే.. ఆ డ్రామా తేడా కొట్టడంతో, అడ్డంగా దొరికిపోయింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. లారీ డ్రైవర్గా పని చేస్తున్న అప్పారావు, విశాఖ నగరం వియ్యపు వానిపాలెంలో తన భార్య ఉమ, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. మద్యానికి బానిసైన అప్పారావు.. తాను సంపాదించిన మొత్తాన్ని తాగుడుకే పెట్టేవాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో.. భార్య ఉమ పనిలో చేరింది. ఈ క్రమంలోనే ఆమెకు సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతున్న వెంకటరెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. అటు.. అప్పారావుతోనూ స్నేహం కుదరడంతో, వారి ఇంటికి వెంకటరెడ్డి వచ్చి వెళ్తుండేవాడు.
కట్ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత భర్త అప్పారావు తనని రోజూ వేధిస్తున్నాడని, అతనితో ఇక ఉండలేనని వెంకటరెడ్డికి ఉమ చెప్పింది. దాంతో.. అప్పారావుని చంపాలని స్కెచ్ వేశారు. ప్లాన్ ప్రకారం.. శనివారం ఒక పని పడిందని చెప్పి, అప్పారావుని వెంకటరెడ్డి తనతోపాటు తీసుకెళ్లాడు. వీరితో పాటు మరో సెక్యూరిటీ గార్డు సింహాచలం కూడా ఉన్నాడు. ఒక బార్లో మద్యం సేవించిన తర్వాత.. గాజువాక 80 ఫీట్ రోడ్లోని వికేఆర్ టవర్స్కు ముగ్గురు వెళ్లారు. అక్కడే సెల్లార్లో ఒక కిటికీ చెక్కతో అప్పారావు తలపై వెంకటరెడ్డి మూడుసార్లు బలంగా మోదాడు. ఆ దెబ్బలకు అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. సింహాచలం సహకారంతో స్కూటర్పై అప్పారావు మృతదేహాన్ని ఒక సర్వీస్ రోడ్డు వద్ద పడేసి వెళ్లిపోయారు. ఈ జరిగిన విషయాలన్నింటినీ ఉమకి ఫోన్లో చేరవేశాడు వెంకటరెడ్డి. పని పూర్తయ్యిందని, అప్పారావు చనిపోయాడని మెసేజ్ పెట్టాడు.
Also Read
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. భూములిచ్చేవారికి కౌలు రూ.40 వేలు..
- Minister Parthasarathy: జగన్పై మంత్రి పార్థసారథి ఫైర్.. విద్వేష రాజకీయాలతో అధికారంలోకి రావాలనుకుంటున్నారు..!
- Minister Kolusu Parthasarathy: ఏపీలో పేదలకు శుభవార్త.. 9 లక్షలకు పైగా ఇళ్ల దరఖాస్తులకు అర్హత
- Chinta Mohan: అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఆదివారం ఉదయం ఆ మృతదేహాన్ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అప్పారావు భార్య ఉమ కూడా అక్కడికి చేరుకొని, ‘బంగారం లాంటి తన భర్తను ఎవరో చంపేశారే’ అంటూ బోరున విలపించింది. అప్పుడే ఉమ వ్యవహార శైలిపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఆలస్యం చేయకుండా.. ఆమె సెల్ఫోన్ కాల్ డేటాని పరిశీలించారు. వెంకట్రెడ్డితో వివాహేతర సంబంధం ఉందని తేలడంతో.. అతనితో పాటు ఉమని తమదైన శైలిలో విచారించారు. తమ వివాహేతర సంబంధం కోసమే అప్పారావుని చంపేశామని నేరం అంగీకరించారు. ఆ ఇద్దరితో పాటు సింహాచలంని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 24 గంటల్లోనే పోలీసులు ఈ కేసుని చేధించారు.
తాజావార్తలు
-
Satya Dev: రావు బహదూర్’లో నగ్నంగా నటించాలన్నారు
-
Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
-
IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
-
Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!