Karthika Masam 2025: కార్తీక సోమవారం ఎఫెక్ట్.. గోదావరి నదిలో కిటకిటలాడుతున్న స్నాన ఘట్టాలు..
- కార్తీక సోమవారం ఎఫెక్ట్..
- భక్తులతో కిటకిటలాడుతున్న గోదావరి నది..
- స్నాన ఘాట్లలో కార్తీక స్నానాలు చేస్తున్న భక్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthika Masam 2025: కార్తీక మాసం మూడవ సోమవారం కావడంతో దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజమండ్రిలోని స్నాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి నదిలో భక్తులు వేలాదిగా తరలి వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. రాజమండ్రి చుట్టూ ప్రక్కల నుండి భారీగా భక్తులు పుష్కరఘాట్ కు తరలి వస్తున్నారు. స్నానాలు ఆచరించి పూజా కార్యక్రమాలు అనంతరం గోదావరి లో కార్తీక దీపాలు వదులుతున్నారు. రాజమండ్రి కోటి లింగాల ఘాట్ , మార్కండేయ ఘాట్, సరస్వతి ఘాట్, గౌతమీ ఘాట్ లతోపాటు కొవ్వూరు గోష్పాదక్షేత్రంలోనూ భక్తులు కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు. చలికి వణుకుతూ శివ శివ అంటూ. గోదావరి నదిలో మూడు మునుగులు మునుగుతున్నారు. భక్తులు శివనామ స్మరణతో స్నాన ఘట్టాలు మార్మోగుతున్నాయి.. గోదావరి తీరంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. శివలింగాలకు ప్రత్యేక అభిషేకాలు, పాలాభిషేకాలు. నిర్వహిస్తున్నారు.
Read Also: Mohan Bhagwat: పాకిస్థాన్కు నష్టం కలిగేలా భారత్ ఓడించాలి..
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..
- Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!
తూర్పు గోదావరి జిల్లాలో కార్తీక మాసం మూడో సోమవారం కావడంతో భక్తులు గోదావరి స్నానాలు ఆచరిస్తున్నారు.. గోష్పాద క్షేత్రంలోని సుందరేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు.. భక్తులు కార్తీక దీపాలను గోదావరిలో వదిలి స్వామిని దర్శించుకుంటున్నారు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం మండలం ద్రాక్షారమ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మారుమోగుతుంది.. కార్తీక మాసం మూడవ సోమవారం కావడంతో శ్రీ మాణిక్యం సమేత భీమేశ్వర స్వామివారిని తెల్లవారుజామున ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు . స్వామివారిని పెద్ద సంఖ్యలో వచ్చి భక్తులు దర్శించుకుంఉటన్నారు.. ఉదయం నుండి సప్త గోదావరిలో స్నానాలు ఆచరించి , దీపాలను గోదావరిలో వదిలి స్వామివారి దర్శించుకుంటున్నారు భక్తులు .
తాజావార్తలు
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
-
Harshad Chopra: 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?.. ప్రముఖ టీవీ నటుడు ఎమోషనల్ కామెంట్స్
-
Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!