ఏపీలోని ఆ జిల్లాలోనే కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రోజు 35 వేలకు పైగా టెస్టులు చేస్తుండగా ఆరు నుంచి ఏడు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసుల శాతం క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 35 వేల టెస్టులు చేస్తేనే ఏడువేలకు పైగా కేసులు వస్తే ఇక లక్ష వరకు రోజువారీ టెస్టులు నిర్వహిస్తే ఎన్ని కేసులు వస్తాయో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా చిత్తూరు, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో కేసులు పెరగడంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతం కావడం, అటు చిత్తూరు జిల్లా రెండు రాష్టాల సరిహద్దుల్లో ఉండటం, తూర్పు గోదావరికి విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో కేసులు పెరుగుతున్నాయని అనుకోవచ్చు. మొదటి వేవ్ లో కూడా గుంటూరు, తూర్పుగోదావరితో పాటుగా చిత్తూరు జిల్లాలోనే కేసులు అధికంగా నమోదవుతూ వచ్చాయి. సెకండ్ వేవ్ లో కూడా కేసులు ఆ మూడు జిల్లాల నుంచే అధికంగా ఉండటంతో అధికారులు ఆయా జిల్లాలపై దృష్టి సారించారు. మొదటిదశ కరోనా క్రమంగా తగ్గుముఖం పట్టిన తరువాత ప్రజలు మాస్క్ లను పక్కన పెట్టడంతో పాటుగా ఎన్నికల నిర్వహణ సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఒక చోట గుమికూడటం వలన కూడా కరోనా చాపకింద నీరులా వ్యాప్తి చెంది ఉండొచ్చు.
Also Read
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..