Ram Mohan Naidu: ఏపీలో ప్రస్తుతం 7 విమానాశ్రయాలను 14కు పెంచాలని నిర్ణయం..
- ఏపీలో విమానాశ్రయాల అభివృద్ధిపై కేంద్రమంత్రి- ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష.. ఏపీలో ప్రస్తుతం 7 విమానాశ్రయాలను 14కు పెంచాలని నిర్ణయం..
- పుట్టపర్తిలో ఉన్న ప్రైవేట్ ఎయిర్ పోర్టును కూడా అభివృద్ధి చేస్తాం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mohan Naidu: ఏపీలో విమానాశ్రయాల అభివృద్ధిపై కేంద్రమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఏపీలో ప్రస్తుతం ఉన్న 7 విమానాశ్రయాలను 14కు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే, పుట్టపర్తిలో ఉన్న ప్రైవేట్ ఎయుర్ పోర్ట్ ను కూడా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నాం.. 500 నుంచి 700 ఎకరాలు ఉంటేనే చిన్న ఎయర్ పోర్ట్ లు అభివృద్ధి చేయవచ్చు.. పెద్ద ఎయిర్ పోర్ట్ లు నిర్మించాలంటే, కనీసం 3 వేల ఎకరాలకు పైగా భూమి కావాలి అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Read Also: Rajasthan: విద్యార్థుల మధ్య గొడవ, కత్తి పోట్లు.. ఉదయ్పూర్లో మతహింస..
Also Read
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
- Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
ఇక, పెద్ద ఎత్తున కోస్తా తీరం అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఉంది అని కేంద్ర పౌర విమానయన మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని ఏపీ సీఎం సూచించారు. హెలికాప్టర్ల వినియోగంను పెద్ద ఎత్తున పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నాం.. ఏపీలో డ్రోన్ల వ్యవస్థను కూడా బాగా అభివృద్ధి చేయాలని నిర్ణయుంచాం.. డ్రోన్లకు సంబంధించి ఒక పెద్ద కార్యక్రమాన్ని అతి త్వరలో ఏపీలో నిర్వహిస్తాం.. ప్రస్తుతం ఏపీలో అభివృద్ది జరుగుతున్న ఎయిర్ పోర్ట్ ల నిర్మాణ పనులను నిర్దిష్ట సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.. నాగార్జున సాగర్, కుప్పం, దిగదుర్తి (ఒంగోలు), తుని-అన్నవరం, తాడేపల్లిగూడెంలో కొత్త ఎయిర్ పోర్ట్ ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. అలాగే “ఎయుర్ పోర్ట్ అధారిటీ” కి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయుస్తే తొందరలోనే ఎయిర్ పోర్టు నిర్మించే బాధ్యత తీసుకుంటుంది అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!