YS Jagan: అసెంబ్లీ సమావేశాలు మేం బహిష్కరించలేదు..
- అసెంబ్లీ సమావేశాలు మేం బహిష్కరించలేదు..
- అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో కోర్టుకు వెళ్లాం..
- లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఏం సంబంధం..
- ప్రలోభాలకు లొంగో, భయపడో పోతే విశ్వసనీయత సంగతేంటి?: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: తాడేపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినే, మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు మేం బహిష్కరించలేదని తేల్చి చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో కోర్టుకు వెళ్లామన్నారు. ఇక, నాకు ప్రతిపక్ష నేత హోదాపై కోర్టుకు స్పీకర్ సమాధానం చెప్పాలని డిమాడ్ చేశారు. ఇక, స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోర్టుకు స్పందించడం లేదు.. అన్ని ప్రశ్నలకు వాళ్లు సమాధానం చెప్పాలి అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే.. ఏం చేసుకున్నా వాళ్ల ఇష్టమని పేర్కొన్నారు. నా ఆరోపణలకు వాళ్లు సమాధానం చెప్పాలి.. ఎదురెదురుగా ఉండి కొట్టుకోవడం ఎందుకు అని వైఎస్ జగన్ అన్నారు.
Read Also: YS Jagan: గ్యారంటీలు అమలు చేయకపోతే చొక్కా పట్టుకొని నిలదీయమన్నారు..
Also Read
- 'Thara' Mantra: సైబర్ దొంగల వేటలో ‘టాలీవుడ్ తారలు’.. వైజాగ్ పోలీసుల ‘తార’ మంత్రం మామూలుగా లేదుగా!
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
అలాగే, లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఏం సంబంధం అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. మిథున్ రెడ్డి తండ్రి ఏ శాఖ మంత్రి.. ఆయనకు మద్యానికి సంబంధమేంటి?.. ఎవరో ఒకర్ని ఇరికించడం.. కేసు పెట్టడం వాళ్లకు అలవాటేనని సెటైర్లు వేశారు. ఇక, ఎవరైనా ఎందుకు డబ్బులు ఇస్తారు.. మద్యం రేట్లు మేం పెంచామా?.. మద్యం బేసిక్ రేట్లు పెంచి.. సరఫరా తగ్గించిన నాకు లంచాలు ఇస్తారా?.. రేట్లు పెంచి సరఫరా పెంచిన చంద్రబాబుకు మమూళ్లు ఇస్తారా? అని క్వశ్చన్ చేశారు. నాలాగా ఎందుకు చంద్రబాబు బటన్ నొక్కలేకపోతున్నాడు? అని జగన్ ప్రశ్నించారు.
Read Also: Mahindra XUV400 : బంఫర్ ఆఫర్.. ఈ మహీంద్రా ఎలక్ట్రిక్ కారుపై ఏకంగా 4లక్షల తగ్గింపు!
ఇక, నాకు డబ్బుపై వ్యామోహం లేదు అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. అందుకే డీబీటీలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలను ఇచ్చామన్నారు. బయటకు వెళ్లే ప్రతి రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత ఉండాలి.. ప్రలోభాలకు లొంగో, భయపడో లేక రాజీపడో అటు పోతే విశ్వసనీయత సంగతేంటి? అని అడిగారు. రాజకీయాల్లో కష్టాలు ఉంటాయి.. ఐదేళ్లు కష్టపడితే మనం టైం వస్తుంది.. విశ్వసనీయత ముఖ్యం.. ఇది విజయసాయిరెడ్డికైనా.. మిగతావారికైనా అని వైఎస్ జగన్ సూచించారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..