YS Jagan: అసెంబ్లీ సమావేశాలు మేం బహిష్కరించలేదు..
- అసెంబ్లీ సమావేశాలు మేం బహిష్కరించలేదు..
- అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో కోర్టుకు వెళ్లాం..
- లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఏం సంబంధం..
- ప్రలోభాలకు లొంగో, భయపడో పోతే విశ్వసనీయత సంగతేంటి?: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: తాడేపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినే, మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు మేం బహిష్కరించలేదని తేల్చి చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో కోర్టుకు వెళ్లామన్నారు. ఇక, నాకు ప్రతిపక్ష నేత హోదాపై కోర్టుకు స్పీకర్ సమాధానం చెప్పాలని డిమాడ్ చేశారు. ఇక, స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోర్టుకు స్పందించడం లేదు.. అన్ని ప్రశ్నలకు వాళ్లు సమాధానం చెప్పాలి అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే.. ఏం చేసుకున్నా వాళ్ల ఇష్టమని పేర్కొన్నారు. నా ఆరోపణలకు వాళ్లు సమాధానం చెప్పాలి.. ఎదురెదురుగా ఉండి కొట్టుకోవడం ఎందుకు అని వైఎస్ జగన్ అన్నారు.
Read Also: YS Jagan: గ్యారంటీలు అమలు చేయకపోతే చొక్కా పట్టుకొని నిలదీయమన్నారు..
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
అలాగే, లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఏం సంబంధం అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. మిథున్ రెడ్డి తండ్రి ఏ శాఖ మంత్రి.. ఆయనకు మద్యానికి సంబంధమేంటి?.. ఎవరో ఒకర్ని ఇరికించడం.. కేసు పెట్టడం వాళ్లకు అలవాటేనని సెటైర్లు వేశారు. ఇక, ఎవరైనా ఎందుకు డబ్బులు ఇస్తారు.. మద్యం రేట్లు మేం పెంచామా?.. మద్యం బేసిక్ రేట్లు పెంచి.. సరఫరా తగ్గించిన నాకు లంచాలు ఇస్తారా?.. రేట్లు పెంచి సరఫరా పెంచిన చంద్రబాబుకు మమూళ్లు ఇస్తారా? అని క్వశ్చన్ చేశారు. నాలాగా ఎందుకు చంద్రబాబు బటన్ నొక్కలేకపోతున్నాడు? అని జగన్ ప్రశ్నించారు.
Read Also: Mahindra XUV400 : బంఫర్ ఆఫర్.. ఈ మహీంద్రా ఎలక్ట్రిక్ కారుపై ఏకంగా 4లక్షల తగ్గింపు!
ఇక, నాకు డబ్బుపై వ్యామోహం లేదు అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. అందుకే డీబీటీలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలను ఇచ్చామన్నారు. బయటకు వెళ్లే ప్రతి రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత ఉండాలి.. ప్రలోభాలకు లొంగో, భయపడో లేక రాజీపడో అటు పోతే విశ్వసనీయత సంగతేంటి? అని అడిగారు. రాజకీయాల్లో కష్టాలు ఉంటాయి.. ఐదేళ్లు కష్టపడితే మనం టైం వస్తుంది.. విశ్వసనీయత ముఖ్యం.. ఇది విజయసాయిరెడ్డికైనా.. మిగతావారికైనా అని వైఎస్ జగన్ సూచించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!