YS Jagan: అసెంబ్లీ సమావేశాలు మేం బహిష్కరించలేదు..
- అసెంబ్లీ సమావేశాలు మేం బహిష్కరించలేదు..
- అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో కోర్టుకు వెళ్లాం..
- లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఏం సంబంధం..
- ప్రలోభాలకు లొంగో, భయపడో పోతే విశ్వసనీయత సంగతేంటి?: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: తాడేపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినే, మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు మేం బహిష్కరించలేదని తేల్చి చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో కోర్టుకు వెళ్లామన్నారు. ఇక, నాకు ప్రతిపక్ష నేత హోదాపై కోర్టుకు స్పీకర్ సమాధానం చెప్పాలని డిమాడ్ చేశారు. ఇక, స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోర్టుకు స్పందించడం లేదు.. అన్ని ప్రశ్నలకు వాళ్లు సమాధానం చెప్పాలి అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే.. ఏం చేసుకున్నా వాళ్ల ఇష్టమని పేర్కొన్నారు. నా ఆరోపణలకు వాళ్లు సమాధానం చెప్పాలి.. ఎదురెదురుగా ఉండి కొట్టుకోవడం ఎందుకు అని వైఎస్ జగన్ అన్నారు.
Read Also: YS Jagan: గ్యారంటీలు అమలు చేయకపోతే చొక్కా పట్టుకొని నిలదీయమన్నారు..
Also Read
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
అలాగే, లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఏం సంబంధం అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. మిథున్ రెడ్డి తండ్రి ఏ శాఖ మంత్రి.. ఆయనకు మద్యానికి సంబంధమేంటి?.. ఎవరో ఒకర్ని ఇరికించడం.. కేసు పెట్టడం వాళ్లకు అలవాటేనని సెటైర్లు వేశారు. ఇక, ఎవరైనా ఎందుకు డబ్బులు ఇస్తారు.. మద్యం రేట్లు మేం పెంచామా?.. మద్యం బేసిక్ రేట్లు పెంచి.. సరఫరా తగ్గించిన నాకు లంచాలు ఇస్తారా?.. రేట్లు పెంచి సరఫరా పెంచిన చంద్రబాబుకు మమూళ్లు ఇస్తారా? అని క్వశ్చన్ చేశారు. నాలాగా ఎందుకు చంద్రబాబు బటన్ నొక్కలేకపోతున్నాడు? అని జగన్ ప్రశ్నించారు.
Read Also: Mahindra XUV400 : బంఫర్ ఆఫర్.. ఈ మహీంద్రా ఎలక్ట్రిక్ కారుపై ఏకంగా 4లక్షల తగ్గింపు!
ఇక, నాకు డబ్బుపై వ్యామోహం లేదు అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. అందుకే డీబీటీలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలను ఇచ్చామన్నారు. బయటకు వెళ్లే ప్రతి రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత ఉండాలి.. ప్రలోభాలకు లొంగో, భయపడో లేక రాజీపడో అటు పోతే విశ్వసనీయత సంగతేంటి? అని అడిగారు. రాజకీయాల్లో కష్టాలు ఉంటాయి.. ఐదేళ్లు కష్టపడితే మనం టైం వస్తుంది.. విశ్వసనీయత ముఖ్యం.. ఇది విజయసాయిరెడ్డికైనా.. మిగతావారికైనా అని వైఎస్ జగన్ సూచించారు.
తాజావార్తలు
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
Ethanol in Diesel: డీజిల్లో ఇథనాల్కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!